చంద్రబాబు ... లోకేష్ శకానికి నాంది పలకనున్నారా?

Publish Date:Feb 9, 2017

Advertisement

 

ఏ రాష్ట్రంలో అయినా, లేదా ఢిల్లీలో అయినా ... ఎప్పుడూ లేని రాజకీయ హడావిడి కనిపించేది ఒక్క మంత్రి వర్గ మార్పులు, విస్తరణ టైంలోనే! పదవి ఊడుతుందనే వారిలో ఆందోళన, వస్తుందని ఆశించే వారిలో ఉత్సుకత మాటల్లో చెప్పలేకుండా వుంటాయి. ఇప్పుడు అమరావతి కూడా అలాంటి పొలిటికల్ హీట్ తోనే వుంది! మీడియా, జనం దృష్టి మొత్తం పన్నీర్, శశికళ మధ్య సాగుతోన్న ఫైటింగ్ మీదే వున్నా... ఆంధ్రా పాలిటిక్స్ లో మాత్రం సైలెంట్ గా భారీ మార్పులకి రంగం సిద్ధమవుతోంది!

 

నవ్యాంధ్ర ఏర్పడి మూడో సంవత్సరం కూడా పూర్తి కావస్తున్నా చంద్రబాబు క్యాబినేట్ లో పెద్ద పెద్ద మార్పులు ఇప్పటి వరకూ జరగలేదు. అయితే, ఈ నెల పదహారో తేదీలోపు ఏ క్షణాన్నైనా క్యాబినేట్ రూపు, రేఖలు మారిపోవచ్చంటున్నారు. అయితే, ఈసారి అతి పెద్ద బ్రేకింగ్ న్యూస్ చినబాబు గురించే వుంటుందంటున్నారు. ఆల్రెడీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తన వంతు కృషి చేస్తోన్న లోకేష్ ఇక మరి కొద్ది రోజుల్లోనే బుగ్గ కారు ఎక్కేయటం గ్యారెంటీ అంటున్నారు. టీడీపీ నేతల అభిమతం ప్రకారం భవిష్యత్ ముఖ్యమంత్రి అయినా ఆయన తండ్రి క్యాబినేట్లో కీలక శాఖనే దక్కించుకుంటారని గట్టి టాక్. అసలు ఇప్పుడు జరగనున్న మంత్రి వర్గ మార్పు, చేర్పులన్నీ లోకేష్ ను పాలనలో ప్రవేశపెట్టేందుకే అంటున్నారు.

 

ఏపీ క్యాబినేట్ రీషఫల్ లో లోకేష్ ప్రధాన హైలైట్ గా నిలవనుండగా మిగతా వారు కూడా చాలా మంది కుదుపుకు గురయ్యే ఛాన్స్ వుందంటున్నారు. సీఎం ఇంకా అధికారిక నిర్ణయం ఏం తీసుకోకున్నా రకరకాల ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటి దాకా కొందరు మంత్రులు చూపించిన పర్ఫామెన్స్, అలాగే మరికొందరి విషయంలో సామాజిక వర్గాల కూడికలు, తీసివేతలు... ఇవన్నీ ముఖ్యమంత్రి ప్రధానంగా పరికిస్తున్నారట!

 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడుగా వున్నకళావెంకట్రావు క్యాబినేట్లోకి వస్తారని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే ఆయన బంధువైన ప్రస్తుత మంత్రి మృణాళిని ఔట్ అవ్వాల్సి వస్తుంది. అలాగే, ఇప్పుడు మంత్రి వర్గంలో చిన రాజప్పను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడ్ని చేసే ఛాన్స్ కూడా వుందంటున్నారు. మరోవైపు రాజప్ప ఉద్వాసన కాపు సామాజిక వర్గానికి చెందిన జ్యోతుల నెహ్రుకు వరంగా మారవచ్చు. ఆయన క్యాబినేట్లో చేరవచ్చు. ఇక నెల్లూరు సీనియర్ నేత, రెడ్డి సామాజిక వర్గం నుంచీ టీడీపీలో నిరంతరంగా వుంటోన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.

