ధనవంతులైనా సరే.. ఈ అలవాట్లు మానకపోతే కటిక  పేదవాడిగా మారిపోతాడట.!

Publish Date:Dec 18, 2023

Advertisement

ధనవంతులు, పేదవారు అనే వర్గాలు  ఎప్పుడూ తారుమారవుతూ ఉంటాయి. ఈ రోజు పేదవాడిగా ఉన్నవాడు రేపు ధనవంతుడు కావచ్చు. అలాగే ఈ రోజు ధనవంతుడిగా ఉన్నవాడు రేపు పేదవాడిగా కూడా మారవచ్చు. చిన్న ఉద్యోగాలలో చేరి, వ్యాపారాలు మొదలు పెట్టి ఈ రోజు అపర కుభేరులుగా మారినవారున్నారు. అలాగే ఒకప్పుడు భవంతులలో నివసించి అన్నీ పోగొట్టుకుని పేదలుగా నివసిస్తున్నవారు కూడా ఉన్నారు. అయితే మనిషి తన దగ్గరున్న డబ్బును నిలుపుకోవడం అనేది అతని వ్యక్తిత్వం, అతని అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం కింది అలవాట్లున్నవారు ఎంత ధనవంతులైనా సరే పేదవాడిగా మారడం ఖాయమంటున్నారు.

 అపరిశుభ్రంగా ఉండేవారు..

అపరిశుభ్రంగా మురికి బట్టలతోనూ, ఇల్లంచా అస్తవ్యస్తంగానూ ఉండే వారు ఎప్పటికీ పేదరికంతోనే జీవిస్తారట. దీనికి కారణం డబ్బున్నా బయటకు తీయకపోవడం, దాన్ని అలాగే దాచడం, తనూ సుఖపడక, డబ్బును సరైన అవసరాలకు వినియోగించక పేదవాడిగానే ఉండిపోవడం.

చెడుగా మాట్లాడేవారు

మాటతీరు మంచిగా లేని వ్యక్తులు ఎప్పటికీ డబ్బును  నిలుపుకోలేరు. అబద్దాలు చెప్పడం, చెడుగా మాట్లాడటం చేస్తుంటే ఆ వ్యక్తి ఆర్థిక స్థోమత ఎప్పటికి మెరుగుపడదు. లక్ష్మీదేవి కూడా ఇలాంటి వ్యక్తుల వద్ద ఉండటానికి ఇష్టపడదట.

సూర్యాస్తమయం తరువాత నిద్రపోవడం

చాలామంది సాయంత్రం సూర్యుడు అస్తమించగానే నిద్రపోతుంటారు. అయితే ఈ సమయాన్ని లక్ష్మీదేవికి పవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటి సమయంలో నిద్రపోవడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదని అంటారు.

సోమరితనం

సోమరితనం ఉన్నవారు ఏ పనులను సరిగా చేయరు. పనులను వాయిదా వేడయం, ఏవో ఒక సాకులు చెప్పడం,  తప్పించుకోవడం చేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో ఎదగలేరు. తమ దగ్గరున్న డబ్బును మెల్లిగా కరిగించి చివరికి పేదవాడిగా మారిపోతాడు. తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఉంది అని డాంబికాలు పలికేది ఇలాంటి వారే. ఇలాంటి వారు తమ ముందు తరాలను పేదరికంలోకి చాలా సులువుగా నెట్టేస్తారు.

ఖర్చుల విషయంలో జాగ్రత్త లేకుంటే..

డబ్బు సంపాదించడం  ఒక కళ. అయితే ఆ డబ్బును ఎలా ఖర్చుపెట్టాలనేది కూడా కళే. ఆదాయానికి అనుగుణంగా డబ్బు ఖర్చు పెట్టడం, పొదుపుకు కొంత కేటాయించడం, ఎమర్జెన్సీ ఫండ్స్ అరెంజ్ చేసుకోవడం వంటి మనీ మేనేజ్మెంట్ ప్లాన్స్ లేకుండా పేదవాడిగానే ఉండిపోతాడు.

                                       *నిశ్శబ్ద.
 

By
en-us Political News

  
జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు....
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు...
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.