ఒక్కరోజే 780మంది బలి.. కరోనా కల్లోలం

Publish Date:Apr 9, 2021

Advertisement

10 రోజుల క్రితం రోజుకు 30వేల కేసులు. వారం గడిచే సరికి లక్షా 30వేల కేసులు. వామ్మో.. దేశంలో కరోనా ఓ రేంజ్‌లో విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలూ భారీగా నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంటోంది. లేటెస్ట్‌గా, వైరస్ ధాటికి 780మంది మృత్యువాత పడ్డారు. కరోనా రెండోదశలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. 
 
పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పైపైకి పాకుతున్నాయి. తాజాగా.. 1,31,968 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య కోటి 30 లక్షలు దాటేసింది. మృతుల సంఖ్య 1,67,642 మంది.

ప్రస్తుతం దేశంలో 9,79,608 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 7.04 శాతానికి చేరింది. మరోవైపు కోలుకునే వారి సంఖ్యా క్రమంగా పడిపోతోంది. ఇప్పటివరకు 1,19,13,292 మంది కోలుకున్నారు. రికవరీ రేటు గతంలో 97శాతంగా ఉండగా.. ప్రస్తుతం రికవరీ రేటు 91.22 శాతానికి పడిపోవడం కలవరానికి గురి చేస్తోంది. 

దేశంలో నమోదవుతున్న కేసులు, మరణాల్లో సగానికి పైగా మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ 56 వేలకుపైగా కేసులు నమోదు కాగా.. 376 మంది చనిపోయారు. గత నెల రోజులుగా దేశంలోని 63 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఏప్రిల్ 8 వరకు 9,43,34,262 మందికి టీకా డోసులు వేశారు. గురువారం 36,91,511 మందికి టీకాలు ఇచ్చారు. ఈ నెల 11 నుంచి 14 తేదీల మధ్య టీకా ఉత్సవం నిర్వహించి, అర్హులందరికీ టీకాలు అందించాలని ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి భవిష్యత్ ను దర్శించడంలో దిట్ట. ఆయన ఏం చేసినా తరతరాలు నిలబడిపోయేలా ఉంటుంది. సంక్షేమ పథకాలైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా అంతే. ఆయన ఒక ట్రెండ్ సృష్టిస్తారు. ముందు విమర్శలు చేసిన వారు కూడా తరువాత ప్రశంసలు గుప్పించేలా ఆయన కార్యక్రమాలు ఉంటాయి. కార్యాచరణ ఉంటుంది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఫార్మ్ డి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్ విభాగంలో పని చేస్తున్న అంజలి అనే ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణానికి ప్రయత్నించడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పాస్టర్ పగడాల  ప్రవీణ్ కుమార్(46)  అనుమానాస్పదస్థితిలో మరణించాడు. డెడ్ బాడీపై రక్తపు మరకలు ఉండటంతో అనుమానాలు రేకెత్తాయి. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ పక్కనే ప్రవీణ్ మృతదేహం పడి ఉంది. స్పాట్ లోనే రక్తపు మరకలతో ఉన్న కర్ర ముక్కలు ముక్కలుగా ఉండటంతో డెత్ మిస్టరీ వీడలేదు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తునకు కేంద్రం పచ్చ జెండా ఊపేసిందా? ఏపీ మద్యం కుంభకోణంపై లోక్ సభలో ప్రస్తావించిన నరసరావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు ఇదే విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం (మార్చి 25) ప్రత్యేకంగా భేటీ అయ్యి తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను అంద చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు టూరిజంను బాగా ప్రమోట్ చేశారని  తెలంగాణలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ‘‘ గతంలో  ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు ఇక టూరిజం ప్రధానం  అనేవారు. ఏ ఇజం లేదన్నప్పుడు మాకు కోపం వచ్చేది. నిజంగా ఖర్చులేనిది ఏదైనా ఉందంటే అది టూరిజం’ అని  కూనంనేని అన్నారు.
తెలుగుదేశం ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం (మార్చి 25) భేటీ అయ్యారు. సాధారణంగా అయితే ఇటువంటి భేటీలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ లావు శ్రీకృష్ణ దేవరాయులు అమిత్ షాతో భేటీ అయిన సమయం, అంతకు ముందు రోజు అంటే సోమవారం (ఫిబ్రవరి 24) లోక్ సభలో లావు ప్రసంగం తరువాత అమిత్ షాతో ఆయన భేటీ కావడం రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ నివాసంలో సీబీఐ అధికారలు సోదాలు నిర్వహిస్తున్నారు, భూపేశ్ బఘేల్ నివాసంతో పాటు రాయ్‌పూర్, భిలాయ్‌లోని ఆయన నివాసాలు, సీనియర్ పోలీసు అధికారి, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
శ్రీమంతుడు సినిమాలో ఊరు చాలా ఇచ్చింది.. తిరిగిచ్చేయాలి లేకపోతే లావైపోతాను అనే డైలాగ్ ఒకటి ఉంది. పుట్టి పెరిగిన ఊరు అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాలన్న సందేశం ఆ డైలాగ్ లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను పుట్టి పెరిగిన గ్రామాల కోసం ఏదైనా చేయాలని తపన పడుతున్నారు.
రిపోర్టర్లు లేరు… సబ్ ఎడిటర్లు లేరు… ప్రూఫ్ రీడర్లు లేరు… పేజీ మేకప్ ఆర్టిస్టుల్లేరు… ఫోటోగ్రాఫర్లు లేరు… ఐనా సరే, డెయిలీ పేపర్ పబ్లిషైంది… ప్రింట్ ఎడిషన్, డిజిటల్ ఎడిషన్ మార్కెట్‌లోకి వచ్చేశాయి.
రంజాన్ పండగ వేళ తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు. నానిని హుటాహుటిన హైదరాబాద్ లోని ఏఐసీ ఆస్పత్రికి తరలించారు.
పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి మార్గం సుగమమైంది.
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. బుధవారం (మార్చి 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ ఎంబీసీ వెలుపతి వరకూ సాగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.