అటవీ పరిరక్షణ, అవాసాల అభివృద్దిపై దృష్టి పెట్టండి!

Publish Date:Apr 16, 2020

Advertisement

కోవిద్ - 19 (కరోనా వైరస్) నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందిస్తూనే, అటవీ పరిరక్షణ చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సూచించింది. తాజా పరిణామాల నేపథ్యంలో, అన్ని రాష్ట్రాల అటవీ సంరక్షణ ప్రధాన అధికారులతో (పీసీసీఎఫ్) కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి సీ.కే. మిశ్రా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అటవీ శాఖ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ , ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కోవిద్ వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే, అటవీ శాఖ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని కేంద్ర అటవీ శాఖ కార్యదర్శి సీ.కే. మిశ్రా సూచించారు. అటవీ పరిరక్షణ, అవాసాల అభివృద్ది, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వన్యప్రాణులకు నీటి సదుపాయాల కల్పన, అటవీ అగ్ని ప్రమాదాల నివారణ, కంపా నిధులతో చేపట్టిన పనుల పురోగతి, నిధుల విడుదల తాజా పరిస్థితి, ప్రాజెక్ట్ టైగర్, ఎలిఫెంట్, గ్రీన్ ఇండియా మిషన్ లో భాగంగా నర్సరీల అభివృద్ది, అటవీ ప్రాంతాల మళ్లింపు సమస్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అటవీ అగ్ని ప్రమాదాల నివారణలో అన్ని రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని, మానవ వనరులకు తోడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వాడాలని డీజీ సంజయ్ కుమార్ సూచించారు. కేంద్ర అటవీ శాఖ సూచనల మేరకు ఇప్పటికే తగిన జాగ్రత్తలు చేపట్టామని, కంపాతో (Compensatory Afforestation Fund Management and Planning Authority (CAMPA) పాటు ఇతర పనులు, అనుమతులకు సంబంధించిన నివేదికలను గడువులోగా పంపుతున్నామని సమావేశంలో పాల్గొన్న తెలంగాణ పీసీసీఎఫ్ ఆర్. శోభ వెల్లడించారు. అలాగే కోవిద్ నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో అటవీ శాఖ భాగం అవుతోందని తెలిపారు. అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు, జిల్లా కంట్రోల్ రూమ్ లలో అటవీ శాఖ సిబ్బంది సేవలు అందిస్తున్నారని, అలాగే అడవుల్లో ఉన్నగిరిజనులకు, అటవీ సమీప ప్రాంతాల పేదలకు నిత్యావసరాలు అటవీ శాఖ తరపున అందిస్తున్నామన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాల పీసీసీఎఫ్ లు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పీసీసీఎఫ్ ఆర్. శోభతో పాటు, అదనపు పీసీసీఎఫ్ లు లోకేష్ జైస్వాల్, ఆర్.ఎం. డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఎం.సీ.పర్గెయిన్, సిద్దానంద్ కుక్రేటీ, ప్రత్యేక అధికారులు శంకరన్, శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

By
en-us Political News

  
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.