రాజకీయంగా చిరు యాక్టివ్.. జగన్ తీరే కారణమా?

Publish Date:Apr 16, 2024

Advertisement

చిరంజీవి మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారా? ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత కొంత ఇన్ యాక్టివ్ గా కనిపించిన ఆయన రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యమధ్యలో ఏదో సినిమా డైలాగుల్లో మాత్రమే ఆయన రాజకీయంపై వ్యాఖ్యలు చేశారు తప్ప క్రియాశీలంగా పొలిటికల్ యాక్టివిటీలో పాల్గొన్నది లేదు. పలు సందర్భాలలో ఆయన తాను రాజకీయంగా తటస్థంగా ఉంటానని స్వయంగా చెప్పారు కూడా. 

అందుకు అనుగుణంగానే తన సోదరుడు పవన్ కల్యాణ్ 2014లో జనసేన పార్టీ స్థాపించిన సమయంలో కానీ,   2019 ఎన్నికలలో  జనసేన పోటీ చేసిన సమయంలో కానీ ఎన్నడూ పవన్ కల్యాణ్ కుమద్దతుగా మాట్లాడింది లేదు. ఆయన పార్టీ కోసం ప్రచారం చేసిందీ లేదు.  అయితే ఆశ్చర్యకరంగా ఇటీవల ఆయన రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. అలాగే అనకాపల్లి నియోజకవర్గం నుంచి కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ తరఫున లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు మద్దతు పలికారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

అయితే చిరంజీవి ఇప్పుడు రాజకీయంగా వార్తలలో నిలవడానికి, ఆసక్తిని దాచుకోకుండా బహిర్గతం చేయడానికి ఏపీ సీఎం జగనే కారణమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి సన్నిహితులు అలాగే పరిశీలకులు సైతం ఏపీలోని జగన్ సర్కార్ కారణంగా తెలుగుసినీ పరిశ్రమ ఇబ్బందుల్లో పడటమే కాకుండా స్వయంగా చిరంజీవి స్థాయిని తగ్గించేలా సీఎం వ్యవహరించిన తీరే చిరు మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కావడానికి కారణమని అంటున్నారు. 

 చిరంజీవి నేతృత్వంలో పరిశ్రమకు చెందిన ప్రముఖులు జగన్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసిన నాటి ఘటనను గుర్తు చేస్తూ ఇప్పుడు చిరంజీవి పొలిటికల్ యాక్టవిటీకి లింకు పెట్టి విశ్లేషణలు చేస్తున్నారు.  అప్పట్లో జగన్ క్యాంపు కార్యాలయానికి కొద్ది దూరంలోనే తన  కారును నిలిపివేసి నడిపించడం, ఆ తర్వాత సమావేశంలో కూడా జ  జోడించిన సమయంలో జగన్ ప్రత్యభివాదం చేయకపోవడం గుర్తు చేస్తూ.. ఆ అవమానాన్ని ఇంత వరకూ పంటి బిగువున భరించిన చిరంజీవి ఇప్పుడు మరో సారి జగన్ అధికారంలోకి రాకూడదన్న బలమైన ఆకాంక్షతోనే   చిరు రాజకీయ కార్యకలాపాల ద్వారా తన మద్దతు ఎవరికో సంకేతాలు ఇస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.