అవనిగడ్డ లో  నిషేధిత ఐసిస్ డ్రగ్ కలకలం...దాడుల్లో విస్తుకోల్పేయే నిజాలు

Publish Date:Mar 22, 2025

Advertisement

ఆంధ్ర ప్రదేశ్  అవనిగడ్డలో  ఐసిస్ డ్రగ్ కలకలం రేపింది.  తాజాగా ఈగల్ టీం దాడుల్లో విస్తుకోల్పోయే నిజాలు వెల్లడయ్యాయి. ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలు వినియోగించే డ్రగ్స్  కృష్ణా జిల్లా అవనిగడ్డ వీధుల్లో లభ్యం కావడంతో అధికారుల  ఫీజులు ఎగిరిపోయాయి. ఐసిస్  ఉగ్రవాద సంస్థ వినియోగించే  ట్రెమడాల్ అనే సైకో ట్రోపిక్ సబ్ స్టెన్స్( మాదక ద్రవ్యం) ఎలాంటి అనుమతులు లేకుండా  విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు.  గత రెండేళ్ల కాలంలో  55,961 ట్రెమడాల్  ట్యాబ్లెట్లు, 2, 794 ఇంజక్షన్లు అనుమతి లేకుండానే విక్రయాలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అవనిగడ్డలోని భార్గవ్ మెడికల్ హాల్ ఈ చీకటి వ్యాపారాన్ని ప్రారంభించింది నిన్న మొన్న కాదు.2022 నుంచి  అమ్మకాలుచేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అప్పట్లో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఈ అమ్మకాలను కట్టడి చేయలేకపోయింది. ఐసిస్ డ్రగ్ దందాను నడుపుతున్న భార్గవ్ మెడికల్ షాపుపై కేసు నమోదైంది.  మెడికల్ షాప్ యాజమాని కొనకళ్ల రామ్మోహన్  తాను చేసిన నేరాన్ని  అంగీకరించారు. చాలాకాలం నుంచి నిషేధిత డ్రగ్స్ అమ్ముతున్నట్లు చెప్పారు. ఈగల్ టీం అధికారులు దాడులు జరపడం ఇదే మొదటి సారి అని రామ్మోహన్ పేర్కొన్నారు. 

ఫైటర్ డ్రగ్ గా పిలిచే ఐసిసి డ్రగ్ ను మిలిటెంట్లు శిక్షణ కాలం నుంచే వాడతారు. కొత్తగా రిక్రూట్ అయిన మిలిటెంట్ల కు శిక్షణ ఇచ్చే కాలంలో ఐసిస్ డ్రగ్ వినియోగిస్తే అలసట, నిద్ర రాకుండా ఉంటుందని అధికారులు తెలిపారు, ఎక్కువ సేపు  ఉత్తేజంగా పనిచేయటానికి ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఉగ్రవాదులకు ఈ ట్రెమడాల్‌ మాత్రలను అందిస్తుంటాయి. అందుకే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ''ఐసిస్‌ డ్రగ్‌''గా పిలుస్తారు.  ఎన్ ఫోర్స్ మెంట్   డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు  దాడులుచేసి నిషేధిత డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్  ఈగల్ ఐజి రవికృష్ణ తెలిపారు.  ట్రెమడాల్ డ్రగ్ ను  2018లో  కేంద్ర ప్రభుత్వం నిషేధిత డ్రగ్ జాబితాలో చేర్చింది. అంతే కాదు ఎన్ డిపిఎస్ చట్టం పరిధిలో చేర్చింది. ట్రెమడాల్ ను మాదక ద్రవ్యంగా గుర్తించి కాంబినేషన్,  అనుమతించిన పరిమాణంలోనే వైద్యుల సలహా మేరకు వినియోగించాలన్న నిబంధన పెట్టింది. 

అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో  యువత  ఎక్కువగా ఈ నిషేధిత డ్రగ్ వినియోగిస్తున్నట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. వందలాది మంది యువకులు  ఈ మత్తుకు బానిసలయ్యారు.ఎన్ డిపిఎస్ చట్టంలోని సెక్షన్ల క్రింద అవనిగడ్డ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
 కాగా విశాఖ పట్నంలో కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్న ఐదు మెడికల్ షాపులను అధికారులు సీజ్ చేశారు. 

