Publish Date:Mar 22, 2026
ఏ రాజకీయపార్టీ నుంచైనా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలంటే ఆ పార్టీ టికెట్ ఇవ్వాలి. అలా టికెట్ దక్కించుకోవాలంటే ఆ పార్టీలో పై స్థాయి నాయకుల ఆశీస్సులు, అలాగే సమాజిక సమీకరణాలూ కీలకం. అయితే తమిళనాడులో మాత్రం అధికార పార్టీ అందుకు భిన్నంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో వినూత్న పంధా అనుసరిస్తోంది. త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి అధికార డీఎంకే పార్టీ టికెట్ దక్కాలంటే వారు నేరుగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఎదుట ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందే. ఇందు కోసం సదరు ఆశావహ అభ్యర్థులు నిర్ణీత రుసుము చెల్లించి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లికేషన్ పెట్టుకోవడానికి విభాగాల వారీగా రెండు రకాల ఫీజులను డీఎంకే నిర్ణయించింది. అదెలా అంటే రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్.
ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూకు అభ్యర్థులు తమ సొంత ఖర్చుతో రావాలి. ఇంతకీ ఈ ఇంటర్వ్యూ ఎందుకంటే.. సీఎం స్టాలిన్ స్వయంగా చేసే ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థుల సమార్థ్యాన్ని, అతడికి రాజకీయాల పట్ల ఉన్న అవగాహనను, ప్రజాసేవ పట్ల ఉన్న తపనను పరిశీలిస్తారు. అలాగే సదరు క్యాండిడేట్ ఆర్థిక నేపథ్యం తదితర విషయాలను కూడా పరిశీలిస్తారు. ఈ ఇంటర్వ్యూ ఐదారు నిముషాల పాటు ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువత, విద్యావంతులు కూడా ఈ ఇంటర్వ్యూల కోసం బారులు తీరుతున్నారు.
గతంలో దివంగత నేత కరుణానిధి కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇదే పంథా అవలంబించేవారు. ఇప్పుడు సీఎం స్టాలిన్ కూడా తండ్రి బాటనే అనుసరిస్తున్నారు. ఇదే తరహాలో అభ్యర్థులను వడపోసేవారు. ఇప్పుడు స్టాలిన్ అదే సంప్రదాయాన్ని మరింత పక్కాగా అమలు చేస్తున్నారు. అర్హులైన, సమర్థులైన నాయకులను గుర్తించడమే కాకుండా ఇంటర్వ్యూల కోసం వసూలు చేసే ఫీజు ద్వారా పార్టీకి నిధులు సమకూర్చుకోవడం కూడా జరుగుతుందని స్టాలిన్ ఈ పద్ధతిని ఎంచుకున్నారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.
కాగా పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం డీఎంకే అనుసరిస్తున్న ఈ అభ్యర్థుల ఎంపికపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అభ్యర్థులను సీఎం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అన్న పద్ధతి పారదర్శకతకు నిదర్శనంగా కొందరు, ఫీజుల వసూలు అంటూ సొమ్ములు దండుకునే వ్యూహంగా మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం స్వయంగా ముఖ్యమంత్రి స్టాలినే ఇంటర్వ్యూ చేయడం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/assembly-ticket-only-upon-selection-in-interview-39-215930.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.