Publish Date:May 25, 2023
ఏదీ ఏమైనా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి అదృష్టవంతుడే అంటూ సామాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో ట్రోల్ అవుతోంది. అవినాష్ రెడ్డి జైల్లో ఉంటే తన తండ్రి భాస్కరరెడ్డితో ఉంటాడని... అదే జైలు బయట ఉంటే తన తల్లి శ్రీలక్ష్మీతో ఉంటాడని.. అయినా ఎక్కడ ఉన్నామా? అన్నది ముఖ్యం కాదని.. తల్లిదండ్రులతో ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యమంటూ నెటిజన్లు.. పోకిరి సినిమాలో బాగా బాపులర్ అయిన డైలాగ్.. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా? లేదా? తరహాలో కామెంట్ చేస్తున్నారు.
అవినాష్ అరెస్ట్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కర్నూలులోని విశ్వభారతీ ఆసుపత్రి చుట్టూ కాలు కాలిన పిల్లిలా చక్కర్లు కొడుతూ, కర్నూలు జిల్లా ఎస్పీతో భేటీ అయి.. అవినాష్ రెడ్డి లొంగిపోవాలని చెప్పాలంటూ ఆ దర్యాప్తు సంస్థ అధికారులు బాబ్బాబు అంటూ బతిమాలడం చూస్తుంటే.. అవినాష్ రెడ్డి అదృష్టవంతుడు అని పక్కాగా కన్ఫర్మ్ అవుతోందని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు సీబీఐ దూకుడుకు కళ్లెం వెయ్యగల మోనగాళ్లు ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారంటే.. అది కేవలం ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ శ్రేణులే అన్నది సుస్పష్టమని తాజా పరిణామాల నేపథ్యంలో అర్థమవుతోందని వారు అంటున్నారు.
ఇక జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తి దాడి జరిగితే.. తనకు ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదంటూ... పక్క రాష్ట్రం తెలంగాణలోని హైదరాబాద్కు ఆగమేఘాల మీద వచ్చేశారని.. అలాంటి వ్యక్తి నేడు అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా.. సదరు పోలీసులు ఆయన నమ్మకం కోసం శాయ శక్తులా శక్తివంచన లేకుండా కష్టపడి పని చేసుకొంటూ.. ఫ్యాన్ పార్టీ రెక్కలే కాదు.. వైసీపీకి కళ్లు, చెవులు అన్నీ అయిన.. జగన్ పార్టీ శ్రేణులపై ఈగ కూడా వాలనివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అలాంటిది ఆంధ్రుల తొలి రాజధాని.. నేడో రేపో న్యాయ రాజధానిగా రూపుదిద్దుకొనున్న కర్నూలు నగరంలో.. అదీ విశ్వ భారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తల్లిని జాగ్రత్తగా కాపాడుతోన్న అవినాష్ రెడ్డిపై సీబీఐ నీడ కాదు కదా.. ఈగ సైతం వాలకుండా పార్టీ కేడర్ కంటికి రెప్పలా కాపాడుకుంటుంటే.. ఆ క్యాడర్ కు పోలీసులు రక్షణ కవచంగా నిలిచారని సెటైర్లు వేస్తున్నారు.
మరోవైపు వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డిని సీబీఐ గతంలో అరెస్ట్ చేసి.. చంచల్గూడ జైలుకు తరలించిందని.. ఇదే కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నా.. అవినాష్ రెడ్డి మాత్రం.. ముందస్తు ప్రణాళికలతో సీబీఐకి చిక్కకుండా తిరుగుతున్నారని అంటున్నారు.
అయినా ప్రజల పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును జీతాలుగా తీసుకునే ఈ పోలీసులు.. ఇలా విశ్వభారతీ ఆసుపత్రికీ, అందులో ఉన్న అధికార పార్టీ ఎంపీ ప్లస్ ముఖ్యమంత్రి కజిన్ అవినాష్ రెడ్డికి, ఆయన తల్లితోపాటు ఆసుపత్రి వద్ద ఉన్న పార్టీ కేడర్కు రక్షణగా ఇలా చెమటోడ్చి.. కష్ట పడడం చూస్తుంటే.. అనినాష్ రెడ్డి నిజంగా అదృష్టవంతుడేనని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/avinash-reddy-lucky-fellow-25-155852.html
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.