కొన్ని అందరికీ తెలిసే జరుగుతాయి. మరికొన్ని జరిగిన తర్వాతే తెలుస్తాయి. కొన్నింటికి వ్యూహ రచన చాలా రోజుల క్రితమే జరుగుతుంది. జరిగిన తర్వాత అందరూ ఆశ్చర్యపడతారు. మహారాష్ట్ర సంక్షోభానికి తెరపడటం, శివసేన నాయకుడు షిండే ముఖ్యమంత్రి కావడం మూడవ కోవలోకే వస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ముందు ఫడ్నవీస్ను అనుకుని ఆనక షిండేను ప్రకటించడం, ఫడ్నవీస్ని ఉప ముఖ్య మంత్రిని చేయడం చాలామందిని ఆశ్చర్యపరచింది. చివరి నిమిషంలో ఈ మార్పు వ్యవహారం అంతా వాస్తవానికి బిజెపీ వ్యూహమే. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ మార్పులుచేర్పులు చేసిందనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి.
మొదట ఫడ్నవీస్ బయటనుంచే మద్దతునిస్తానని అన్నారు. కానీ ఆయన్ను ఉపముఖ్యమంత్రిగా వుం డేందుకు అంగీకరించేలా చేయడానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బిజెపి ఛీఫ్ నడ్డా రంగం లోకి దిగాల్సి వచ్చింది. సరే పార్టీ పెద్దలంతా చెబుతున్నారు గనుక ఫడ్నీవీస్ సరే అనకా తప్పలేదు. గతంలో ముఖ్యమంత్రిగా చేసి ఇపుడు ఉప ముఖ్యమంత్రిగా చేయడానికీ అంగీకరించిన రాజకీయ నాయ కులలో ఫడ్నవీస్ నాలుగవ స్థానంలో వున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, ఈ విధంగా పద వుల్లో మార్పులు చేర్పులు చేయడం ద్వారా శివసేనను చీల్చినట్టే అయింది. అంతేకాదు ఎన్సిసి అధినేత శరద్ పవార్కు మహారాష్ట్రలోనే పెను సవాల్ విసిరినట్టు అయింది. పవార్ పశ్చిమ మహారాష్ట్ర సతారాకు చెందిన నాయకులు. అక్కడి నుంచి వచ్చిన యువ నాయకుడు షిండే!
మహారాష్ట్రంలో బిజెపి ఓటు బ్యాంక్ను మాధవ్ అని తొలినాళ్లలో పిలిచేవారు. మాధవ్ అంటే మాధవుడు కాదు. మాలి, ధనగీర్, వంజారా కమ్యూనిటీలు. అయితే మోదీ ప్రధాని అయిన తర్వాత ఓబిసీ, అర్బన్ ఓటర్లకు బిజెపి ప్రచారాలు, పిలుపులు బాగా ఆకట్టుకున్నాయి. బిజెపి పట్ల మొగ్గు చూపారు. ఇక ఇపుడు ఏకంగా మరాఠా రాజకీయ నాయకుడినే ముఖ్యమంత్రిని చేయడం ద్వారా బిజెపి వారి దృష్టిలో మహో న్నతంగా ఎదిగింది. ఇది తప్పకుండా వారికి 2024 ఎన్నికల్లో 32 శాతం మరాఠా ఓట్లు పడడానికి ఎంత యినా ఉపకరిస్తుంది.
షిండేను ముఖ్యమంత్రి చేయడంలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి బిజెపి చిన్నపాటి హెచ్చరిక చేసినట్టయింది. రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ అయినప్పటికీ మహారాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని తమ పార్టీవారికి కాకుండా హిందూత్వ రక్షణ ఆలోచనతోనే శివసేనకు చెందిన షిండేకు కట్టబెట్టామని చెప్పుకుంటోంది. అందువల్ల పెద్ద వ్యూహమే షిండేను మంత్రించింది! 2019 ముంబయి నగర మేయర్ ఎన్నికల్లో కూడా బిజెపి ఎన్నికల్లో పోటీ చేయ కుండా శివసేనకే ఆ పదవి దక్కించుకునేందుకు వీలు కల్పించింది. బిజెపి కుటుంబపాలనను తిరస్క రిస్తుంది. థాక్రే కుటుంబం మహారాష్ట్రను ఏలడానికి బిజెపీ వర్గీయులకు ససెమీరా నచ్చలేదు. అందుకే చిన్న స్థాయినుంచి శివసేనలో చెప్పుకోదగ్గ నాయకునిగా నిలిచి ఏకంగా థాక్రేకు ఝలక్ ఇవ్వగలిగిన షిండేను ముఖ్యమంత్రిని చేయడంలో బిజెపి ఆలోచన అనన్య సామాన్యం. ఇదంగా 2024 ఎన్నికల్లో సత్తా చాటడానికి ముందస్తుగా పావులను కదుపుతూ విపక్షాలకు నిద్ర లేకుండా చేయాలన్న వ్యూహరచనేై!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-game-plan-39-139058.html
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.