ప్రాణహాని ఉంది.. కస్టడీకి ఇవ్వొద్దు.. కోర్టుకు సీఐ నాగరాజు
Publish Date:Jul 1, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న సర్కిల్ సీఐ నాగరాజు న్యాయమూర్తి ముందు సంచలన వ్యాఖ్యానాలు చేశారు. తన ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందనీ, ఈ కేసును బలవంతంగా ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నాని అన్నారు. ఒక పోలీసు అధికారి అయి ఉండి, తోటి విభాగాల నుంచే తనకు ప్రాణభయం ఉందంటూ ఆక్ష్న న్యాయస్థానంలో మొరపెట్టుకోవడం సంచలనం రేపింది. విచారణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందుకు వచ్చిన సీఐ నాగరాజు.. ఈ కేసులో తనను ఇరికించేందుకు తెరవెనుక పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేపట్టిన విచారణకు తాను మొదటి నుంచి పూర్తిగా సహకరిస్తూనే ఉన్నానని చెప్పిన నాగరాజు.. ఇప్పుడు కొత్తగా తన వద్ద అదనంగా చెప్పడానికి ఏమీ లేదనీ,ఇప్పుడు తనను మళ్లీ పోలీస్ కస్టడీకి ఇస్తే.. తన ప్రాణాలకే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కోర్టు.. నాగరాజు లేవనెత్తిన అభ్యంతరాలు, ఆరోపణలపై లిఖితపూర్వక నివేదిక సమర్పించాలని పోలీసు ఉన్నతా ధికారులను ఆదేశించింది.
http://www.teluguone.com/news/content/ci-nagaraju-sensational-allegation-36-224745.html





