హిడ్మా కథ ముగిస్తాం..! సీఆర్పీఎఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌

Publish Date:Apr 9, 2021

Advertisement

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో 22 మంది జవాన్లను బలి తీసుకున్న మావోయిస్టులపై ప్రతీకారానికి సీఆర్పీఎఫ్ సిద్దమవుతోంది. మోస్ట్ వాంటెడ్ హిడ్మా టార్గెట్ గా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నక్సల్స్‌ కమాండర్‌ హిడ్మా చరిత్రలో కలిసిపోవడం ఖాయమని సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్‌సింగ్‌ అన్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ మొదలైనట్లు చెప్పారు. నక్సలైట్ల పరిధి.. అడవుల్లో 100 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు కుచించుకుపోయిందని, ఇక తప్పించుకోవడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాదిలోగా హిడ్మాతో పాటు ఆయన దళం  కథ ముగిస్తామన్నారు సీఆర్పీఎఫ్ డైరెక్టర్. 

బీజాపూర్ ఎన్ కౌంటర్. మావోయిస్టుల చెరలో బందీగా ఉన్న రాకేశ్వర్ సింగ్ విడుదల తర్వాత మాట్లాడిన కుల్దీప్‌సింగ్‌ .. కీలక విషయాలు వెల్లడించారు. హిడ్మా లక్ష్యంగా  చేపట్టబోయే యాక్షన్‌ ప్లాన్‌ గురించి కూడా వివరించారు. మావోయిస్టులపై పోరు మరింత ఉద్ధృతం చేస్తున్నట్లు కుల్దీప్‌సింగ్‌  తెలిపారు. మావోయిస్టుల ఏరివేత విషయంలో క్రమంగా బలగాలు పుంజుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వారు అష్టదిగ్బంధనానికి దగ్గర్లో ఉన్నారని.. అంతమవడం లేదా పారిపోవడం మాత్రమే వారికి మిగిలిన అవకాశాలని పేర్కొన్నారు. వారు తలదాచుకున్న ప్రాంతాలను గుర్తించి బయటకు తీసుకొస్తామన్నారు. ఇదంతా ఓ ఏడాదిలోపు పూర్తవుతుందన్నారు సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్‌సింగ్‌. 

బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో హిడ్మా  పన్నిన వ్యూహంలో  భద్రతా బలగాలు చిక్కుకున్నాయన్న వాదనను కుల్దీప్‌ సింగ్ తోసిపుచ్చారు. ఒకవేళ నిజంగానే వారు పన్నిన వ్యూహంలోకి బలగాలు వెళ్లి చిక్కుకుంటే మరణాలు ఇంకా తీవ్రస్థాయిలో ఉండేవని చెప్పారు. ఈ ఘటనలో నక్సల్స్‌ కూడా చాలా మందే మృతిచెందినట్లు పేర్కొన్నారు. చనిపోయిన వారిని తరలించేందుకు నక్సల్స్‌ 4 ట్రాక్టర్లను వినియోగించినట్లు తెలిపారు. బుల్లెట్లు వర్షంగా కురుస్తున్నా.. వాటిని తప్పించుకుంటూ, గాయపడిన వారిని కాపాడుకుంటూ బలగాలు సమర్థంగా పనిచేశాయని, వారి పట్ల గర్వంగా ఉన్నానని కుల్దీప్‌ తెలిపారు. పూర్తిస్థాయిలో బలగాలు సన్నద్ధంగా లేవంటూ వస్తున్న వాదనలను కూడా ఆయన తోసిపుచ్చారు. 

ఈ ఆపరేషన్‌ కోసం బీజాపూర్  ప్రాంతంలోకి దాదాపు 450 మంది జవాన్లు వెళ్లారని, 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో వారు మావోయిస్టులతో పోరాడినట్లు  కుల్దీప్‌ సింగ్  తెలిపారు.  నక్సలైట్ల దాడి నిరంతరంగా సాగిందని, జవాన్లు వారిని కాచుకుంటూనే తిరిగి ఎదురుకాల్పులు జరిపారని.. బలగాల వైపు గాయపడిన వారిని కూడా తమతో తీసుకువచ్చారని వివరించారు. అదనపు బలగాల కోసం కూడా సందేశం ఇచ్చారన్నారు. 22 మంది జవాన్లు ఆ దాడిలో అమరులవ్వడం బాధాకరమన్న కుల్దీప్‌.. వారి బలిదానాలు వృథా కాబోవన్నారు.  ఏడాదిలోగా హిడ్మా అంతు చూస్తామని హెచ్చరించారు. 

భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్ గా మారిన సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా వయసు 40 ఏళ్లు ఉంటుందని అంచనా. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)కి కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2013లో ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ నేతలపై జరిగిన దాడిలో కూడా హిడ్మానే నిందితుడు.  
   

