ఆసియా క‌ప్‌..   భార‌త్  హ్యాట్రిక్ సాధిస్తుందా?

Publish Date:Aug 25, 2022

Advertisement

త్వ‌ర‌లో ఆసియాక‌ప్ టి-20 టోర్నీ ఆరంభానికి దుబాయ్ సిద్ధ‌మ‌యింది. ఐసిసి పురుషుల టి20 ప్ర‌పంచ క‌ప్ కూడా ఆట్టే దూరంలో లేదు గ‌నుక ఈ టోర్నీకి ప్రాధాన్య‌త ఉంది. ఈ టోర్నీలో భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య‌నే ఎక్కువ పోటీ క‌న‌ప‌డుతుంది. ఆసి యా అన‌గానే ఈ రెండు దిగ్గ‌జాల‌కే క్రికెట్ వీరాభిమానులు అమితంగా ఇష్ట‌పడ‌తారు. గ‌తేడాది ఐసిసి ప్ర‌పంచ‌క‌ప్ పురుషుల టి 20 క‌ప్‌తో ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త్ 19 ప‌ర్యాయాలు గెలిచింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోచ్ రాహుల్ ద్రావిడ్‌ల సార‌ధ్యం మ‌ద్ద‌తు అమితంగా ప‌నిచేశాయ‌ని క్రికెట్ పండితులు, విమ‌ర్శ‌కుల మాట‌. అయితే ఈసారి ఆసియాక‌ప్‌కు ద్రావిడ్ స్థానంలో వి.వి. ఎస్‌.లక్ష్మ‌ణ్‌ను కోచ్‌గా నియ‌మించారు.  భార‌త్ హ్యాట్రిక్ సాధిస్తుంద‌న్న ఆశ‌లు యావ‌త్ ప్ర‌పంచ క్రికెట్ అభిమానులూ వ్య‌క్తం చేస్తున్నారు. 

ఈ ప‌ర్యాయం కూడా భార‌త్‌కే ఎక్కువ అవ‌కాశాలున్నాయ‌ని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీపాటింగ్‌తో పాటు వాట్స‌న్ కూడా అభిప్రాయ ప‌డ‌టం గ‌మ‌నార్హం. ఆగ‌ష్టు 28న భార‌త్‌, పాక్ త‌ల‌ప‌డ‌నున్నాయి. పాకిస్తాన్ కంటే భార‌త్ బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ గ‌ట్టి స‌త్తా ప్ర‌ద ర్శించ‌డానికే అవ‌కాశాలున్నాయంటున్నారు. ముఖ్యంగా భార‌త్ రెట్టింపు ఉత్సాహంతో, గెలుస్తామ‌న్న గొప్ప కాన్ఫిడెన్స్ ప్ర‌ద‌ర్శి స్తూ, ప‌ట్టుద‌ల‌తో ఆడ‌టం గ‌మ‌నిస్తాం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్ వంటివారు ఎంతో ధాటిగా ఆడి జ‌ట్టు శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను రెండింత‌లు పెంచే తీరు చూడ‌చ‌క్క‌నిది. అయితే ఇటీవ‌ల అంత‌గా ఫామ్‌లో లేని కోహ్లీ ఈ టోర్నీలో త‌ప్ప‌కుండా పాత విరాట్ విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించ‌గ‌ల‌డ‌ని వీరాభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది అత‌ను భార‌త్‌కి కేవ‌లం 16 మ్యాచ్‌లే అడాడు. వాటిలో ఒక్క‌టే టీ 20 కావ‌డం గ‌మ‌నార్హం. అదీ జూలై లో ఇంగ్లాండ్ మీద ఆడింది.  ఈ మ‌ధ్య సిరీస్‌ల‌కు విశ్రాంతి తీసుకోవ‌డం కోహ్లీకి ఒక‌విధంగా మంచిదేన‌ని, ఇపుడు ఫ్రెష్‌గా బ‌రిలోకి దిగి ఎంతో కాన్ఫిడెన్స్‌గా ఆడ‌టానికి అవ‌కాశం ఉంద‌ని ప్ర‌పంచ క్రికెట్ సీనియ‌ర్లు న‌మ్ముతున్నారు. 

