అవనిగడ్డ లో  నిషేధిత ఐసిస్ డ్రగ్ కలకలం...దాడుల్లో విస్తుకోల్పేయే నిజాలు

Publish Date:Mar 22, 2025

Advertisement

ఆంధ్ర ప్రదేశ్  అవనిగడ్డలో  ఐసిస్ డ్రగ్ కలకలం రేపింది.  తాజాగా ఈగల్ టీం దాడుల్లో విస్తుకోల్పోయే నిజాలు వెల్లడయ్యాయి. ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలు వినియోగించే డ్రగ్స్  కృష్ణా జిల్లా అవనిగడ్డ వీధుల్లో లభ్యం కావడంతో అధికారుల  ఫీజులు ఎగిరిపోయాయి. ఐసిస్  ఉగ్రవాద సంస్థ వినియోగించే  ట్రెమడాల్ అనే సైకో ట్రోపిక్ సబ్ స్టెన్స్( మాదక ద్రవ్యం) ఎలాంటి అనుమతులు లేకుండా  విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు.  గత రెండేళ్ల కాలంలో  55,961 ట్రెమడాల్  ట్యాబ్లెట్లు, 2, 794 ఇంజక్షన్లు అనుమతి లేకుండానే విక్రయాలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అవనిగడ్డలోని భార్గవ్ మెడికల్ హాల్ ఈ చీకటి వ్యాపారాన్ని ప్రారంభించింది నిన్న మొన్న కాదు.2022 నుంచి  అమ్మకాలుచేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అప్పట్లో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఈ అమ్మకాలను కట్టడి చేయలేకపోయింది. ఐసిస్ డ్రగ్ దందాను నడుపుతున్న భార్గవ్ మెడికల్ షాపుపై కేసు నమోదైంది.  మెడికల్ షాప్ యాజమాని కొనకళ్ల రామ్మోహన్  తాను చేసిన నేరాన్ని  అంగీకరించారు. చాలాకాలం నుంచి నిషేధిత డ్రగ్స్ అమ్ముతున్నట్లు చెప్పారు. ఈగల్ టీం అధికారులు దాడులు జరపడం ఇదే మొదటి సారి అని రామ్మోహన్ పేర్కొన్నారు. 

ఫైటర్ డ్రగ్ గా పిలిచే ఐసిసి డ్రగ్ ను మిలిటెంట్లు శిక్షణ కాలం నుంచే వాడతారు. కొత్తగా రిక్రూట్ అయిన మిలిటెంట్ల కు శిక్షణ ఇచ్చే కాలంలో ఐసిస్ డ్రగ్ వినియోగిస్తే అలసట, నిద్ర రాకుండా ఉంటుందని అధికారులు తెలిపారు, ఎక్కువ సేపు  ఉత్తేజంగా పనిచేయటానికి ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఉగ్రవాదులకు ఈ ట్రెమడాల్‌ మాత్రలను అందిస్తుంటాయి. అందుకే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ''ఐసిస్‌ డ్రగ్‌''గా పిలుస్తారు.  ఎన్ ఫోర్స్ మెంట్   డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు  దాడులుచేసి నిషేధిత డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్  ఈగల్ ఐజి రవికృష్ణ తెలిపారు.  ట్రెమడాల్ డ్రగ్ ను  2018లో  కేంద్ర ప్రభుత్వం నిషేధిత డ్రగ్ జాబితాలో చేర్చింది. అంతే కాదు ఎన్ డిపిఎస్ చట్టం పరిధిలో చేర్చింది. ట్రెమడాల్ ను మాదక ద్రవ్యంగా గుర్తించి కాంబినేషన్,  అనుమతించిన పరిమాణంలోనే వైద్యుల సలహా మేరకు వినియోగించాలన్న నిబంధన పెట్టింది. 

అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో  యువత  ఎక్కువగా ఈ నిషేధిత డ్రగ్ వినియోగిస్తున్నట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. వందలాది మంది యువకులు  ఈ మత్తుకు బానిసలయ్యారు.ఎన్ డిపిఎస్ చట్టంలోని సెక్షన్ల క్రింద అవనిగడ్డ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
 కాగా విశాఖ పట్నంలో కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్న ఐదు మెడికల్ షాపులను అధికారులు సీజ్ చేశారు. 

