నాగ్‌పుర్ లో కర్ఫ్యూ ఎత్తివేత

Publish Date:Mar 21, 2025

Advertisement

నాగపూర్ లొ మూడు రోజుల అనంతరం కర్ఫ్యూ ఎత్తివేశారు. నాగపూర్ లో ఇటీవల హింసాకాండకు చెలరేగడానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఘర్షణలకు కారకుడయ్యారన్న ఆరోపణలపై ఫారీమ్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మైనారిటీ డెమొక్రటిక్ పార్టీ నాగపూర్ అధ్యక్షుడైన ఫారీమ్ ఖాన్ తో పాటు ఆరుగురిపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. వీరు కాకుండా మరో 50 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ సమాధిని తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో శంభాజీనగర్‌లోని 18వ శతాబ్దానికి చెందిన ఆయన స్మారకానికి ఇరువైపులా భారత పురావస్తు శాఖ   ఇనుప రేకులను, కంచెను ఏర్పాటు చేసింది. పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. 

చావా సినిమా విడుదల తరువాత నాగపూర్ లో హింసాకాండ చెలరేగిన సంగతి విదితమే. ఆ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహరాజ్ ను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దారుణంగా హత్య చేసినట్లుగా చూపడంతో జనం కోపోద్రిక్తులయ్యారు. ఆ సినిమా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టింది. ఔరంగజేబు సమాధిని తొలగించాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించింది. ఈ నేపథ్యంలోనే హింస చెలరేగింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు.  

By
en-us Political News

  
‘కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల కాలంలో 50 వేల ఉద్యగాలు ఇచ్చింది’ ఈ మంత్రాన్ని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు’ రోజూ జపిస్తూనే ఉంటారు.  మరో వంక ఇందులో గత ప్రభుత్వం ఘాతాలోకి ఎన్ని పోతాయి,కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలోకి ఎన్ని వస్తాయి
  తెలంగాణ  ప్రభుత్వం ఈ నెల ( మార్చి) 19 న 2025 – 2026 వార్షిక బడ్జెట్’ ను సభకు సమర్పించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, రూ’ 3.04,965 కోట్ల అంచనాలతో,బరువు ‘తక్కువ’ బడ్జెట్’ను సభకు సమర్పించారు.
సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌  వర్నింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఒకే వేదికపై కనిపించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో ప్రతి రోజూ, ప్రతి నిమిషం కాంగ్రెస్, బీఆర్ఎస్ బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తుంటాయి.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపిల్ రానే వచ్చేసింది. ఆదివారం  ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. సన్ రైజర్స్ హైద్రాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది.
మత్తు పదార్థాల వలె సెల్ ఫోన్లకు అతుక్కుపోయేవారి సంఖ్య  రోజురోజుకి పెరిరిపోతుంది. ట్రాయ్ 2024  సెప్టెంబర్ నివేదిక ప్రకారం తెలంగాణలో 4.19 కోట్ల మంది ఉన్నట్లు వెల్లడైంది.
 ఎంఆర్ పిఎస్ అధ్యక్షుడు  మందకృష్ణ వైకాపా అధినేత వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల వైకాపా ప్రభుత్వం ఎస్ సి వర్గీకరణ కోసం  ఒక్క ప్రయత్నం కూడా చేయలేదన్నారు జగన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఆ పార్టీలోని మాదిగ నేతలు పునరాలోచించుకోవలన్నారు.
ఆంధ్ర ప్రదేశ్  అవనిగడ్డలో  ఐసిస్ డ్రగ్ కలకలం రేపింది.  తాజాగా ఈగల్ టీం దాడుల్లో విస్తుకోల్పోయే నిజాలు వెల్లడయ్యాయి. ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలు వినియోగించే డ్రగ్స్  కృష్ణా జిల్లా అవనిగడ్డ వీధుల్లో లభ్యం కావడంతో అధికారుల  ఫీజులు ఎగిరిపోయాయి.
తెలంగాణ రాజకీయాలలో అనూహ్య సంఘటన జరిగింది. ఉప్పూ నిప్పులా ఉండే రేవంత్ రెడ్డి, హరీష్ రావులు శుక్రవారం భేటీ అయ్యారు. మాజీ మంత్రి పద్మారావుగౌడ్ తో కలిసి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ కు వెళ్లిన హరీష్ రావు ఆయనతో దాదాపు పావుగంట సేపు చర్చలు జరిపారు.
తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని ఆయన టీటీడీ అధికారులను ఆదేశించారు.
నటుడు,  వైకాపా నేత పోసాని కృష్ణమురళికి తాత్కాలికంగా రిలీఫ్ లభించినప్పటికీ విడుదలపై ఉత్కంఠత నెలకొంది. కూటమి నేతలపై  పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసిన  నేపథ్యంలో ఎపిలో 17 పోలీస్ స్టేషన్లలో  కేసులు నమోదయ్యాయి. మొత్తం ఐదు కేసులో బెయిల్ లభించినప్పటికీ పోసాని విడుదల కాలేదు.
వెండి తెర పైనో, బుల్లి తెర పైనో, కనిపించిన ప్రతి ఒక్కరూ సెలబ్రిటీనేనా? ఇంకేమైనా అర్హతలు, యోగ్యతలు అవసరం అవుతాయా? అంటే సమాధానం చెప్పడం కష్టం కాదు గానీ, ఇబ్బందికరంగా ఉంటుంది.
డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు ఇండియన్స్ కు మరణ శిక్ష విధించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. నిరుడు జులైలో సింగపూర్ ప్లాగ్ ఉన్న ఓడలో నిషేధిత డ్రగ్ అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు భారతీయుల సమాచారం ఇండో నేషియా పోలీసులకు అందింది. వెంటనే రైడ్స్ చేయడంతో 106 కిలోల గంజాయి మాదక ద్రవ్యాలను స్వాధీనం
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో నోట్ల కట్టలు కలకలం సృష్టించాయి. లెక్కల్లో చూపని సొమ్ము కట్టలు కట్టలుగా ఆయన నివాసంలో బయటపడింది. వివరాల్లోకి వెడితే.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.