జనరంజకంగా కూటమి మేనిఫెస్టో

Publish Date:Apr 30, 2024

Advertisement

టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి మేనిఫెస్టో విడుదలైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. గతంలో సూపర్‌ సిక్స్‌ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టోను విడుదల చేసింది. సూపర్‌ సిక్స్‌ పేరుతో ఇచ్చిన ఆరు హామీలకు మరి కొన్ని అంశాలను జత చేసి ఇప్పుడు మూడు పార్టీలు కలిసి పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలోని కీలకమైన హామీలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ (ఎన్డీఏ) కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు 2024 ఏప్రిల్ 30న మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లోకి వెళుతున్న ఎన్డీఏ కూటమి మరికొన్ని హామీలతో ఈ మేనిఫెస్టోను తయారు చేసింది. పలు కీలకమైన హామీలతో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి మేనిఫెస్టో 2024ను రూపొందించారు.
ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో పింఛన్లు, మహిళలకు పథకాలపై ఫోకస్ పెట్టారు. సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలు ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లారు. వీటితో పాటుగా మెగా డీఎస్సీపై మొదటి సంతకం, సామాజిక పింఛను రూ.4 వేలకు పెంచడంతో పాటుగా.. ఇది 2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపచేస్తారు. దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు..బీసీలకు 50 ఏళ్లకే పింఛను అందిస్తామన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేస్తామని ఇప్పటికే ప్రకటించారు.యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి హామీలను ఇప్పటికే ఇచ్చారు. 'తల్లికి వందనం' కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం.. వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు వంటి హామీలు ఉన్నాయి. ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం.. నాణ్యమైన సామగ్రితో మంచి ఇంటి నిర్మాణం వంటి హామీలు కూడా చేర్చారు.
ఇసుక ఉచితం.. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.. ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌.. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.. భూ హక్కు చట్టం రద్దు.. కరెంటు ఛార్జీలు పెరగవు అంటున్నారు. చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200.. మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీని చేర్చారు. పెళ్లి కానుక కింద రూ.లక్ష అందజేత.. విదేశీ విద్య పథకం పునరుద్ధరణ.. పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం.. నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ వంటివి ఉన్నాయి. రైతులకు గతంలో టీడీపీ ప్రభుత్వం అందించిన రాయితీ పథకాల పునరుద్ధరణ.. ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ. చేనేతలకు ప్రత్యేక విధానాలు, పథకాలు కూడా ఉన్నాయి
టీడీపీ అధినేత చంద్రబాబు 11 నెలల క్రితమే రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో సూపర్‌ సిక్స్‌ పేరుతో మినీ మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. జనసేనతో పొత్తు ఖరారయ్యాక ఆ పార్టీతో సంప్రదించి మరికొన్ని హామీలను జోడించారు. టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు ఖాయమయ్యాక మూడు పార్టీల నేతలు ఉమ్మడి మేఫెస్టోపై కసరత్తు చేశారు. నేటి అవసరాలు తీరుస్తాం- రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తాం అంటూ ఈ మేనిఫఎస్టోను రూపొందించారు. సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతి కోసం మరిన్ని కొత్త పథకాలను ఎన్డీఏ కూటమి ప్రకటించింది. 2014-2019 మధ్య టీడీపీ కొన్ని పథకాలను అమలు చేసింది.. అయితే వాటిలో నిలిచిపోయిన వాటిని మళ్లీ అమలు చేయాలని నిర్ణయించారు. అన్న క్యాంటీన్‌లు, పండుగ కానుకలు వంటివి ఉన్నాయి. టీడీపీ గతంలో ప్రకటించిన సూపర్ సిక్స్‌ను ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రింట్‌, టీవీ, సోషల్ మీడియాలో ప్రకటనల రూపంలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.

By
en-us Political News

  
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.