By
en-us Political News

  
గత పది రోజులలో తిరుమలేశునికి దాదాపు 30 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో దాతలు సమర్పించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న పది ట్రస్టులకు గత పది రోజుల్లో భారీ విరాళాలు అందాయి. వాటిలో శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ కు 11 కోట్ల 67 లక్షల 15 వేల 870 రూపాయలను దాతలు విరాళంగా ఇచ్చారు.
 యూట్యూబర్ శంకర్ ను హైద్రాబాద్  అంబర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు.  ఓ యువతి తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యా దు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా శంకర్ ను అరెస్ట్ చేశారు. తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత శంకర్ తనకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నట్లు ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు.
మణిపూర్ లో భూమి కంపించింది.శనివారం (మార్చి 29) మధ్యాహ్నం సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూమికి పది కిలోమీటర్ల లోతున ఉన్నట్లు భూకంప కేంద్రం తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
Publish Date:Mar 29, 2025
ఎపిలో ఎండలు మండిపోతున్నాయి.  మార్చి చివరి వారంలో నాటికే మునుపెన్నడూ లేని ఊష్ణోగ్రతలు మండిపోతున్నాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో సగటున 40 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  ఎపిలోని 150  మండలాల్లో 40 డిగ్రీల ఊష్ణోగ్రతలు దాటాయి
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గన్నవరం కోర్టు శంశీని ఒక్కరోజు కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించడంతో విజయవాడ వచ్చిన గన్నవరం పోలీసులు విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని అదుపులోనికి తీసుకున్నారు.
తెలంగాణ  కొమురం భీం ఆసిఫా బాద్ జిల్లాలో ఓ యువకుడు పక్క పక్క గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులను ఒకేసారి ప్రేమించాడు. ఇద్దరు యువతులను ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించాడు అనుకుంటే పొరబడినట్టే. ఇద్దర్ని ప్రేమించానని ఆ యువకుడు ప్రేమించిన యువతులకు చెప్పినప్పటికీ ఆ యువతులకు కోపం రాలేదు. మేమిద్దరం నిన్ను పెళ్లి చేసుకుంటామన్నారు.  లింగాపూర్  మండలం గుమ్మూర్ కుచెందిన సూర్యదేవ్   ఇద్దరు యువతులను ఒకే సారి పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేశాడు.
తెలంగాణలో అత్యంత కీలకమైన ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న ప్రతిపాదనను కేంద్రం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే అవకాశాలు ఇసుమంతైనా లేవని తేల్చేసింది. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చే ప్రశక్తి లేదని కేంద్రం స్పష్టం చేసింది.
దేశంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్రమోడీ నంబర్ వన్ గా నిలిచారు. ఒక ఆంగ్ల దినపత్రిక 2025 సంవత్సరానికి దేశంలో వంద మంది మోస్ట్ పవర్ పుల్స్ ఇండియన్స జాబితాను వెలువరించింది. ఈ జాబితాలో ప్రధాని మోడీ టాప్ లో నిలిచారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తరువాత వరుసగా మూడు సార్లు ప్రధానిగా ఉన్నది మోడీ మాత్రమే.
   హైద్రాబాద్ బంజారాహిల్స్ లో ఆకతాయి తుపాకీతో భయభ్రాంతులకు గురి చేశాడు. శుక్రవారం అర్దరాత్రి కొందరు యువకులు ఓ పెన్ టాప్ జీప్ లో చేసిన రచ్చ సృష్టించారు.  ఏకంగా జీపు డ్యాష్ బోర్డుపై తుపాకీకి ఉంచి చేసిన విన్యాసాలను చిత్రీకరించారు. ఈ విజువల్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. సుమోటాగా స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిలో సొంత ఇల్లు నిర్మించుకోనున్నారు. ఇందు కోసం ఆయన వెలగపూడిలో ఐదు ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. ఈ6 రోడ్డుకు ఆనుకుని ఉండే ఈ స్థలానికి నాలుగువైపులా రోడ్డు ఉంది.
భారత రాజకీయాలలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం. ఒక ప్రభంజనం. రాజకీయాలలోనే సంక్షేమ పర్వానికి తెరతీసిన సందర్భం. దేశంలోనే ప్రాంతీయ పార్టీలకు ఒక మోడల్. ఒక ఆదర్శం. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఎకఛత్రాధిపత్యానికి చరమగీతం. సరిగ్గా 43 ఏళ్ల కిందట ఇదే రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఆవిర్భావమే ఒక ప్రభంజనం.
వరుస ఎన్ కౌంటర్లతో ఛత్తీస్ గఢ్ దద్దరిల్లిపోతున్నది. తాజాగా శనివారం (మార్చి 28) ఉదయం చత్తీస్గఢ్ లోని దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులో  జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 15 మంది మావోయిస్టులు మరణించారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.