By
en-us Political News

  
‘కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల కాలంలో 50 వేల ఉద్యగాలు ఇచ్చింది’ ఈ మంత్రాన్ని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు’ రోజూ జపిస్తూనే ఉంటారు.  మరో వంక ఇందులో గత ప్రభుత్వం ఘాతాలోకి ఎన్ని పోతాయి,కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలోకి ఎన్ని వస్తాయి
  తెలంగాణ  ప్రభుత్వం ఈ నెల ( మార్చి) 19 న 2025 – 2026 వార్షిక బడ్జెట్’ ను సభకు సమర్పించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, రూ’ 3.04,965 కోట్ల అంచనాలతో,బరువు ‘తక్కువ’ బడ్జెట్’ను సభకు సమర్పించారు.
సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌  వర్నింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఒకే వేదికపై కనిపించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో ప్రతి రోజూ, ప్రతి నిమిషం కాంగ్రెస్, బీఆర్ఎస్ బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తుంటాయి.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపిల్ రానే వచ్చేసింది. ఆదివారం  ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. సన్ రైజర్స్ హైద్రాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది.
మత్తు పదార్థాల వలె సెల్ ఫోన్లకు అతుక్కుపోయేవారి సంఖ్య  రోజురోజుకి పెరిరిపోతుంది. ట్రాయ్ 2024  సెప్టెంబర్ నివేదిక ప్రకారం తెలంగాణలో 4.19 కోట్ల మంది ఉన్నట్లు వెల్లడైంది.
 ఎంఆర్ పిఎస్ అధ్యక్షుడు  మందకృష్ణ వైకాపా అధినేత వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల వైకాపా ప్రభుత్వం ఎస్ సి వర్గీకరణ కోసం  ఒక్క ప్రయత్నం కూడా చేయలేదన్నారు జగన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఆ పార్టీలోని మాదిగ నేతలు పునరాలోచించుకోవలన్నారు.
తెలంగాణ రాజకీయాలలో అనూహ్య సంఘటన జరిగింది. ఉప్పూ నిప్పులా ఉండే రేవంత్ రెడ్డి, హరీష్ రావులు శుక్రవారం భేటీ అయ్యారు. మాజీ మంత్రి పద్మారావుగౌడ్ తో కలిసి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ కు వెళ్లిన హరీష్ రావు ఆయనతో దాదాపు పావుగంట సేపు చర్చలు జరిపారు.
తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని ఆయన టీటీడీ అధికారులను ఆదేశించారు.
నటుడు,  వైకాపా నేత పోసాని కృష్ణమురళికి తాత్కాలికంగా రిలీఫ్ లభించినప్పటికీ విడుదలపై ఉత్కంఠత నెలకొంది. కూటమి నేతలపై  పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసిన  నేపథ్యంలో ఎపిలో 17 పోలీస్ స్టేషన్లలో  కేసులు నమోదయ్యాయి. మొత్తం ఐదు కేసులో బెయిల్ లభించినప్పటికీ పోసాని విడుదల కాలేదు.
నాగపూర్ లొ మూడు రోజుల అనంతరం కర్ఫ్యూ ఎత్తివేశారు. నాగపూర్ లో ఇటీవల హింసాకాండకు చెలరేగడానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
వెండి తెర పైనో, బుల్లి తెర పైనో, కనిపించిన ప్రతి ఒక్కరూ సెలబ్రిటీనేనా? ఇంకేమైనా అర్హతలు, యోగ్యతలు అవసరం అవుతాయా? అంటే సమాధానం చెప్పడం కష్టం కాదు గానీ, ఇబ్బందికరంగా ఉంటుంది.
డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు ఇండియన్స్ కు మరణ శిక్ష విధించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. నిరుడు జులైలో సింగపూర్ ప్లాగ్ ఉన్న ఓడలో నిషేధిత డ్రగ్ అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు భారతీయుల సమాచారం ఇండో నేషియా పోలీసులకు అందింది. వెంటనే రైడ్స్ చేయడంతో 106 కిలోల గంజాయి మాదక ద్రవ్యాలను స్వాధీనం
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో నోట్ల కట్టలు కలకలం సృష్టించాయి. లెక్కల్లో చూపని సొమ్ము కట్టలు కట్టలుగా ఆయన నివాసంలో బయటపడింది. వివరాల్లోకి వెడితే.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.