బ్లూమింగ్‌టన్ తెలుగు అసోసియేషన్ సేవానిరతి

Publish Date:Dec 18, 2014

Advertisement

 

అమెరికాలోని బ్లూమింగ్‌టన్ తెలుగు అసోసియేషన్ తన సేవా నిరతిని చాటుకుంటోంది. ఇద్దరు చిన్నారుల అరుదైన వ్యాధికి శస్త్రచికిత్స కోసం డిసెంబర్ 20వ తేదీన బ్లూమింగ్‌టన్‌లోని వైడబ్ల్యుసీఎలో ‘బ్రేక్‌ఫాస్ట్ సేల్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తమరా సెన్సర్ అనే వ్యక్తి ఇద్దరు కుమారులు మసోన్, ఆస్టిన్‌ అవయవ మార్పిడి చేయాల్సిన వ్యాధిని ఎదుర్కొంటున్నారు. అరుదైన ఈ వ్యాధికి శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం వుంది. దీని కోసం బ్లూమింగ్టన్ తెలుగు అసోసియేషన్ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తోంది. డిసెంబర్ 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘బ్రేక్‌ఫాస్ట్ సేల్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బ్లూమింగ్టన్ తెలుగు అసోసియేషన్, చిల్డ్రన్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

By
en-us Political News

  
కెనడాలోని ఎటోబికోలో ఉన్న డాంటే అలిఘేరి అకాడమీ ఆడిటోరియంలో గ్రేటర్ టొరంటో ఏరియాలోని తెలుగు సంఘం ‘ఉగాది’ తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకుంది. టొరంటో, మార్కమ్, బ్రాంప్టన్, మిస్సిసాగా, ఓక్వల్, వాటర్ డౌన్, కిచెనర్, వాటర్లూ, కేంబ్రిడ్జ్, హామిల్టన్, మిల్టన్ మరియు ఇతర ప్రాంతాలతో సహా సమీప నగరాల నుండి వచ్చిన అనేక వందల తెలుగు కుటుంబాలు ఆరు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. సంగీతం, నృత్యం, యూత్ ఫ్యాషన్ షో, వంట పోటీ మరియు అనేక ఇతర ఉత్తేజకరమైన ఈవెంట్లు ఘనంగా జరిగాయి.
అమెరికాలోని  సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన వేడుకల్లో  సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ పాలకవర్గ మండలి, అధ్యాపకులు, విద్యార్థులు, దాతలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. కూచిపూడి నాట్యం, కర్ణాటక సంగీతం, భరత నాట్యం, సంస్కృతం కోర్సులలో భారతదేశం, ఉత్తర అమెరికా, దక్షిణ ఆఫ్రికా దేశాలనుండి మొత్తం 38 మంది విద్యార్థులు డిగ్రీ, డిప్లమో పట్టాలను పొందారు. కుటుంబ సభ్యులతో వర్చువల్ సదస్సులో పాల్గొని వారంతా ఆనందోత్సవాల్ని పంచుకొన్నారు. 
న్యూ జెర్సీ NRI TDP నిర్వహించిన AP CM తో మీట్ & గ్రీట్ సమావేశానికి, ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన స్థానిక సాయి దత్త పీఠం ( షిరిడీ ఇన్ అమెరికా) బృందం, చంద్రబాబు నాయుడు ను దుశ్శాలువాతో సత్కరించి..

అమెరికాలో తెలుగు భాష అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న సంస్థ సిలికానాంధ్ర. ఇప్పటి వరకు 6000 మందికి పైగా విద్యార్థులకు తెలుగు నేర్పిస్తున్న ఘనత సిలికానాంధ్ర సొంతం. తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన మనబడి

ప్రస్తుత విద్యాసంవత్సరంలో సిలికానాంధ్ర మనబడిలో 3000 మంది పిల్లలు చక్కగాతెలుగు వ్రాయటం , చదవటం , మాట్లాడటం నేర్చుకున్నారు. మరింతమంది రేపటి తరం పిల్లలకి ప్రణాళికాబద్ధంగా తెలుగు నేర్పించాలని చేసే ప్రయత్నమే సిలికానాంధ్ర మనబడి ప్రభంజనం 2014. సిలికానాంధ్ర మనబడి ప్రభంజనంలో భాగంగా , వచ్చే విద్యాసంవత్సరంలో 5000 మంది పిల్లలకి తెలుగు నేర్పించాలని లక్ష్యంగా

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.