Publish Date:May 20, 2023
వివేకా హత్య కేసు దర్యాప్తు తీరు ప్రతిష్ఠాత్మక కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రతిష్టను మంటగలుపుతోంది. అవినాష్, సీబీఐల మధ్య గత నాలుగు నెలలుగా సాగుతున్న వ్యవహారం టామ్ అండ్ జెర్రీని గుర్తుకు తెస్తోంది. ఒక సారి నువ్వు పై చేయి సాధించు.. మరో సారి ఆ చాన్స్ నాకివ్వు అని ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా అవినాష్, సీబీఐ తీరు ఉంది. అనివాష్ పార్టీ పనులున్నాయంటూ విచారణకు డుమ్మా కొడితే.. సరే సార్ మీ పనులన్నీ అయ్యాకే తీరిగ్గా విచారణకు రండి అంటూ సీబీఐ గడువులు పెంచుకుంటూ పోవడం చూసి జనం నవ్వుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు వరుసకు సోదరుడనేనా అవినాష్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆయన పట్ల ఇంత ఉదారంగా వ్యవహరిస్తోంది. లేదా అవినాష్ రౌడీయిజానికి అంత పెద్ద దర్యాప్తు సంస్థా బెదరిపోయి జీ హుజూర్ అంటోందా? అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమౌతున్నాయి. అవినాష్ వ్యవహారంలో సీబీఐ తీరుతో తెలుగు రాష్ట్రాలలో సీబీఐ విశ్వసనీయత పూర్తిగా కోల్పోయిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఐపీఎల్ లో బెట్టింగ్ లు చేస్తున్నట్లుగా జనం అవినాష్ ను సీబీఐ అరెస్టు చేయదంటూ కోట్లలో బెట్టింగులు చేస్తున్నారంటే.. సీబీఐ సత్తా, సామర్థ్యంపై విశ్వాసం, విశ్వసనీయతా జనంలో ఏ స్థాయికి దిగజారిపోయాయో అర్ధమౌతుందంటున్నారు.
కాగా కొంచం అటూ ఇటూగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా ఇవే సందేహాలను, ఇవే అనుమానాలనూ వ్యక్తం చేశారు. ఏపీ సీఐడీకి ఉన్న పాటి సత్తా, ధైర్యం కూడా కేంద్ర దర్యాప్తు సంస్థకు లేదా అని నిలదీశారు. లేదా ఏపీ సీఎం తమ్ముడికి సీబీఐ దృష్టిలో ఏమైనా ప్రత్యేక అర్హతలు ఉన్నాయా అని సందేహం వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఒక రూలు, ఎంపీ, వైఎస్ అవినాష్ రెడ్డికి మరో రూలూ ఉంటుందా అని ప్రశ్నించారు.
తలా తోకా లేని నోటీసులతోనే రాత్రికి రాత్రి ఏపీ సీఐడీ అరెస్టులు చేసి పట్టుకు పోతుంటే.. కోర్టుల నుంచి క్లియరెన్స్ వచ్చిన తరువాత కూడా సీబీఐ అవినాష్ దరిదాపుల్లోకి కూడా ఎందుకు వెళ్లలేకపోతోందని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఇక నుంచి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చినా ఎవరూ విచారణకు హాజరు కావద్దని పిలుపు నిచ్చారు. ఏపీలో అయితే సీబీఐ అడుగు పెట్టలేదన్న ధైర్యంతోనే అవినాష్ కర్నూలు ఆస్పత్రిలో తలదాచుకున్నారని ఆయన ఆరోపించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbi-pride-diminish-39-155675.html
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.