బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిపై కేసు.!

Publish Date:Aug 21, 2026

Advertisement

 

నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు మర్రి జనార్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.   ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని నిరసిస్తూ ఆయన చేపట్టిన ఆందోళన ఇందుకు కారణమైంది.  

తెలంగాణలో  పేద మహిళలు, కుటుంబాలు ఆధారపడిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు నిధులు విడుదల కావడంలేదంటూ.. బీఆర్ఎస్   నిరసనకు దిగింది. ఈ పథకాల అమలును   వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ మర్రి జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం (ఆగస్టు 20)  బీఆర్ఎస్ నాయకులు,  కార్యకర్తలు నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట  ధర్నా చేపట్టారు.  

పోలీసు అనుమతులు లేకుండా  నిర్వహించిన ధర్నా కారణంగా   ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో  రోగులు  ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.   నిరసనకారులు ఆర్డీఓ   కార్యాలయంలోకి   అనుమతి లేకుండా ప్రవేశించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో  పోలీసులు  చర్యలు తీసుకున్నారు.   మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డితో పాటు  మరో 38 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై శుక్రవారం (ఆగస్టు 21)  నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.  

Case againt BRS former MLA, Marri Janardhan Reddy,  BRS Protest, Telangana Politics, Nagarkurnool Rasta Roko

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో  ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా   రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని 27   కీలకమైన వ్యూహాత్మక, భౌగోళిక ప్రాంతాలను వాటి అసలైన  ఇండయన్ స్టాండర్డ్ పేర్లతో  సర్వే ఆఫ్ ఇండియా  అధికారిక మ్యాప్‌లలో చేర్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది.
వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చారు. వీరందరికీ చంద్రగిరి వైసీపీ ఇన్ చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వం వహించారు. పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు ఎస్పీ కార్యాలయానికి తరలి వచ్చి ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పిస్తామని కోరారు. అయితు.. పోలీసులు నిబంధనల మేరకు ఎస్పీని కలిసేందుకు ఐదుగురు ప్రతినిధులను మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
తిరుపతి జిల్లా సత్యవేడులోని మాదన్నపాలెం వద్ద హీరో మోటార్స్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 కు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ తో కలిసి బుధవారం శంకుస్థాపన చేసిన చంద్రబాబు.. హీరో మోటార్స్ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ పారిశ్రామిక వేత్తగా జాతి నిర్మాణానికి సహకరించిన గొప్ప వ్యక్తి అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే, జీ7 అవుట్‌రీచ్ సెషన్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ అమెరికా చర్యలను మోదీ నిలదీయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. సముద్ర వాణిజ్య మార్గాలను సురక్షితంగా ఉంచడం, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించే నావికుల ప్రాణాలకు భద్రతను నిర్ధారించడం కేవలం ఒక్క దేశానికే పరిమితం కాదని, అది ప్రపంచ దేశాల ఉమ్మడి, సమష్టి బాధ్యత అని ఆయన ప్రపంచ దేశాధినేతల సమక్షంలో గట్టిగా చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ లక్ష్య దిశగా వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే అన్నారు.
నిరాడంబర జీవనశైలికి పేరుగాంచిన నారాయణ దంపతులు ప్రజా సేవకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. రాజకీయ జీవితంలోనూ సాధారణ జీవన విధానాన్ని అనుసరిస్తూ, సామాజిక బాధ్యతను చాటుకుంటూ వచ్చిన వారు ఇప్పుడు మరోసారి తమ సేవాభావాన్ని ఇలా చాటారు. ఈ నిర్ణయంపై రాజకీయా లకు అతీతంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే ముందే అండమాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులు రుతుపవనాల రాకకు సానుకూలంగా మారడంతో ఈ వారం చివరి నాటికి ఇవి అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
బీసీసీఐ సహకారం కోరుతూ బంగ్లా క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ నజ్ముల్ అబేదిన్ తాజాగా ఓ లేఖ రాశారు. మేం బీసీసీఐకి రాసిన లేఖలో ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి ప్రస్తావించాం. బంగ్లాకు సహకారం అందించే అవకాశాలను పరిశీలించమని విజ్ఞప్తి చేశాం. సెప్టెంబర్‌లో బంగ్లా పర్యటనకు టీమిండియాను పంపించాలని కోరాం.
ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లోని సైనిక స్థావరాల నుంచి పారిపోయిన అమెరికా సైనికులు హోటళ్లలో తలదాచుకుంటూ.. పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఇక అటువంటి వారికి ఆశ్రయమిచ్చే హోటళ్లపై తమ డ్రోన్లు దాడి చేస్తాయని స్పష్టం చేశారు.
పండితులు వేదమంత్రోచ్ఛారణాల మధ్య మోడీకి, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు ఆశీర్వాదం అందజేశారు. అమ్మవారి స్వామి వార్ల ప్రసాదాలను, అలాగే చిత్రపటాన్ని మోడీకి అందించారు. అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా శ్రీశైల ఆలయ కళా రూపాన్ని మోడీకి బహూకరించారు.
Publish Date:Sep 21, 2012

The role or involvement of al Qaeda in the attack

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.