జట్టు విష‌యానికి వ‌స్తే.. రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో రాహుల్,విరాట్‌,సూర్య‌కుమార్ యాద‌వ్‌, రిష‌బ్‌,దీప‌క్ హుడా,దినేష్ కార్తి క్‌, హార్దిక్ పాండ్యా,ర‌వీంద్ర‌జ‌డేజా, ఆర్‌.అశ్విన్‌, య‌జువేంద్ర‌ఛాహ‌ల్‌, ర‌వి విష్ణోయ్‌, భువ‌నేశ్వ‌ర్‌,అర్ష‌దీప్‌సింగ్, ఆవేశ్‌ఖాన్ ఆడ‌ను న్నారు. స్టాండ్‌బైలుగా శ్రేయాష్ అయ్య‌ర్‌, ఆక్ష‌ర్‌ప‌టేట్‌, దీప‌క్ చాహ‌ర్ ఉన్నారు. కాగా వీరిలో ర‌న్‌మిష‌న్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉండటం జ‌ట్టుకు కొండంత అండ‌గా చెప్పాలి. చిత్రమేమంటే ఎప్పుడూ అంత‌గా క‌నిపించ‌ని దూకుడు త‌త్వం ప్ర‌ద‌ర్శిం చ‌డం గ‌మనార్హం. ఇది ప్ర‌స్తుత టోర్నీకి ఎంతో అవ‌స‌ర‌మ‌న్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ స్ట్ర‌యిక్ రేట్ కూడా 142 ఉండ‌టం ఈ టోర్నీకి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. కెప్టెన్‌ శ‌ర్మ‌తో పాటు ఓప‌నింగ్ కి దిగితే ప‌వ‌ర్‌ప్లే అత్యంత ఆస‌క్తిక‌ రంగా సాగు తుంద‌నే అనాలి. ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కండా వీరిద్ద‌రూ దీపావ‌లి ఆనందాన్నిస్తారు. విశ్రాంతి త‌ర్వాత తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చిన కోహ్లీ, ఇప్ప‌టికే ఉత్త‌మ ఫామ్‌లో ఉన్న సూర్య‌కుమార్‌లు మిడిల్ ఆర్డ‌ర్‌ను మ‌రింత దూకుడుగా ముందుకు తీసికెళ్లి మంచి స్కోర్ ఖాయిలా చేయ‌వ‌చ్చు. చివ‌ర‌లో దినేష్ కార్తిక్ బ్యాటింగ్ విధానం ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఐపిఎల్‌లో అత‌ను ఆ స‌త్తాను ఇప్ప‌టికే ప్ర‌ద‌ర్శించాడు. అందువ‌ల్ల దినేష్‌, రిష‌బ్‌ల మ‌ధ్య మంచి పోటీనే చూడ‌గ‌ల‌మ‌ని అనాలి. వారిద్ద‌రూ ఐపిఎల్‌లో ధాటిగా ఆడ‌టం, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న‌వారే. వారిద్ద‌రికి ప్ర‌త్య‌ర్ధుల బౌలింగ్‌ను నీరుగార్చ‌డంలో ఎంతో పేరుంది. ఇక బౌలింగ్ విభాగానికి వ‌స్తే, చాహ‌ల్ త‌ప్ప‌కుండా లీడ్ బౌల‌ర్‌గా క‌న‌ప‌డ‌తాడు. అత‌ను కేవ‌లం 7.06 ఎకాన‌మీతో 13 మ్యాచ్‌లో ఏకంగా 16 వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్ తో త‌ల‌ప‌డిన సిరీస్‌లో త‌న స‌త్తాను చాట‌డంలో ఇంగ్లీష్ బ్యాట‌ర్ల‌ను వ‌ణికించాడు. అయితే, పేస్ అటాక్‌లో బుమ్రా, పాండ్యాలు మ‌రిం విజృంభించాల్సి ఉంది. అలాగే పేసర్ల‌లో లీడ్‌గా ఉన్న భువ‌నేశ్వ‌ర్‌పైనా ఎన్నో ఆశ‌లు ఉన్నాయి. ఈ ఏడాది ఎలాంటి గాయాల‌కు గురికాలేదు గ‌నుక అత‌ను ఐపీఎల్‌లోనూ ఎంతో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు గ‌నుక అత‌ని మీదా ఆశ‌లు ఉన్నాయి.

ఈసారి బాబ‌ర్ అజామ్‌, మొహ‌మ్మ‌ద్ రిజ్వాన్‌లతో ప‌టిష్టంగా ఉన్న పాకిస్తాన్‌తో పాటు శ్రీ‌లంక జ‌ట్టు కూడా భార‌త్‌కు గ‌ట్టి పోటీ నిచ్చే అవ‌కాశాలున్నాయ‌ని క్రికెట్ మేధావులు అంటున్నారు. అలాగే అంత‌ర్జాతీయ కూన‌లుగా పేర్కొంటున్న ఆప్ఘ‌నిస్తాన్ జ‌ట్టు బౌలింగ్ లైన్ ఆప్ ఈసారి ఇబ్బందిపెట్టే అవ‌కాశాలున్నాయి. ఇటీవ‌ల ఇర్లాండ్ తో త‌ల‌ప‌డిన సిరీస్‌లో ఓట‌మి చ‌విచూసిన‌ప్ప‌టికీ ఆఫ్ఘ‌న్ ను త‌క్కువ అంచ‌నా వేయ‌న‌వ‌స‌రం లేదు. 

By
en-us Political News

  
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.