Publish Date:Jun 19, 2022
మంచి సంబంధం చూసి పిల్లలకు పెళ్లి చేయడం, రెండు కుటుంబాలు స్నేహపూర్వకంగా వుండడం అనేది అందరం కోరుకుంటాం. కానీ అనేకానేక కారణాల వల్ల పోనీ దురదృష్టవశాత్తూ విడాకుల వరకూ వస్తే విడిపోవడమే మంచిదనుకుంటున్నారు రెండు కుటుంబాల వారూ. చదువు, మంచి వుద్యోగం, ఆర్ధికంగా నిలదొక్కుకున్నప్పటికీ ఏదో కారణంగా విడిపోయే పరిస్థితులు వస్తే అప్పుడు సాధ్యమయినంతవరకూ రెండు కుటుంబాలూ ఆ విపత్తు నుంచి బయటపడాలనే అనుకుంటాయి.
మొన్నటివరకూ అయితే ఇలా తప్పని స్థితిలో విడిపోవడం సజావుగానే జరిగిపోయింది. విడిపోయినపుడు స్నేహపూర్వకంగానే విడిపోయిన కుటుంబాలూ వున్నాయి. అయితే తీసుకున్న వరకట్నం డిమాండ్ చేయడమన్నది ఎప్పూడూ ఎవ్వరూ చేసిన దాఖలాలు లేవు. కానీ చిత్రంగా మొన్నీమధ్యనే బెంగుళూరుకి చెందిన మహిళ వరకట్నంగా ఇచ్చిన సొమ్ముతో పాటు బంగారు ఆభరణాలు డిమాండ్ చేసి కోర్టు ద్వారా పొందింది. ఈ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అబ్బాయి కుటుంబంవారు పెళ్లి సమయంలో తీసుకున్న 9 లక్షల కట్నంతో పాటు బంగారు ఆభరణాలు కూడా తిరిగి ఇచ్చేయాలని తీర్పు నిచ్చింది.
విషయమేమంటే ముంబైకి చెందిన ఓ అబ్బాయి 1998లో బెంగుళూరుకి చెందిన అమ్మాయిని పెళ్లాడాడు. 2001 లో ఇద్దరి మధ్యా విభేదాలు రావడంతో అదే ఏడాది సెప్టెంబర్ 10 ఇద్దరూ విడాకుల కోసం ముంబై హైకోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు భార్యకు 4 లక్షలు జీవభృతిగా ఇవ్వాలని ముంబై కోర్టు ఆదేశించింది. వరకట్నం డబ్బు, పెట్టిన బంగారం కూడా వెనక్కి ఇవ్వమని అమ్మాయి వాళ్లు అడిగితే అబ్బాయి కుటుంబం వారు తిరస్కరించేరు. దీంతో అమ్మాయి కుటుంబంవారు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎం. నాగప్రసన్న ఏకసభ్య ధర్మాసనం కేసు పూర్వా పరాలు విన్న తర్వాత అబ్బాయి కుటుంబం వరకట్నం డబ్బుతో పాటు పెట్టిన బంగారు ఆభరణాలు తిరిగి అమ్మాయి కుటుం బానికి ఇచ్చేయాల్సిందే అని తీర్పునిచ్చింది.
మరంచేత ఇక మగ పెళ్లివారు చాలా జాగ్రత్త పడాల్సి వుంటుదేమో! పిల్లడు పిల్లతో కడు జాగ్రత్తగా మసలు కోవాలి. ఏమాత్రం విభే దించినా, కొట్టడాలు, తిట్టడాలు అతిగా చేసినా కేసు అయి కోర్టుదాకా వెళితే ఇచ్చినదంతా కక్కాల్సి వస్తుంది. బహుపరాక్!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/court-orders-to-give-back-dowry-25-137964.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.