ఆలోచనలు మారాలి !

Publish Date:Sep 18, 2021

Advertisement

పిల్లలు ఇంట్లో తిరగాడుతుంటే ఆ కళ వేరు. పిల్లల ముద్దు పలుకులు చూస్తే ఆ సంతోషం వేరు. కానీ ఈ మధ్య పిల్లలు విగతజీవులు అయిపోతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో చాలా ఘోరం గా తయారవుతోంది ఈ సమాజం. నెలల పసికందు అయినా పండు ముసలి అయినా కామంతో రగిలే మగాడి కంట పడితే ఇక జీవితం ముగిసినట్టే అవుతోంది పరిస్థితి. ఇట్లా ప్రవర్తించేవాళ్ళు అసలు అలా ఎలా చేయగలుగుతారు అనేది అందరూ వేసే ప్రశ్న. ప్రతిసారి ఇట్లాంటివి జరిగినపుడు ప్రశ్నలు గుప్పించడం. తరువాత కొన్ని రోజులకు అన్ని మర్చిపోవడం. తప్పు చేసినా వాళ్లను శిక్షించినా తరువాత మళ్ళీ ఏదో ఒక రోజు, ఎక్కడో ఒకచోట ఉలిక్కిపడేలా మళ్ళీ దారుణాలు పునరావృతమవుతూనే ఉన్నాయి. అసలు సమస్య ఎక్కడుంది?? 

వస్త్రధారణ అని చాలా మంది అంటారు మరి నెలల పసిబిడ్డలు, పదేళ్లు కూడా నిండని బుజ్జి తల్లులు ఎలాంటి బట్టలు వేసుకోవాలి?? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

పెంపకంలో తప్పుందా?? ప్రతి తల్లిదండ్రి తమ బిడ్డలను ఉత్తమంగా ఉండేలానే పెంచుతారు. ఎవరు కూడా తమ బిడ్డలు తప్పులు చేసి జైలు కు వెళ్లాలని, పసిబిడ్డల ప్రాణాలు, ఆడపిల్లల మానాలు తీసేట్టు ప్రేరేపించి పెంచరు.

మరి ఎక్కడుంది అసలు సమస్య అంటే…..

సమాజంలో ఉంది. ఇప్పటితరం పిల్లలకు సెక్స్ అనే పదం చాలా కామన్ అయిపోయింది. నెట్ సెంటర్ లలో విచ్చలవిడిగా బ్లూ ఫిల్మ్ వీడియోస్ చాలా తక్కువ ధరకు మొబైల్ లో ఎక్కించేస్తారు. వయసుతో తేడా లేకుండా పిల్లలు కూడా వాటిని చూస్తారు. ఒక తండ్రి తన మొబైల్ లో బ్లూ ఫిలిమ్స్ పెట్టుకుంటే కొడుకు ఏదో అవసరానికి మొబైల్ తీసుకుని పొరపాటున వాటిని ఓపెన్ చేయచ్చు, ఒక ఉపాధ్యాయుడు పిల్లలను పనికిమాలిన విషయాలకు ఉపయోగించుకుంటే తద్వారా ఆ విద్యార్థి పెద్దవుతూ పనికిమాలినవాడిగానే ఎదుగుతాడు. ఒకచోట దారుణం జరుగుతూ ఉన్నపుడు ఎవరూ స్పందించకుండా మాకెందుకు లెమ్మని ఉంటే, అక్కడున్న ఏ పిల్లవాడో ఒక బాధ్యతారహితమైన వాడిగా రూపాంతరం చెందవచ్చు. ఒకమనిషి ఒక పెద్ద తప్పు చేసాడు అంటే దానికి మూలమైన విత్తనం ఎక్కడో ఎప్పుడో ముందే పడింది అని అర్థం. 90% ఆ విత్తనం సమాజం నుండి రాలిపడినదే అని అర్థమవుతుంది కూడా. ఎందుకంటే ఎదిగే పిల్లల మీద కుటుంబంతో పాటు  సమాజం ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇప్పుడేం చేయాలి??

