ఏపీ అభివృద్ధి చిరునామా చంద్రబాబు.!
Publish Date:Aug 12, 2026
Advertisement
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనా నైపుణ్యం, దార్శనికతను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. నిజమైన విజనరీ చంద్రబాబు అన్న ఆమె.. ఏపీలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతికి ఆయనే నిజమైన చిరునామాగా అభివర్ణించారు. సాంకేతిక పరిజ్ఞానం, పాలనా సంస్కరణలు, మౌలిక వసతుల విస్తరణ వంటి కీలక రంగాల్లో చంద్రబాబు చూపుతున్న చొరవ, ఆయన దార్శనికత ఏపీని అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తోందన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల న్యూఢిల్లీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో అప్పలనాయుడు అమరావతి నగర ప్రణాళికలు, విశేషాలతో రూపొందించిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేశారు. ఆ పుస్తకంలో రాజధాని నమూనాలు, నిర్మాణాలు, అమరావతి నగర ప్రణాళికల వివరాలను రాష్ట్రపతి ఎంతో ఆసక్తితో తిలకించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం.. రాష్ట్రలో ఐటీ , పారిశ్రామిక పురోగతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న శ్రమను రాష్ట్రపతి ముర్ము ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. తన దార్శనికతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తిమంతమైన నాయకత్వం చంద్రబాబు సొంతమన్న ముర్ము..టెక్నాలజీని పాలనకు అనుసంధానించడంలో ఆయన చూపుతున్న చొరవ రాష్ట్ర భవిష్యత్తుకు మేలు చేస్తుందన్నారు. Chandrababu Visionary Leader, President Draupadi Murmu, Kalisetty Appalanaidu, Amaravati Coffee Table Book, Andhra Pradesh Development
http://www.teluguone.com/news/content/chandrababu-visionary-leader-36-228782.html





