రాజకీయంగా చిరు యాక్టివ్.. జగన్ తీరే కారణమా?

Publish Date:Apr 16, 2024

Advertisement

చిరంజీవి మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారా? ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత కొంత ఇన్ యాక్టివ్ గా కనిపించిన ఆయన రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యమధ్యలో ఏదో సినిమా డైలాగుల్లో మాత్రమే ఆయన రాజకీయంపై వ్యాఖ్యలు చేశారు తప్ప క్రియాశీలంగా పొలిటికల్ యాక్టివిటీలో పాల్గొన్నది లేదు. పలు సందర్భాలలో ఆయన తాను రాజకీయంగా తటస్థంగా ఉంటానని స్వయంగా చెప్పారు కూడా. 

అందుకు అనుగుణంగానే తన సోదరుడు పవన్ కల్యాణ్ 2014లో జనసేన పార్టీ స్థాపించిన సమయంలో కానీ,   2019 ఎన్నికలలో  జనసేన పోటీ చేసిన సమయంలో కానీ ఎన్నడూ పవన్ కల్యాణ్ కుమద్దతుగా మాట్లాడింది లేదు. ఆయన పార్టీ కోసం ప్రచారం చేసిందీ లేదు.  అయితే ఆశ్చర్యకరంగా ఇటీవల ఆయన రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. అలాగే అనకాపల్లి నియోజకవర్గం నుంచి కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ తరఫున లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు మద్దతు పలికారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

అయితే చిరంజీవి ఇప్పుడు రాజకీయంగా వార్తలలో నిలవడానికి, ఆసక్తిని దాచుకోకుండా బహిర్గతం చేయడానికి ఏపీ సీఎం జగనే కారణమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి సన్నిహితులు అలాగే పరిశీలకులు సైతం ఏపీలోని జగన్ సర్కార్ కారణంగా తెలుగుసినీ పరిశ్రమ ఇబ్బందుల్లో పడటమే కాకుండా స్వయంగా చిరంజీవి స్థాయిని తగ్గించేలా సీఎం వ్యవహరించిన తీరే చిరు మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కావడానికి కారణమని అంటున్నారు. 

 చిరంజీవి నేతృత్వంలో పరిశ్రమకు చెందిన ప్రముఖులు జగన్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసిన నాటి ఘటనను గుర్తు చేస్తూ ఇప్పుడు చిరంజీవి పొలిటికల్ యాక్టవిటీకి లింకు పెట్టి విశ్లేషణలు చేస్తున్నారు.  అప్పట్లో జగన్ క్యాంపు కార్యాలయానికి కొద్ది దూరంలోనే తన  కారును నిలిపివేసి నడిపించడం, ఆ తర్వాత సమావేశంలో కూడా జ  జోడించిన సమయంలో జగన్ ప్రత్యభివాదం చేయకపోవడం గుర్తు చేస్తూ.. ఆ అవమానాన్ని ఇంత వరకూ పంటి బిగువున భరించిన చిరంజీవి ఇప్పుడు మరో సారి జగన్ అధికారంలోకి రాకూడదన్న బలమైన ఆకాంక్షతోనే   చిరు రాజకీయ కార్యకలాపాల ద్వారా తన మద్దతు ఎవరికో సంకేతాలు ఇస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.