కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందట!

Publish Date:Apr 12, 2023

Advertisement

మనషుల్ని వేధించే ఆరోగ్య సమస్యలలో ఎన్నో ఉన్నాయి. వాటిలో పార్కిన్సన్స్ వ్యాధి కూడా ఒకటి. పార్కిన్సన్స్ వ్యాధి  మెదడులోని కొన్ని భాగాలలో  ఏర్పడే రుగ్మత, ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. సాధారఁంగా ఉన్న జీవితాన్ని ఒక్కసారిగా కుదుపుకు లోనుచేస్తుంది.   2016 సంవత్సరపు గణాంకాల ప్రకారం, దేశంలో సుమారు 6 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు, అయితే అప్పటికంటే కూడా కరోనా  తర్వాత, పార్కిన్సన్స్ కేసులలో వేగంగా పెరుగుదల కనిపించండం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పార్కిన్సన్స్ వ్యాధిలో నడకలో మార్పు రావడం, దేనినైనా పట్టుకోవడం కష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ సమస్య నివారణ,  అవగాహన కోసం ప్రతి కృషి చెయ్యాలి. 

2019 చివరిలో ప్రారంభమైన కరోనా  యొక్క దుష్ప్రభావాలు పార్కిన్సన్స్ వ్యాధి కేసులను  మరింత  పెంచాయని పరిశోధకులు కనుగొన్నారు. సాధారణంగా ఇది ఒకప్పుడు  వృద్ధాప్య సమస్యగా పరిగణించబడేది, అయితే కరోనా మహమ్మారి తర్వాత అయోమయం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, శరీర భంగిమలో అసమతుల్యత వంటి పార్కిన్సన్స్ వ్యాధి యొక్క నాడీ సంబంధిత లక్షణాలు ప్రజలలో  ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కోవిడ్ వైరస్ కారణంగా మెదడు  కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం  అయ్యాయి. ఈ అంటువ్యాధి తరువాత, పార్కిన్సస్స్  కేసులు  పెరిగాయి. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో , SARS-CoV-2 వైరస్ పార్కిన్సన్స్ వ్యాధి సమయంలో మెదడులో జరిగే మార్పులను కనుగొన్నారు. వైరస్ ప్రభావం కారణంగా  మెదడులో తాపజనక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుందని కనుగొన్నారు. మెదడులోని మైక్రోగ్లియా అనే రోగనిరోధక కణాలపై కరోనా వైరస్ ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. ఈ కణాలు సాధారణంగా పార్కిన్సన్స్ వ్యాధిలో అతిగా చురుగ్గా పనిచేస్తాయి మరియు తాపజనక రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి కోవిడ్ వచ్చినవారు ఈ వ్యాధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

పార్కిన్సన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఇప్పటి వరకు పార్కిన్‌సన్‌ వ్యాధి రావడానికి సరైన కారణం తెలియరాలేదని, దానికి నిర్దిష్టమైన చికిత్స ఏమీ లేదని పరిశోధకులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామం చేయడం, ఆహారంలో యాంటీఆక్సిడెంట్ల పరిమాణాన్ని పెంచడం వల్ల ఈ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పార్కిన్సన్స్ వ్యాధి పెరుగుతోంది, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యకరమైన అలవాట్లు, మంచి పోషకాహారం, మంచి నిద్ర, శారీరక వ్యాయామంతో పాటు మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి. ఇందుకోసం ధ్యానం, ప్రాణాయామం చక్కగా పనిచేస్తాయి. నాడీవ్యవస్థను బలోపేతం చేసే చిట్కాలు పాటించాలి.

                                            ◆  నిశ్శబ్ద

By
en-us Political News

  
నేటికాలంలో ఉపవాసం కేవలం దేవుడు, సంప్రదాయం, మతానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు..  ఫిట్‌నెస్ ప్రపంచంలో కూడా ఉపవాసం  బాగా ప్రాచుర్యం పొందింది. 16:8 డైట్ వంటి పద్ధతుల నుండి రోజుకు ఒకసారి..
మెనోపాజ్ (Menopause) వచ్చిన తర్వాత మళ్లీ బ్లీడింగ్ రావడం సాధారణ విషయం కాదు. చాలా మంది మహిళలు దీనిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు...
టీ లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బ్లాక్ టీ మాత్రమే కాకుండా.. గ్రీన్ టీ తో పాటు కుంకుమ పువ్వు టీ, కార్శీరీ ఖవ్వా టీ, జాస్మిన్ టీ.. ఇలా చాలా రకాలు ఉన్నాయి...
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అన్ని విటమిన్లు , ఖనిజాలు సరైన మోతాదులో అవసరం. శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో  విటమిన్ బి12 ఒకటి, ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో, సరైన నాడీ పనితీరులో..
థైరాయిడ్ సమస్యలు ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఒకటి. అయితే, థైరాయిడ్ రావడానికి మన ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమా..
భారతీయుల భోజనంలో అన్నం చాలా ప్రధానమైనది. అన్నం తినడం వల్ల వచ్చే సాటిసిఫాక్షన్ వేరే ఏ విధంగా రాదని చాలామంది అంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మూడు పూటలా అన్నం తినాలన్నా చక్కగా తినేస్తారు. కానీ ప్రస్తుతం డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలతో అన్నం అంటే దూరం జరిగే వారు చాలామంది ఉన్నారు. ..
బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు, TIA హెచ్చరికలు, గోల్డెన్ పీరియడ్‌లో చికిత్స, నివారణ మార్గాలను ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. అనిరుధ్ దేశ్‌ముఖ్ ఈ వీడియోలో వివరించారు...
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం,  ప్రోటీన్ కూడా ఉంటుంది.  భారతీయులు భోజనం చివర పెరుగుతో తింటే తప్ప వారికి తృప్తి ఉండదు. వేసవి కాలంలో పెరుగును ఇష్టంగా తింటారు.
శరీరంలో వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ ఎందుకు వస్తాయి? పిత్త దోషం లక్షణాలు, కారణాలు, ఆహారం, ఆయుర్వేద చిట్కాలను డా. చి. మధుసూదన్ శర్మ ఈ వీడియోలో వివరించారు.
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు...
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్  సమయంలో టీ తాగడం..
మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్,
పెళ్లయ్యాక ప్రతి భార్యాభర్త పిల్లలను కనడంపై శ్రద్ద పెడతారు. పిల్లలను కనడం,  అమ్మ నాన్న అనిపించుకోవడం జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. అయితే నేటికాలంలో ఆడవారు మాత్రమే కాకుండా...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.