మెదడు, గుండె పనిచేయాలంటే ఖనిజాలు కావాలి.. 

Publish Date:Sep 1, 2021

Advertisement

శరీరంలోని కీలక అంగాలు సరిగ్గా పని చేయాలంటే శరీరానికి ఖనిజాలు అవసరం. ప్రతి సెకను ప్రతి రోజూ మన శరీరం ఖనిజాల పైనే ఆధారపడి ఉంటుంది.ముందుగా అసలు ఖనిజాలు ఎక్కడ ఉంటాయో కనుక్కోవాలి. ఖనిజాల వల్ల కొన్నిబిలియన్ల్స కణాలు స్పందిస్తాయి. ఇవి ఒకవిధంగా చెప్పాలంటే  విద్యుత్ తరంగాలు తగలగానే మనం ఎలా స్పందిస్తామో ఖనిజాల వల్ల మన శరీరంలో ఉన్న మెదడు, గుండె అలా స్పందిస్తుంది. స్పందించడమే కాదు సరిగా పనిచేసే విధంగా  ఖనిజాలు సహకరిస్తాయి. శరీరంలో ఉన్న ఖనిజాల మూలంగా ఓస్మోసిస్ వల్ల శరీరంలో ఉన్న  నీటి వత్తిడిని నియంత్రించి పోషకాలను తీసుకుంటుంది. శరీరానికి చాలా ఖనిజాలు కావాలి. వాటిని తప్పక వాడాల్సిన  అత్యవసరమైన ఖనిజాలుగా పేర్కొన్నారు. ఇవి కొన్ని సందర్భాలలో రెండుగా విభజింపబడ్డాయి అవి మ్యాక్రో ఖనిజాలు, మైక్రో ఖనిజాలు ఈ రెండు ఖనిజాలు సమానమైనవి కీలకమైనవే అని నిపుణులు విశ్లేషించారు. ఖనిజాలు పెద్ద మొత్తంలో అంటే ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో అవసరం. ఖనిజాలు తక్కువ అవసరమన్న సంకేతం మనకు ఇవ్వదు. అయితే ఆ ఖనిజాలు మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తాయని మన శరీరం సరిగ్గా పని చేయాలంటే పూర్తి స్థాయిలో సహజమైన ఉప్పుఖనిజాలు అవసరమని నిపుణులు పేర్కొన్నారు. 

ఖనిజాలను కనుగోనడం అత్యవసరమని వాటిని సక్రమంగా అందించినప్పుడే అటు మెడకు, ఇటు నరాలకు ఒక విద్యుత్ తరంగాలుగా పని చేస్తాయి. ఖనిజాలు హార్మోన్ ఉత్పత్తి చేయడంలో దోహదం చేస్తాయి. ఖనిజాలు కేవలం ఒక సెల్ల్యులార్ స్థాయిలో మెటబాలిజంను నియంత్రించడంలో  కీలకంగా వ్యవహరిస్తాయి. నిపుణుల అంచనా ప్రకారం 90 % ప్రజలు ఖనిజాల లోపంతో బాదపడుతున్నారని అంచనా. ఖనిజాల సమాతౌల్యం లోపం నివారించాడానికి హిమాలయ రాక్ సాల్ట్ లో 84రకాల ఖనిజాలు ఇందులో ఎలక్ట్రో  లైట్స్ ,  కాల్షియం అయోడిన్, పొటాషియం, మెగ్నీషియం , ఐరన్  వంటివి లభిస్తాయని నిపుణులు తేల్చారు. సహజంగా సంప్రదాయ బద్దంగా తాజా పప్పులు, తాజా పళ్ళు, కూర గాయాలు, పోషకాలతో పాటు సారవంతమైన భూమిలో సహజంగా ఐరన్, ఖనిజాలు లభిస్తాయి.  కానీ, దురదృష్ట వసాత్తూ నేడు ప్రపంచంలో భూములలో సహజంగా లభించే పోషకాలను మనం గుర్తించకపోవడం గమనించవచ్చు.

ఆధునిక వ్యవసాయం పేరుతో మనం చేస్తున వ్యవసాయం పూర్తిగా క్రిమి సంహారక మందుల పైనే ఆదారపడడాన్ని మనం గమనించవచ్చు అలాగే భూమికోతకు గురికావడం, ప్రకృతి విపత్తుల వల్ల మనకు భూమి ద్వారా లభించే పోషకాలు కోల్పోతున్నామని  నిపుణులు అన్నారు. ఇప్పటికే సహజంగా ప్రకృతి నుంచి  లభించే  ఖనిజాలు కనుమరుగుకావడం పై  శాస్త్రజ్ఞులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ భూమిలో ఉండాల్సిన సహాజ ఖనిజాలు లోపిస్తే వాటి ప్రభావం ఆయా పంటలు ఉత్పత్తి పైన పడే అవకాశం ఉందని నిపులు హెచ్చరిస్తున్నారు. అదేపనిగా భూమిపై కృత్రిమ ఎరువులు క్రిమి సంహారక మందులు వాడడం వల్ల ఆహార ఉత్పత్తుల ద్వారా రావల్సిన సహజ ఖనిజాలు లోపిస్తున్నాయని  ఇది ప్రకృతి సమతౌల్యం ఏర్పడి, వాతావరణాన్ని సైతం కలుషితం చేస్తున్నాయని ఈ విషయం తీవ్రంగా పరిగణించాలని శాస్త్ర వేత్తలు సూచించారు.అందుకు మానవ జీవితానికి ఖనిజాలు తప్పనిసరి అని నిపుణులు సూచించారు. 

By
en-us Political News

  
బిఎమ్ఐ.. దీన్నే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. ఎత్తుకు తగ్గ బరువు  ఉన్నారా లేదా తెలుసుకోవడంలో ఇది సహాయపడుతుంది. నేటి కాలంలో అన్ని వయసుల వారిలో అధిక బరువు , ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది.
ఇష్టమైన ఆహారం తింటూనే సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ సూచించిన అట్కిన్స్ డైట్ ప్లాన్ విశేషాలు తెలుగులో తెలుసుకోండి.
రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తుందా? ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరంలో శక్తి లేకపోతే, అది కేవలం సాధారణ అలసట మాత్రమే కాకుండా Chronic Fatigue Syndrome (CFS) అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
టి కాలంలో రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడం కామన్.  ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తప్పకుండా చేస్తారు.
మధుమేహం అనేది వేగంగా పెరుగుతున్న ఒక  వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కొందరికి కాలివేళ్లు , చేతివేళ్ల కీళ్లలో నొప్పి, మోకాళ్లు , చీలమండలలో వాపు, , నడవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతుంటాయి.  ఇవి యూరిక్ యాసిడ్ పెరగడానికి సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మినుముల పులగం అనేది మన సంప్రదాయ ఆహారాల్లో ఎంతో విలువైనది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, బలం, శక్తిని అందించే సహజమైన ఆహారం.
వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి  వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అనేది పెద్దవారికే వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సమస్య పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే..
గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలకు ఇంట్లోనే వాము, ధనియాలు, జీలకర్ర, సోంపుతో ఆయుర్వేద చూర్ణం ఎలా తయారు చేయాలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించిన పూర్తి వీడియో.
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే ...
గాలి కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యం.. ఇలా ప్రతిదీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.  బయటకు వెళ్లినప్పుడు వాహనాల పొగతో పాటు ఎన్నో కారణాల వల్ల గాలి కాలుష్యం అవుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.