కేసీఆర్ నాయకత్వంలోని బారత రాష్ట్ర సమితి ఎన్సీపీలో విలీనం కాబోతోంది. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. నిజంగా నిజం. మహారాష్ట్రలోని బీఆర్ఎస్ శాఖ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో విలీనం కాబోతోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందన్న మాట ఆ పార్టీ అధినాయకత్వమే మరిచిపోయింది.
టీఆర్ఎస్ నుంచి పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్న ఆ పార్టీ అధినేత ఆశలు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలవ్వడంతో ఆవిరైపోయాయి. ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కనీసం ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం కోసం ఆ పార్టీ కన్న కలలు అంతకు ముందే గల్లంతయ్యాయి. దీంతో ఆ పార్టీ జాతీయ రాజకీయాల వైపు చూడటమే మానేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలలో పార్టీ కార్యకలాపాలను ఆర్భాటంగా ప్రకటించి ఆయా రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుల నియామకం కూడా చేపట్టేశారు.
అయితే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలు కావడంతో ఆయా రాష్ట్రాలలో పార్టీ శాఖల విస్తరణకు మంగళం పాడేశారు. అంతే కాకుండా ఓటమి అవమాన భారంతో కేసీఆర్ పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నేతలు, క్యాడర్ కు కూడా అందుబాటులోకి రావడంలేదు. దీంతో ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా మిగిలిపోయింది. ఏపీలో ఆ పార్టీ అనవాలు కూడా కనిపించడం లేదు. ఇక ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ మహారాష్ట్ర శాఖ ఎన్సీపీలో విలీనం కావడానికి రెడీ అయిపోయింది.
త్వరలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ రావు మంగళవారం (అక్టోబర్ 1) ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతలందరూ ఉణ్నారు. దీంతో బీఆర్ఎస్ ఎన్సీపీలో విలీనం కావడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈ విషయంలో శషబిషలకేం తావు లేదనీ, తాము ఎన్సీపీలో విలీనం కానున్నామని బీఆర్ఎస్ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ రావు కుండబద్దలు కొట్టేశారు. ఈ నెల 6న పూణెలో ఎన్సీపీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో తామంతా ఎన్సీపీ తీర్థం పుచుకుంటామని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-to-merge-in-ncp-39-186005.html
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.