వైయస్ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరకతను తమ వైపు మళ్లించుకోనేందుకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా జగన్ గెద్దె నెక్కిన వెంటనే ప్రజా వేదిక కూల్చివేయడం నాటి నుంచి.... నేటి వరకు ఈ ప్రభుత్వం చేపడుతోన్న ప్రజా వ్యతిరేకత విధానాలను ప్రజల్లోకి చాలా బలంగా తీసుకు వెళ్లాలని... అలా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర చేపట్టే విధంగా చంద్రబాబు రంగం సిద్దం చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పాదయాత్ర 2023 జనవరి 26వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు స్వంత నియోజకవర్గమైన కుప్పంలో ప్రారంభమై.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకూ సాగేలా ప్రణాళిక రూపొందించినట్లు చెబుతున్నారు. దాదాపు 450 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ముందుగా అనుకున్న మేరకు లోకేష్ పాదయాత్ర ఇప్పటికే ప్రారంభించాలని చంద్రబాబు భావించారని.. కానీ ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర సమయం ఉండడంతో, పాదయాత్ర ప్రారంభ తేదీని జనవరి 26 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారని చెబుతున్నారు. లోకేష్ పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలా కలిసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ పాదయాత్ర వల్ల తెలుగుదేశం పార్టీ పటిష్టం కావడమే కాకుండా.. నారా లోకేశ్పై అధికార పార్టీకి చెందిన నేతలు చేసిన వ్యతిరేక ప్రచారాన్ని సైతం తిప్పికొట్టాలని, అలాగే నారా లోకేశ్ సామర్థ్యం ప్రజలందరికీ తెలిసేలా ఉండాలన్న లక్ష్యంతో చంద్రబాబు లోకేష్ పాదయాత్ర విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే లోకేశ్ పాదయాత్ర.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల మీదగా సాగేలా.. ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
పాదయాత్ర రూట్ మ్యాప్, సాగాల్సిన తీరు, ఆయా నియోజకవర్గాలలో పాదయాత్రను సక్సెస్ చేసే బాధ్యతలు ఎవరికి అప్పగించాలి అన్నవి ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే రూట్ మ్యాప్ ఖరారుకు ముందు చంద్రబాబు పార్టీలోని కీలక నేతలతో సమావేశమై, పాదయాత్రపై కూలంకషంగా చర్చించనున్నారు. ఆ క్రమంలో ఒక్కో నియోజకవర్గం నుంచి దాదాపు వెయ్యి మంది తక్కువ కాకుండా ఈ భేటీకి హాజరుకాబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు.. ఎన్నికల్లో గెలుపు కోసం పలు పార్టీలు వ్యూహాకర్తలను ఆశ్రయిస్తుంటే... చంద్రబాబు మాత్రం తన వ్యూహాలనే నమ్ముకుని పక్కాగా ముందుకు సాగుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/babu-very-keen-on-lokesh-padayatra-39-145017.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.