ఇటు నుంచి బాబు.. అటు నుంచి పవన్.. జగన్ ఉక్కిరి బిక్కిరి

Publish Date:Jun 20, 2022

Advertisement

ఓ వంక రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించిన జిల్లాల పర్యటనలు సక్సెస్ఫుల్’గా సాగుతున్నాయి. జననీరాజనాలు అందుకుంటూ, చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. స్వచ్చందంగా తరలి వస్తున్న జనం వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ‘ఒక్క ఛాన్స్’ ఇచ్చి తప్పు చేశామని, మళ్ళీ ఆ తప్పు చేయబోమని అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఈసారి ‘మా ఓటు, సైకిల్ గుర్తుకే’ అని ఓపెన్’గా చెపుతున్నారు. చంద్రబాబు  పర్యటనకు ప్రజల నుంచి వస్తున్న అద్భుత స్పందన సహజంగానే  తెలుగు దేశం కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపుతోందని, గెలుపు మీద విశ్వాసం పెచుతోంది

అందుకే ఇంతకాలం కొంత స్తబ్దుగా ఉన్న కార్యకర్తఃలు, నాయకులు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో జనంలోకి వెళుతున్నారు. రైతులు, యువత, ఉద్యోగులు, మహిళలు ఒకరని కాదు, జగన్ రెడ్డి బాదుడుతో విసిగిపోయిన అందరూ,  అన్నివర్గాల ప్రజలు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు,అవుతారన్న విశ్వాసం వ్యక్త  పరుస్తున్నారు.ఆదలా ఉంటే, ఇటు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర వైసీపీ నేతలలో వణుకు పుట్టిస్తోంది. పవన్ కళ్యాణ్, కౌలు రైతుల భరోసా’ యాత్రాలో  కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటుగా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని పొట్టుపొట్టుగా తూర్పార పడుతున్నారు.

కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేయడం రాజకీయ జిమ్మిక్’గా చులకన చేసి చూపే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నేతలకు సినిమాటిక్’గా చురకలు అంటిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, వైసీపీ నేతలకు ఎక్కడ తగలాలో అక్కడతగిలేలా పదునైన వ్యంగ్య విమర్శనాస్త్రాలు  సంధిస్తున్నారు. సర్కార్’ ను, అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రాబు దత్తపుత్రుదంటూ, వైసీపీ నేతల చేస్తున్న  విమర్శలను తిప్పుకోడుతూ, ‘నేను ప్రజల దత్తపుత్రుడినే కానీ, ఇంకెవరి దత్తపుత్రుడినో కాదు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా సీబీఐ దత్తపుత్రుడే” అంటూ ఘాటుగా చురకలు అంటించారు. 

 అలాగే జగన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాలను ఎరగా వేసి, ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటోందని తీవ్ర పదజాలంతో విమర్శించడమే కాకుండా, జనసేన అధికాంలోకి వస్తే, సర్కార్ దోపిడి ఉండదని, భరోసా ఇస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లాలో 80 మంది కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించైనా సందర్భంగా పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్వకాలను, ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా దోచుకుంటోంది వివరించారు. జనసేన అధికారంలోకి వస్తే దోపిడిని అరికట్టి  యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.వైకాపా నాయకులకు లక్ష కోట్లు దోపిడీ చేసే సత్తా ఉంటే,  జనసేనకు 2.5లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా  ఉందని అన్నారు.  

జగన్ రెడ్డి పై ఉన్న అవినీతి, అక్రమాస్తుల కేసులను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఆయనకు అధికారంలో కొనసాగే అధికారమే లేదని అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ యువకులకు ఏదైనా ఉద్యోగం రావాలంటే ఎలాంటి క్రిమినల్‌ కేసులు ఉండకూడదు.కానీ,  క్రిమినల్‌ కేసులు ఉన్న వారు ఎమ్మెల్యేలు ఎలా అవుతున్నారు? ప్రజా ప్రతినిధులకు ఒక రూల్‌.. సామాన్యులకు మరొక రూలా? అంటూ అర్హత లేని వారు రాష్ట్రాన్ని పలిస్తున్నారని ఎద్దేవాచేశారు. 

అదే విధంగా ముఖ్యమంత్రి పదవి తనకు ముఖ్యం కాదని, ముఖ్యమంత్రి కాకపోతే  రాజకీయాల్లోంచి వెనక్కి వెళ్లి పోయేందుకు పార్టీ పెట్టలేదన్నారు. పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు. పొత్తు ప్రజలతోనే, 2009లో ఏం చెప్పానో అదే చేస్తా. ప్రజల కోసం, ప్రత్యేక హోదాకోసం ప్రధానమంత్రితో విభేదించా. వ్యక్తిగతంగా నష్టపోయా. రాజకీయాల్లో ప్రజలు ముందుకెళ్లేలా చేయడమే నా తపన. నాకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదు. దసరా తర్వాత వైకాపా నాయకుల సంగతి చూస్తాం. అప్పటి వరకు మీరేం మాట్లాడినా భరిస్తాం’ అని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. 

ఇలా ఇటు నుంచి చంద్రబాబు, అటు నుంచి పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై సాగిస్తున్న దండయాత్ర ముఖ్యమంత్రికి మింగుడు పడడం లేదు.దీంతో ప్రభుత్వం అడకత్తెరలో పోక చెక్కాలా నలిగిపోతోంది.మరో వంక గడపగడపన ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన, ప్రశ్నల వర్షానికి సమాదానం చెప్పలేక ఎమ్మెల్యేలు, మంత్రులు బిక్క ముఖం వేస్తునారు.

అలాగని,వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసినా ముఖ్యమంత్రి వినేందుకు సిద్దంగా లేరు. ఆయన అంతా బాగుంది అనే భ్రమల్లో ఉన్నారు. అదొకటి అలా ఉంటే... చంద్రబాబు, పవన్ కళ్యణ్ కలిసి పోవడం ఖాయమని తేలిపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా వైసీపీ నేతలు దారులు వెతుక్కుంటున్నారని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు   ‘అధికారాంతమునందు చూడవలె నయ్యంగారి సౌభాగ్యముల్’ పద్యాన్ని గుర్హ్తు చేసుకుంతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పరిస్థితి అక్షరాలా అలాగే ఉందని  అంటున్నారు.

సొంత  పార్టీలోనే పరిస్థితి అలా ఉంటే, ఇక సామాన్య ప్రజల్లో, జగన్ రెడ్డి పలుకుబడి ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? ఎప్పుడు, ‘ఒక్కచాన్సు’ భారాన్ని దించుకుందామా .. అని జనం ఎదురు చూస్తున్నారు. ఇది జనవాక్యం.

By
en-us Political News

  
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.