లోకేష్ ప్రస్తావన.. బాబు కళ్లల్లో మెరుపు చూసి తీరాల్సిందే!

Publish Date:Oct 26, 2024

Advertisement

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! 

సరిగ్గా సుమతీశతక కారుడు చెప్పినట్లుగా చంద్రబాబులో ఇప్పుడు పుత్రోత్సాహం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. నందమూరి బాలకృష్ణ టాక్ షో  అన్ స్టాపబుల్ సీజన్ 4 శుక్రవారం (అక్టోబర్ 25)న ప్రారంభమైంది. ఫస్ట్ ఎపిసోడ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. తన అరెస్టు, జగన్ అరాచకపాలన, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో తన విజన్..  ఇలా అనేక అంశాలపై చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు నాటి సంఘటనలను వివరిస్తున్నప్పుడు ఒకింత ఎమోషనల్ అయ్యారు. తప్పు చేయని తనను అరెస్టు చేయడమే కాకుండా ఆ సమయంలో తనను ట్రీట్ చేసిన విధానం కడుపు తరుక్కుపోయేలా చేసిందని చంద్రబాబు చెప్పారు.

ఇవన్నీ ఒకెత్తైతే.. తన కుమారుడు నారా లోకేష్ పాదయాత్ర గురించి బాలయ్య అడిగిన ప్రశ్నకు చంద్ర బాబు  సమాధానం ఇచ్చారు. ఆ సందర్భంలో ఆయన కళ్లలో ఆనందం, గర్వం ప్రస్ఫుటంగా కనిపించాయి. తన కుమారుడిగానో, ఎన్టీఆర్ మనవడిగానో, బాలయ్య మేనల్లుడిగానో కాకుండా తన కంటూ ఒక గుర్తింపు, ప్రత్యేకత చాటుకోవాలని లోకేష్ భావించారనీ, అందుకే తాను వారించినా వినకుండా పాదయాత్ర చేశారని చంద్రబాబు చెప్పారు. తండ్రిగా తాను పాదయాత్ర వద్దనే చెప్పానన్నారు. ఒక విద్వేష పూరిత ప్రభుత్వం అధికారంలో ఉంది. పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడమే కాదు అంతకు మించి ఏదైనా చేస్తారేమోనన్న భయం ఉంది. నేరుగా చెప్ప కున్నా పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ పై వైసీపీ మూకలు భౌతిక దాడులకు పాల్పడతాయన్న భయం ఉందని చంద్రబాబు పరోక్షంగా చెప్పారు. అయితే లోకేష్ సాహసోపేతంగా నిర్ణయం తీసుకున్నారనీ, విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేశారని చంద్రబాబు చెప్పారు.  ఆయన చెప్పడమే కాదు.. రాష్ట్ర ప్రజానీకం నారా లోకేష్ లోని పరివర్తనలు చూశారు. ఆయన తనను తాను మేకోవర్ చేసుకున్న తీరును చూశారు.  పరిపూర్ణమైన రాజకీయనాయకుడిగా, ప్రజా నేతగా లోకేష్ సర్వామోదం పొందారు. 

అయితే లోకేష్ కు ఈ సర్వామోదం అంత తేలిగ్గా రాలేదు.   నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే  ఆయనను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి. పప్పు అన్నారు. బాడీ షేమింగ్ చేశారు. హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు చేశారు?  పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా నారా లోకేష్ తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడు పార్టీ ప్రగతి కోసం తన ఆలోచనలకు పదును పెట్టారు. అలా పదును పెట్టడం ద్వారా వచ్చినవే పార్టీ కార్యకర్తలకు జీవితబీమా, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీ. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందన్న భయంతో ప్రత్యర్థి పార్టీలు.. ఆయనపై సైకలాజికల్ ఎటాక్ ప్రారంభించారు. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయాలకు దూరం చేయాలని చూశారు. ఒక ప్రణాళిక ప్రకారం ఆయన వ్యక్తిత్వంపై దాడి చేయా లన్న కుట్రతో వ్యవహరించారు.  ఆయన చదువు, భాష, ఆహారం, ఆహార్యం ఇలా వేటినీ వదలకుండా ఆయనను మానసికంగా కుంగదీయాలని చూశారు.  అయితే లోకేష్ కుంగిపోలేదు. ప్రత్యర్థుల విమర్శలను, మాటల దాడులను, హేళనలను ఎదుర్కొంటూ ముందడుగు వేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. మంత్రిగా అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చేశారు. ప్రత్యక్ష ఎన్నికలలో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా కృంగిపోలేదు. పడిలేచిన కెరటంలా ఎగిశారు. ఎదిగారు.

ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొని సంక్షోభాల్ని అవకాశంగా మల్చుకోవాలన్న తండ్రి మాటల స్ఫూర్తి తో  ముందుకు సాగారు. ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు. యువగళంతో తానేమిటో నిరూపించుకున్నారు.పార్టీకి భవిష్యత్ నాయకుడన్న నమ్మకాన్ని పార్టీలోనే కాదు ప్రజలలోనూ కలిగిం చారు. తండ్రికి తగ్గ తనయుడిగా కాదు..తండ్రిని మించిన తనయుడిగా జేజేలు అందుకుంటున్నారు.  అందుకే బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోలో చంద్రబాబు తన తనయుడు లోకేష్ గురించి మాట్లాడుతూ గర్వంగా ఫీలయ్యారు. పుత్రోత్సాహం ఆయన కళ్లల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.  

By
en-us Political News

  
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.