Publish Date:Jun 20, 2022
చాలాకాలం నిరుపయోగంగా వున్న వస్తువుల్ని పారేస్తాం. దేశంలో పాతనోట్ల స్థానంలో కొత్త కరెన్సీ నోట్లు వచ్చాయి. పాత నోట్లు ఇప్పుడు చెల్లవు. చిత్తు కాగితాలతో సమానం. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఇప్పుడు అది చెల్లని నోటు. చాలాకాలం అధికారంలో వుండి అన్ని ప్రాంతాలూ సమాంతరంగా అభివృద్ధిపరిచేందుకు కృషి చేయాల్సిన బాధ్యతను కాంగ్రెస్ విస్మరించడం వల్లే ఈ పరిస్థితికి ఆ పార్టీ చేరుకుంది. కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూనే వుందని, చాలా కాలం అధికారంలో వున్న, పురాతన పార్టీ కేవలం ప్రచారానికి, ఆర్భాటాలకే పాలనా కాలం వెచ్చించింది. ఈశాన్య రాష్ట్రాలకు అందుకే కాంగ్రెస్ పై మండిపాటు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా వెనకంజలో వుండ డం గురించి అనేక సందర్భాల్లో అనేకమంది రాజకీయనాయకులు విమర్శిస్తూనే వున్నారు. ఈ ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి కాంగ్రెస్ ఎన్నడూ పెట్టలేదని, కేవలం ఓట్లు అధికారం కోసం ఆకట్టుకునే ప్రచారాలు, ప్రసంగాలు తప్ప వాస్తవంగా చేసిందేమి లేదని అక్కడి ప్రజలు చెబుతూనే వున్నారు. ఇపుడు తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీ పాత కరెన్సీనోట్ల వంటిదని ఎద్దేవా చేయడం గమనార్హం.
అధికారంలో వున్ననాళ్లు కనీసం రాజధాని ఎక్స్ప్రెస్ కోరికను కూడా అంగీకరించ లేదని ఘాటుగా విమర్శించడం ఆ ప్రాంత ప్రజల మనోభావాన్ని వ్యక్తం చేస్తుంది. అసలు ఆ పార్టీని ప్రజలు ముట్టడానికి ఇష్టపడని పాత నోట్లుగా మారిపోయిందని, ఆ పార్టీ నిరుపయోగంగా మారిందని బిశ్వశర్మ ఆదివారం అగర్తలా ఉప ఎన్నిక ల ప్రచార సభలో మాట్లాడారు. ఏమాత్రం అభివృ ద్ధిని చేపట్టని కాంగ్రెస్ పాలనన ఒక్క ఈశాన్య రాష్ట్ర పరిస్థితిని చూస్తే తెలుస్తుందని దుయ్యబట్టారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి సుదీప్ రాయ్ బర్మన్ పై బిజెపి అభ్యర్ధిగా పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ సిన్హా ను ఆ పార్టీ నిలబెట్టింది.
ఈ ప్రాంతంలో అసలు కాంగ్రెస్ 2014 నుంచీ ప్రతీ ఎన్నికల్లోనూ ఓటమినే చవి చూసింది. అందుక్కారణం పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పూర్తిగా తగ్గడమేనని ఈశాన్య ప్రజాస్వామిక కూట మి (ఎన్ ఇ డి ఏ) నాయకలు ఘాటుగా విమర్శించారు. నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి విజయాలతో పోలిస్తే సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ కి ఇటీవలి కాలంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పరా జయమే దక్కిందనేది సీ.ఎం. బిశ్వ శర్మ తన ప్రసంగంలో మరో సారి గుర్తు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-situation-like-old-currency-after-demonitisation-39-138017.html
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.