Publish Date:Jun 28, 2022
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే సినీ దర్శకుడు రామగోపాల వర్మ నేడో రేపో అరెస్టవుతారా? ఆయన అరెస్టు నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇంతకూ ఆయనను ఏపీ పోలీసులో, తెలంగాణ పోలీసులో అరెస్టు చేయబోవడం లేదు. ఉత్తర ప్రదేశ్ నుంచి పోలీసులు వచ్చి ఆయనను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంతకీ యూపీ పోలీసులు రామగోపాల వర్మను ఎందుకు అరెస్టు చేస్తారంటారా? అయితే ఈ విషయం తెలియాల్సిందే. రామగోపాల వర్మ ఇటీవల ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ట్వీట్టర్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె పేరును దృష్టిలో పెట్టుకుని పాండవులు, కౌరవులు అంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన జ్వాలలు ప్రజ్వరిల్లాయి. అన్ని వైపుల నుంచీ విమర్శలు వెల్లువెత్తడంతో రామ గోపాల వర్మ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు పేర్కొంటూ సదరు ట్వీట్ ను తొలగించారు.
అయితే ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ నేతలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో యూపీ పోలీసులు రామగోపాల వర్మపై కేసు నమోదు చేశారు. ఇటువంటి ఫిర్యాదులు తెలుగు రాష్ట్రాలలోనూ వచ్చినా..అవేవీ కేసు నమోదు వరకూ వెళ్లలేదు. అయితే యూపీలోని లక్నోలో మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడే అందరికీ ఆయన అరెస్టు అనివార్యమని అనిపిస్తోంది. ఎందుకంటే.. యూపీలో బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం, పోలీసులు వెంటనే కేసు నమోదు చేయడంతో బీజేపీ రామగోపాల వర్మ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుందని అర్ధమౌతోంది.
ముఖ్యంగా రామగోపాల వర్మ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆగ్రహంతో ఉన్నారనీ, ఇష్టారీతిన సామాజిక మాధ్యమంలో తోచిన వ్యాఖ్యలు పోస్టు చేయడం సరికాదని అర్ధమయ్యే రీతిలో బుద్ధి చెప్పాలని ఆయన తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. పైగా స్వయంగా ప్రధాని మోడీ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థిపై రామ్ గోపాల్ వర్మ ఆకతాయిలా వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు ఆగ్రహం కలిగించిందనీ, అందుకే కఠినంగా వ్యవహరించే యోగి సీఎంగా ఉన్న రాష్ట్రాన్ని ఎంచుకుని మరీ రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేసి కేసు నమోదయ్యేలా చూశారనీ పరిశీలకులు అంటున్నారు.
కేసు ఎటూ నమోదైంది కనుక ఇక నేడో రేపో యూపీ పోలీసులు ఆయనను అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ముర్ముపై వ్యాఖ్యల విషయంలోనే కాకుండా... రామ్ గోపాల వర్మ గతంలో హిందూ దేవుళ్లపై సెటైర్లు వేస్తూ చేసిన ట్వీట్లపై కూడా బీజేపీ ఆగ్రహంగా ఉంది. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ హిందూ దేవుళ్లపై సెటైర్లను సహించరని అంటారు. ఈనేపథ్యంలోనే ఆర్జీవీ ద్రౌపది ముర్ముపై చేసిన అనుచిత వ్యాఖ్యలను అవకాశంగా తీసుకుని ఆయనకు గుణపాఠం చెప్పాలని బీజేపీ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/case-against-rgv-in-up-for--comments-on-draupati-murmu-39-138621.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.