By
en-us Political News

  
ఆంధ్ర ప్రదేశ్  అవనిగడ్డలో  ఐసిస్ డ్రగ్ కలకలం రేపింది.  తాజాగా ఈగల్ టీం దాడుల్లో విస్తుకోల్పోయే నిజాలు వెల్లడయ్యాయి. ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలు వినియోగించే డ్రగ్స్  కృష్ణా జిల్లా అవనిగడ్డ వీధుల్లో లభ్యం కావడంతో అధికారుల  ఫీజులు ఎగిరిపోయాయి.
తెలంగాణ రాజకీయాలలో అనూహ్య సంఘటన జరిగింది. ఉప్పూ నిప్పులా ఉండే రేవంత్ రెడ్డి, హరీష్ రావులు శుక్రవారం భేటీ అయ్యారు. మాజీ మంత్రి పద్మారావుగౌడ్ తో కలిసి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ కు వెళ్లిన హరీష్ రావు ఆయనతో దాదాపు పావుగంట సేపు చర్చలు జరిపారు.
తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని ఆయన టీటీడీ అధికారులను ఆదేశించారు.
నటుడు,  వైకాపా నేత పోసాని కృష్ణమురళికి తాత్కాలికంగా రిలీఫ్ లభించినప్పటికీ విడుదలపై ఉత్కంఠత నెలకొంది. కూటమి నేతలపై  పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసిన  నేపథ్యంలో ఎపిలో 17 పోలీస్ స్టేషన్లలో  కేసులు నమోదయ్యాయి. మొత్తం ఐదు కేసులో బెయిల్ లభించినప్పటికీ పోసాని విడుదల కాలేదు.
నాగపూర్ లొ మూడు రోజుల అనంతరం కర్ఫ్యూ ఎత్తివేశారు. నాగపూర్ లో ఇటీవల హింసాకాండకు చెలరేగడానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
వెండి తెర పైనో, బుల్లి తెర పైనో, కనిపించిన ప్రతి ఒక్కరూ సెలబ్రిటీనేనా? ఇంకేమైనా అర్హతలు, యోగ్యతలు అవసరం అవుతాయా? అంటే సమాధానం చెప్పడం కష్టం కాదు గానీ, ఇబ్బందికరంగా ఉంటుంది.
డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు ఇండియన్స్ కు మరణ శిక్ష విధించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. నిరుడు జులైలో సింగపూర్ ప్లాగ్ ఉన్న ఓడలో నిషేధిత డ్రగ్ అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు భారతీయుల సమాచారం ఇండో నేషియా పోలీసులకు అందింది. వెంటనే రైడ్స్ చేయడంతో 106 కిలోల గంజాయి మాదక ద్రవ్యాలను స్వాధీనం
  ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి నాలుుగు మూల స్థంభాలలో ఒకటైన న్యాయవ్యవస్థ మీద ప్రజల్లో అపార విశ్వాసం ఉంది.   చట్టంలో  అందరూ సమానమే. డబ్బు, అధికారం, ఇతర హోదా చూడదు అనే  సందేశమిచ్చే న్యాయదేవత కళ్లకు గంతలు తొలగించి న్యాయదేవత గుడ్డిది కాదు అనే సంకేతంగా  విగ్రహంలో  ఇటీవల మార్పులు చేర్పులు చేశారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో నోట్ల కట్టలు కలకలం సృష్టించాయి. లెక్కల్లో చూపని సొమ్ము కట్టలు కట్టలుగా ఆయన నివాసంలో బయటపడింది. వివరాల్లోకి వెడితే.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
దువ్వ గ్రామానికి చెందిన నందివాడ ఏసమ్మ 14 ఏళ్ల క్రితం భర్తను కోల్పోయింది.. కుమారుడు మానసిక వైకల్యంతో సరిగా నడవలేడని, మాట్లాడలేని పరిస్థితి. పింఛను కూడా రావడం లేదు. ఈ నెల 15న పశ్చిమగోదావరి జిల్లా తణుకు పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబుకు ఏసమ్మ తన గోడు చెప్పుకొంది.
వైసీపీ లేని, రాని ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీకి చెందిన జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేలూ సమష్టిగా పోరాడుతున్నారని అంతా భావించారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం ఆరు నెలల పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే సభ్యత్వం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిసినా వారు అందుకు సిద్ధపడే శాసన సభను బాయ్ కాట్ చేశారని అంతా భావిస్తూ వచ్చారు.
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన లండన్‌లోని హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానరాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. విమానాశ్రయం సబ్ స్టేషన్ లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదమే ఇందుకు కారణం.
 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కేసులో నిందితురాలు యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టునాశ్రయించారు. వైకాపా అధికార ప్రతినిధి హోదాలో ఉన్న శ్యామలకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరం అనే విషయం తెలియంది కాదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.