ఈ ఏడు చిట్కాలు పాటిస్తే... నూరేళ్లు బతికేయచ్చు!

Publish Date:Sep 13, 2017

Advertisement

 

నిండు నూరేళ్లు బతకాలని ఎవరికి మాత్రం ఉండదు. కానీ అలా బతికితే సరిపోదు! వృద్ధాప్యంలో కూడా మెదడు చక్కగా పనిచేయాలి. ఎంతటి కష్టాన్నయినా తట్టుకునేంత గుండెబలం ఉండాలి. చాలామందికి వయసు గడిచేకొద్దీ ఈ రెండు అవయవాలే బలహీనపడిపోతుంటాయి. ఎన్నాళ్లు బతికి ఏం లాభం అన్నట్లుగా కాలాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. మరి ఇందుకు ఉపాయం లేదా అంటే లేకేం!

 

అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌కు చెందిన పరిశోధకులు బలమైన గుండె, మెదడు ఉండటానికి ఎలాంటి జీవనశైలి ఉండాలో తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఇప్పటివరకూ ఈ దిశగా వచ్చిన 182 పరిశోధనల ఫలితాలను క్రోడీకరించి చూశారు. వాటిని గమనించిన తర్వాత అసలు గుండె, మెదడు ఎందుకు దెబ్బతింటాయో ఒక అవగాహన ఏర్పడింది. దాన్ని అధిగమించే చిట్కాలూ కనిపించాయి.

 

మన రక్తనాళాలు నిదానంగా కుంచించుకుపోవడమే గుండె, మదడులు దెబ్బతినేందుకు ప్రధాన కారణం అని తేలింది. ఇలా రక్తనాళాలు కుదించుకుపోవడం వల్ల రక్తసరఫరా తగ్గిపోవడమే కాకుండా, కొవ్వులాంటి పదార్థాలు కూడా అక్కడ పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇది క్రమేపీ పక్షవాతం, గుండెపోటు వంటి సమస్యలకి దారితీస్తూ ఉంటుంది. వైద్యపరిభాషలో ఈ పరిస్థితిని atherosclerosis అంటారు.

 

Atherosclerosis ఒక వ్యాధి కావచ్చు. కానీ చాలా సందర్భాలలో మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కూడా ఈ పరిస్థితికి కారణం అవుతాయి. సరైన శారీరిక వ్యాయామం లేకపోవడం, మంచి ఆహారాన్ని తీసుకోకపోవడం, పొగాకు వంటి వ్యసనాలు... అన్నీ కూడా రక్తనాళాలలు కుదించుకుపోయేలా చేస్తాయి. అల్జీమర్స్, డిమెన్షియా వంటి రోగాలకు కూడా కారణం అవుతాయి.

 

ఇంతకీ ఈ పరిస్థితిని దాటేందుకు పరిశోధకులు చెబుతున్న ఏడు చిట్కాలు ఇవే.......

- రక్తపోటుని అదుపులో ఉంచుకోవడం.

- ఒంట్లో కొలెస్ట్రాల్ మోతాదు మించకుండా చూసుకోవడం.

- షుగర్‌ని నియంత్రించుకోవడం.

- శారీరక శ్రమ చేయడం.

- పౌష్టికాహారాన్ని తీసుకోవడం.

- బరువుని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం.

- పొగాకు జోలికి పోకుండా ఉండటం.

వినేందుకు ఈ పద్ధతులన్నీ కాస్త కఠినంగానే ఉండవచ్చు. కానీ అనారోగ్యంతో ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకునేకంటే ఇది చాలా సులభం అంటున్నారు. లేకపోతే మున్ముందు కోట్లమంది డిమెన్షియాలాంటి సమస్యలని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

- నిర్జర.

 

By
en-us Political News

  
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.