Publish Date:Oct 30, 2024
ఏపీలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి విద్యుత్ షాక్ తగలక తప్పదా? 2022-23 సంవత్సరం ఇంధన,విద్యుత్ కొనుగోలు సర్దుబాటు చార్జీలు రూ.8114 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ విద్యుత్ నియంత్రణమండలికి డిస్కమ్ లు ప్రతిపాదించడం తెలిసిందే. చంద్రబాబు ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచబోమని చెప్పడమే కాకుండా, వీలయితే 30శాతం తగ్గిస్తామని హామీ ఇచ్చారు.
కాని ఇప్పుడు ఏపీఈఆర్సీ కి చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది మోసమని, ప్రభుత్వమే ఈ భారాన్ని భరించాలని వినియోగదారులు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.న వంబర్ నెల నుంచి యూనిట్ రూ.1.58 అదనపు భారం వినియోగదారులపై పడనుందని తెలుస్తున్నది. అయితే ఈ పెంపునకు గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణమని తెలుగుదేశం కూటమి పార్టీలు చెబుతున్నాయి. అయితే విద్యుత్ చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వస్తున్నది. అసలే ధరలు పెరిగి సామాన్యుడు విలవిలలాడుతుంటే విద్యుత్ చార్జీలు పెంచి మరింత ఇబ్బందులకు గురి చేయడం సరికాదని జనం అంటున్నారు. విద్యుత్ చార్జీల పెంపు పాపం అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుడు విధానాలను అవలంబించిన వైసీపీదేనని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే వామపక్షాలు మాత్రం ఈ భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు. తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత ప్రబలేందుకు దోహదం చేస్తుందని అంటున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిన విద్యుత్ భారం ఇప్పటి కూటమి ప్రభుత్వానికి గుదిబండలా మారిందనడంలో సందేహం లేదు. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల అమలు విషయంలోనే నిధుల సమీకరణ ఎలా అని మల్లగుల్లాలు పడుతున్న చంద్రబాబు సర్కార్ కు విద్యుత్ భారాన్ని కూడా మోయడం అంటే తలకు మించిన భారమే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఈ విద్యుత్ షాక్ బారిన పడకుండా చంద్రబాబు సర్కార్ ఎలా బయటపడుతుందో చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/current-shack-to-tdp-sarkar-39-187650.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.