Publish Date:Oct 13, 2022
కర్ణాటకాలో హిజాబ్ ధరంచడంపై సుప్రీం కోర్టులో గురువారం వెలువడిన తీర్పు రెండు రకాలుగా వచ్చిం ది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం నిషేధనపై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలి యా విరుద్ధంగా తీర్పునిచ్చారు. విద్యార్ధులు హిజాబ్ను విద్యాసంస్థలకు వచ్చినపుడు ధరించ రాదని ఆయన తీర్పునిచ్చారు. ఇపుడు ఈ అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో పెట్టను న్నారు. ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి విచారించి తీర్పు నివ్వవలసి ఉంటుంది.
ఈ అంశానికి సంబంధించి కర్ణాటక హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా వచ్చిన 26 అప్పీళ్లను జస్టిస్ హేమంత్ గుప్తా కొట్టివేశారు. విద్యాసంస్థల్లో పిల్లలు హిజాబ్ను ధరించడం అనేది ఇస్లాంలో ప్రత్యేకంగా చెప్పలేదని, అది అక్కడ ధరించి తీరాలన్నదేమీ ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై తాను 11 ప్రశ్నలతో ప్రశ్నావళిని తయారు చేయగా అందిన సమాధానాలన్నీ అప్పీళ్లకు వ్యతిరేకంగా వచ్చా యన్నారు.
అయితే రాష్ట్ర హైకోర్టు ఈ విషయంలో వేరే మార్గంలోకి వెళ్లిందని జస్టిస్ ధూలియా అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పును ఆయన త్రోసిపుచ్చారు. విద్యార్ధులు హిజాబ్ను ధరించడం అవసరమా కాదా అన్నది ఇస్లామ్లో పేర్కొన్నారా లేదా అన్న అంశం కూడా ఈ వివాదానికి అప్రస్తుతమన్నారు. ఈ అంశం వారి విద్యార్థుల అభిమతానికి, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19కి సంబంధించినదని ఆయన అన్నారు. విద్యార్ధిని జీవి తం మెరుగుపరుస్తున్నామా అన్నదే ఆలోచించానని, ఫిబ్రవరి 5న ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాన్ని రద్దు చేసి, ఆ నిషేధాన్ని తొలగించాలని ఆదేశించానని జస్టిస్ ధూలియా అన్నారు.
కాగా హిజాబ్ పై విరుద్ధ తీర్పులపట్ల కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. ఇంతకంటే మంచి తీర్పు ఉండ దని, మహిళలంతా హిజాబ్ను ధరించడం ఇష్టపడడం లేదని మంత్రి బిసి నగేష్ అన్నారు. కోర్టు తీర్పు హర్షణీయమని అయితే, సుప్రీం కోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది అన్నారు.
కర్ణాటకాలో విద్యాలయాలకు ఆడపిల్లలు హిజాబ్ ధరించి తరగతులకు హాజరుకావడం మీద ఈఏడాడి ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. దాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన అప్పీళ్లపై హైకోర్టు కూడా నిషేధాజ్ఞలు సరయినవేనని తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఈ అంశంలో సుప్రీం కోర్టు తుది తీర్పు ఇవ్వవలసి ఉంది. కాగా ప్రస్తుతం దేశంలో నిషేధించిన పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పి ఎఫ్ ఐ) ముస్లిం విద్యార్ధులు హిజాబ్ ధరించాల్సిందే అంటూ వివా దాన్ని లేవనెత్తిందని కర్ణాటక ప్రభుత్వ సుప్రీం కోర్టులో వాదన వినిపించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cji-to-give-verdict-on-hijab-case-of-karnataka-39-145345.html
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.