ప్రతిసారి ఏదో జరిగిపోయాక ఆవేశంతో ఊగిపోవడం, తప్పు చేసినవాళ్లను శిక్షించాలని డిమాండ్ చేయడం, కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసన ఉద్యమాలు వంటివి చేసెబదులు  ఎవరికి సాధ్యమైనంత మేరకు వారి చుట్టూ వాతావరణాన్ని కాస్త మార్చగలిగేలా ముందగుడు వేయాలి.

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?? ప్రతి తల్లిదండ్రి ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులను గమనిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఇష్టమొచ్చినట్టు ఉండి, పిల్లలను సరైన  దారిలో ఉండమంటే అది జరగదు. అక్కడే పిల్లల్లో విరుద్ధ భావాలు మొదలవుతాయి.

పిల్లలు ఏమి చేస్తున్నారు అనే విషయం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. స్నేహితులను, ఉపాధ్యాయులను కలుస్తూ వారితో మాట్లాడుతూ పిల్లల గురించి తెలుసుకుంటూ ఉండాలి.

పిల్లలతో స్నేహంగా ఉండాలి. నిజానికి పిల్లలతో తల్లిదండ్రులమనే అధికారంతో కంటే స్నేహితుల్లా కలిసిపోయి మాట్లాడుతూ ఉంటే బయట స్నేహాలకు అంత తొందరగా లొంగిపోరు పిల్లలు. 

"మగపిల్లాడు వాడికేం దర్జాగా బతుకుతాడు. వాడి గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు" ఇది చాలామంది తల్లిదండ్రుల అభిప్రాయం. సరిగ్గా ఈ అభిప్రాయమే ఆ పిల్లలు దారితప్పడానికి కారణం అవుతోంది. 

మగవాళ్ళు తమ ఇంట్లో ఉన్న మహిళకు గౌరవం ఇస్తూ ఆ మహిళ అభిప్రాయాలకు స్వేచ్ఛ ఇస్తూ, వారిని గుర్తిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా బయట సమాజంలో స్త్రీల పట్ల కూడా గౌరవం కలిగివుంటారు. కాబట్టి ఇంటి నుండి మొదలవ్వాలిది.

ఇక సమాజంలో జరుగుతున్నవాటిని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలావరకు ఘోరాలు మద్యం మత్తులోనూ, బ్లూ ఫిల్మ్ లు, రొమాంటిక్ వీడియో లు చూడటం ద్వారావచ్చే ఉద్రేకాన్ని ఆపుకోలేక చేస్తున్నవే. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం సమాజంలో అందరి మీద ఉంది.

మీ చుట్టూ ఉన్న నెట్ సెంటర్లు, మీ ఇంట్లో ఉన్న మొబైల్ హిస్టరీ వంటివి గమనిస్తూ ఉండాలి.

పిల్లలకు చిన్నప్పటి నుండి పుస్తక పఠనం, క్రమశిక్షణ అలవాటు చేయాలి

పిల్లల దృష్టిలో జీవితాన్ని గొప్పగా వర్ణించాలి. ఆ దిశగా వాళ్ళను నడిపించాలి. 

ఎప్పుడూ చట్టాన్ని, ధర్మాన్ని, ప్రభుత్వాన్ని నిందించకుండా మీ వంతు ఏమి చేస్తున్నారో ఆలోచించుకుని చూడండి. అలాంటపుడే సమాజంలో జరుగుతున్నవాటిని కొంత అయినా కట్టడి చేయగలం. మార్పు మనతోనే ప్రారంభం అవ్వాలి కదా!!

◆ వెంకటేష్ పువ్వాడ

By
en-us Political News

  
ప్రతి ఒక్కరికి తమ జీవితం బాగుండాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఏదేదో చేయాలని కూడా ఆనుకుంటారు. కానీ తమ జీవితం బాగుండక పోవడానికి ఎన్నో పరిస్థితులు,  తమ చుట్టూ ఉన్న వ్యక్తులు కారణం అని అనుకుంటూ ఉంటారు...
జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు....
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు...
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.