ప్రాంతీయ పార్టీల పాలిట అనకొండ బీజేపీ!?

Publish Date:Aug 13, 2022

Advertisement

ఎన్డీయే ఖాళీ అవ్వడం వెనుక బీజేపీ వ్యూహం ఉందా? ఉద్దేశ పూర్వకంగానే మిత్రపక్షాలను కూటమి వీడేలా బీజేపీ వ్యవహరిస్తోందా? 2024 ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగడమే రాజకీయంగా తమకు లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది.

ఆ పార్టీ చెబుతున్న డబుల్ ఇంజిన్ అర్ధం ఇదేనా? దేశ  వ్యాప్తంగా అన్నిరాష్ట్రాలలోనూ అధికారం చేజిక్కించుకోవాలంటే ముందుగా ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలను బలహీనం చేయాలన్నదే ఆ పార్టీ లక్ష్యమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వారి వ్యూహానికి బీహార్ లోని జేడీయూ అధినేత బ్రేక్ వేశారా? బీహార్ లో బీజేపీ వ్యూహం బెడిసికొట్టిందా? అంటే కూడా ఔననే అంటున్నారు. ఎన్డీయే కూటమి నుంచి ఒక్కటొక్కటిగా పార్టీలు వైదొలగడానికి కారణం బీజేపీ వ్యవహరిస్తున్న తీరే కారణమని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

అవసరార్ధం ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడం.. ఆ తరువాత అనకొండలా వాటిని మింగేయడానికి ప్రయత్నించడం.. కాశ్మీర్ నుంచి మహారాష్ట్ర వరకూ బీజేపీ అనుసరించిన వైఖరి ఇదేనని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్ని ప్రాంతీయ పార్టీలూ పొత్తు విచ్ఛిన్నమయ్యే సమయానికి తమ స్వరాష్ట్రంలో బలహీనపడిన ఉదంతాలే ఉన్నాయని అంటున్నారు. బీహార్ పరిణామం తరువాత బీజేపీతో మైత్రి చెడిన పార్టీల నుంచి ఇంకా పొత్తులో కొనసాగుతున్న పార్టీల వరకూ అన్ని నితీష్ వ్యూహాలను ప్రశంసిస్తున్నారు. ఆయన కీలెరిగి బీజేపీకి వాత పెట్టారని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో మెజారిటీ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉండడానికి కారణం.. ఆయా రాష్ట్రాలలో అవసరార్దం పొత్తులు కుదుర్చుకుని.. వాటి అండతో రాష్ట్రంలో బలపడి.. ఆ తరువాత వాటినే టార్గెట్ చేయడం బీజేపీ గత ఎనిమిదేళ్లుగా అనుసరిస్తున్న వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అలా ఇప్పుడు నితీష్‌ టార్గెట్ చేసిందనేది కూడా ఓ  ఆరోపణ. నిజానికి వరుస పరిణామాలకు ఈ మాటలకు మరింత బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయ్. ఇప్పుడు బిహార్ మాత్రమే కాదు.. ఈ మధ్యే ముగిసిన మహారాష్ట్ర పంచాయితీతో పాటు.. పంజాబ్‌లో శిరోమణి అకాళీదళ్‌తో దోస్తీకి కూడా బ్రేక్ పడింది. బీహార్ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రానికి చెందిన   లోక్‌ జనశక్తి పార్టీ.. ఎన్డీఏలో ఒకప్పుడు భాగంగా ఉండేది.   రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ మరణం తర్వాత ఎల్‌జేపీ పగ్గాలు చేపట్టిన ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ పావుగా వాడుకొందన్న విమర్శలున్నాయి. బీహార్ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులున్న చోట బలమైన క్యాండిడేట్లను నిలబెట్టడం ద్వారా ఓట్లను చీల్చింది ఎల్‌జేపీ.  ఎన్నికలయ్యాక చిరాగ్‌ను పట్టించుకోవడం మానేసింది బీజేపీ నాయకత్వం. అదే సమయంలో ఎల్‌జేపీలో చెలరేగిన తిరుగుబాటు సమయంలో … చిరాగ్‌ పాశ్వాన్‌ స్థానంలో ఆయన బాబాయి పశుపతి కుమార్‌ పరాస్‌కు బీజేపీ మద్దతుగా నిలబడింది. ప్రస్తుతం ఎల్ జెపీ   పూర్తిగా పశుపతి హ్యాండోవర్‌లో ఉంది. పాశ్వాన్ వారసుడిగా చక్రం తిప్పుదామనుకున్న చిరాగ్‌.. బీహార్ పాలిటిక్స్‌లో కంప్లీట్‌గా సైడ్ అయిపోయారు.

ఇక మహరాష్ట్ర సంగతి తలిసిందే.  ఒకప్పుడు శివసేన మద్దతుతో మహారాష్ట్రలో నిలబడ్డ బీజేపీ.. ఇప్పుడు ఆ పార్టీనే మింగేసిందనే చెప్పాలి. సీఎం పదవి విషయంలో వచ్చిన పేచీతో ఎన్నో ఏళ్లుగా కలిసి వస్తున్న శివసేనకు రాం రాం చెప్పేసింది బీజేపీ. అటు కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండున్నరేళ్లు పూర్తికాకముందే.. శివసేనలో రేగిన అసమ్మతిని తమకు పూర్తి అనుకూలంగా మార్చుకున్న కమలం పార్టీ వ్యూహాలతో ఉద్ధవ్ థాక్రే మల్లగుల్లాలు పడుతున్నారు.  కనీసం పార్టీ చిహ్నం అయినా తమకు దక్కుతుందా? దక్కదా అన్న అయోమయంలో ఉద్ధవ్ థాక్రే ఉన్నారు. పేరుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ షిండే అయినా పగ్గాలు మొత్తం బీజేపీవే అన్నట్లుగా ఇప్పుడు మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం మనుగడ సాగుతోంది.  ఇక తమిళనాడులోనూ ఇదే పరిస్థితి.  శిరోమణి అకాలీదళ్ వ్యవసాయ చట్టాల విషయంలో విభేదించి ఎన్డీయేకు గుడ్ బై చెప్పింది. అటు అమరీందర్ సింగ్ కాంగ్రెస్ గుడ్ బై చెప్పేదాకా వెంటపడింది. చివరకు బీజేపీ ఉచ్చులో చిక్కుకుని అమరీందర్ సొంత కుంపటి పెట్టగానే ఆయన పార్టీతో పొత్తు పెట్టుకుంది. అయితే ఈ పొత్తు పంజాబ్ ఎన్నికలలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయినా.. కాంగ్రెస్ ను అధికారం నుంచి దూరం చేయడానికి మాత్రం దోహదపడింది. అంతే కాకుండా కాంగ్రెస్ నేతగా, పంజాబ్ సీఎంగా తిరుగులేని నేతగా ఉన్న అమరీందర్ ను ఇప్పుడు రాష్ట్రంలో నామమాత్రపు నేతగా మార్చేసింది.    దేశవ్యాప్తంగా అధికారంలో ఉండాన్న పట్టుదలతో బీజేపీ   మిత్రుడు, శత్రువు అని తేడా లేకుండా వ్యూహాలు రచిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

అక్రమంలోనే మిత్ర పక్షాలను బలహీనం చేసి, లేదా మింగేసి ఆయా రాష్ట్రాలలో బలోపేతం అయ్యేందుకు ఎత్తులు వేస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్‌ ఇన్‌ లవ్‌ అండ్ వార్ అన్న నానుడికి బీజేపీ.. పాలిటిక్స్ కూడా చేర్చేసిందని అంటున్నారు.

By
en-us Political News

  
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.