Publish Date:Aug 31, 2022
ముందున్నది ముసళ్ల పండుగ అన్నది సామెత.. అయితే ఒక తాజా నివేదిక ప్రకారం ముందున్నది మండుటెండట కాలం. ఇప్పటికే ఏటికేడు ఎండలు మండి పోతుంటే రానున్న కాలంలో రికార్టులన్నిటినీ తిరగరాసే స్థాయిలో భారీ ఉష్ణోగ్రతలు నమోదౌతాయని నిపుణులు చెబుతున్నారు.
రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవ్వడం ఖాయమని కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్ మెంట్ జర్నల్ లో ప్రచురితమైన ఒక నివేదిక పేర్కొంది. ఇప్పుడు నమోదవుతున్న ఎండలకే జనం ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే.. ఇక రానున్న కాలంలో మరింతగా ముదిరే ఎండలకు జనం అల్లల్లాడటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే రాబోయే కాలంలో దేశంలో ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరగబోతున్నాయని చెబుతున్నారు.
ఇండియాలాంటి ఉష్ణ మండల దేశాల్లో రాబోయే దశాబ్దాల్లో ఎండలు గణనీయంగా పెరగబోతున్నట్లు తాజా సర్వే ఒకటి తేల్చింది. ఈ నివేదిక ప్రకారం వాతావరణ మార్పులు, కర్బన ఉద్గారాల కారణంగా ఎండలు విపరీతంగా పెరుగుతాయి. ఏడాదిలో అత్యధిక కాలం 30-50 శాతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 2050 వరకు ఉష్ణ మండల దేశాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఆసియా, ఉత్తర యూరప్లో ప్రమాదకరమైన వడగాడ్పులు కూడా వీస్తాయి.
కర్బన ఉద్గారాల్ని తగ్గించకపోతే ఇదే రీతిలో ఎండలు పెరిగిపోయే ముప్పు ఉందని నివేదిక పేర్కొంది. ఇటువంటి వాతావరణం దీర్ఘకాలిక అరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/commong-decaded-witness-heavr-temparatures-39-143000.html
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.