ఎట్టకేలకు సీబీఐకి ప్రీతి సుగాలి అత్యాచారం, హత్య కేసు.. ఏపీ సర్కార్ ఆదేశాలు

Publish Date:Feb 27, 2020

Advertisement

2017లో కర్నూలులో సంచలనం రేపిన సుగాలి ప్రీతీ బాయి అత్యాచారం, హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ కేసును విచారించిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇప్పటికీ దోషులను పట్టుకోకపోవడం వంటి కారణాలతో ప్రీతి కుటుంబ సభ్యులు సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే డిమాండ్ తో కర్నూలులో ర్యాలీ కూడా నిర్వహించారు. ఆ తర్వాత కర్నూలు పర్యటనలో ప్రీతి కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడిన సీఎం జగన్.. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

2017లో కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతీ బాయి స్కూలు హాస్టల్లోనే ఉరేసుకుంది. అప్పట్లో దీన్ని ఆత్మహత్య కేసుగా తేల్చిన పోలీసులు కేసును మూసేశారు. కానీ పోస్టు మార్టమ్ నివేదికలో ఆమె జననాంగాల్లో వీర్య కణాలు ఉన్నట్లు నిర్ధారించింది. అదే సమయంలో ఉరేసుకున్న వ్యక్తి కాళ్లు నేలకు తాకుతూ ఎలా ఉంటాయన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.  దీంతో అప్పటి అధికార టీడీపీ నేతల ఒత్తిడితోనే పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని తోసిపుచ్చిన ప్రీతి తల్లితండ్రులు ఆరోపించారు. స్ధానికుల నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో జిల్లా కలెక్టర్ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్డీవో, డీఈవో, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ తో కూడిన ఈ కమిటీ ఘటన జరిగిన పాఠశాలను సందర్శించి ఆధారాలు సేకరించింది. అయితే ఈ కమిటీ దర్యాప్తు కూడా నత్తనడకన సాగింది.  

ఆ తర్వాత ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు వైద్యారోగ్య శాఖ డిప్యూటీ కార్యదర్శి రాజు నిందితుల వద్ద 5 లక్షలు డిమాండ్ చేశారని మృతురాలి తల్లి ఆరోపించారు. మరోవైపు ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన కర్నూలు మెడికల్ కాలేజీ బృందం దీన్ని అత్యాచారం, హత్యగా నిర్ధారించింది. అయితే ఇదే బృందంలో సభ్యుడిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ పోస్టుమార్టం నివేదికను తారుమారు చేశారని ప్రీతి తల్లి ఆరోపించారు.

చివరికి 2017 ఆగస్టులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు పోస్కో చట్టం కింద ప్రీతి హత్యకు గురైన కట్టమంచి రామలింగారెడ్డి స్కూలు ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం ప్రీతి కేసుపై విచారణ జరిపిన ముగ్గురు సభ్యుల అధికారుల కమిటీ తన నివేదికను వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు సమర్పించారు. అయితే ఈ నివేదికలో ప్రీతిది ఆత్మహత్యేనని వారు తేల్చారు. ఆ తర్వాత ఈ కేసులో విచారణాధికారిగా ఉన్న డీసీపీ వినోద్ కుమార్... ఐపీసీ సెక్షన్లు 302, 201 తో పాటు పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేయలేదని గుర్తించారు. పోస్టుమార్టం నివేదికను మార్చిన ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతో డీసీపీ వినోద్ కుమ్మక్కాయని కూడా ప్రీతి తల్లి ఆరోపించారు. 

ఆ తర్వాత మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో ప్రీతి హత్యాచార కేసుపై అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్ మరోసారి విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి అమిత్ గార్గ్ .. పోస్టు మార్టం నివేదిక తారుమారైందని తేల్చారు. కానీ తాను నివేదికను తారుమారు చేయలేదని దాన్ని రూపొందించిన డాక్టర్ శంకర్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన్ను ఈ ఘటనకు బాధ్యడిగా గుర్తిస్తూ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత డాక్టర్ శంకర్.. తాను మూడు గంటల పాటు నిర్వహించిన పోస్టుమార్టంలో ప్రీతి అత్యాచారం, హత్యకు గురైందని మరో నివేదిక ఇచ్చారు.    

ఈ నివేదిక వెలువడ్డాక ప్రీతి తల్లితండ్రులు ఈ కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపిస్తే కానీ తమ కుమార్తెకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. తాజాగా కర్నూలులో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మృతురాలు ప్రీతికి న్యాయం జరగాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, ప్రీతికి న్యాయం చేయలేని వైసీపీ ప్రభుత్వం కర్నూల్లో హైకోర్టు పెట్టి ప్రజలకు ఏం న్యాయం చేస్తుందని కూడా ప్రశ్నించారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ సంచలన కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.