 

ఈ సారి మంత్రి వర్గ కూర్పులో మరో పెద్ద మార్పుగా చెప్పుకోవాల్సింది నారాయణ తొలగింపు. ప్రస్తుతం ఆయన కీలకమైన మంత్రుల్లో ఒకరు. ప్రభుత్వ నిర్ణయాల్లో చాలా వాటిల్లో ఆయన పాత్ర వుంటోంది. కాని, బాబు ఆయన్ని తాను చైర్మన్ గా వున్న సీఆర్ డీఏకు సారథిగా నియమిస్తారని అంటున్నారు.

 

ఆ మధ్య జరిగిన వైసీపీ వలసల్లో చాలా మంది చంద్రబాబుకు జైకొట్టారు. వీరి గురించి కూడా సీఎం సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు సమాచారం. వాళ్లు పార్టీలో చేరేప్పుడు పదవుల విషయంలో కొంత భరోసా ఇవ్వటం జరిగింది కాబట్టి ఇప్పుడు ఒకట్రెండు మంత్రి పదవులు ఇవ్వాలని అనుకుంటున్నారట! అదే జరిగితే వైసీపీ వలసల కోటాలో భూమా అఖిలప్రియను అమాత్య పదవి వరించవచ్చు. అలాగే, మరో నేత అమర్ నాథ్ రెడ్డి కూడా అమాత్యులు కావచ్చు. రెడ్డి వర్గం నుంచి సెక్రటేరియట్ వదిలి పెట్టాల్సి రావాల్సిన వాళ్లలో ప్రముఖంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి , పల్లె రఘునాథరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరో వైపు మైనార్టీ వర్గం నుంచి చాంద్ పాషా, ఎంఏ షరీఫ్ పేర్లు కాబోయే మంత్రుల లిస్ట్ లో వున్నాయంటున్నారు. కాని, ఈ ఇద్దరికీగాని, ఒక్కరికిగాని ఎవ్వరికీ ఇంకా బెర్త్ కన్ ఫర్మ్ అయినట్టు మాత్రం అనిపించటం లేదు.

 

ఇక చంద్రబాబు ఖచ్చితంగా పక్కన పెట్టాలని భావిస్తున్న పేర్లుగా వినిపిస్తున్న రెండు .... రావెల కిషోర్ బాబు, పత్తిపాటి పుల్లారావు. వీళ్లిద్దరి వల్లా ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలుగుతోందని సీఎం భావిస్తున్నారట. రావెల చర్యలు, మాటలు ఇప్పటికే నష్టం కలిగించాయి. కాబట్టి ఆయన స్థానంలో ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్య మంత్రి అవుతారని అంటున్నారు. పత్తిపాటిని కూడా తొలిగిస్తే ఆయన స్థానంలో స్పీకర్ కోడెల మంత్రి అవుతారని అంటున్నారు. కాని, ఇది కొంత మేర డౌటే అని కూడా ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

 

ఉత్తరాంధ్ర లెక్కలు చూస్తే అక్కడ్నుంచీ మంత్రి వర్గంలో వున్న పీతల సుజాత, గంటా శ్రీనివాస రావులకి శాఖలు మారతాయని వినిపిస్తోంది. ప్రాధాన్యం కూడా తగ్గే అవకాశాలున్నాయి. జనాభలో అత్యధిక శాతంగా వున్న బీసీల విషయంలో కూడా బాబు పక్కాగా లెక్కలు వేసుకుని ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. పితాని సత్యనారాయణ, కొండబాబు, బీదా రవిచంద్ర లాంటి వారు మంత్రులయ్యే ఛాన్స్ వున్నాయి. వీళ్లెవరూ కాపులు కాదు. కాపులకే ఎక్కవ ప్రాధాన్యత దక్కుతోందని ఇతర బీసీ వర్గాలు అసంతృప్తిగా వున్నట్టు చంద్రబాబు గమనించటమే ఇందుకు కారణం అంటున్నారు. కాకపోతే, ఇంకా ఫైనల్ లిస్ట్ లో వుండే పేర్లు ఎవరివో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే వుంది.

 

మంత్రి వర్గ రూపు, రేఖలు ఎప్పుడు మారతాయో ఖచ్చితంగా తెలియదుగాని.. అతి త్వరలోనే లోకేష్ మొదలు స్పీకర్ కోడెల వరకూ టీడీపీలో చాలా మంది డెయిలీ రొటీన్ త్వరలోనే మారనుందనేది మాత్రం గ్యారెంటీ!

By
en-us Political News

  
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.