ఆంధ్ర-తెలంగాణా వివాదాలకు పరిష్కారాలే లేవా?

Publish Date:Jul 14, 2014

Advertisement

 

ఆంధ్ర-తెలంగాణా వివాదాలకు పరిష్కారాలే లేవా? ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య జల, విద్యుత్ వివాదాలు నిత్య ప్రహసనంగా మారాయి. అందువల్ల నిత్యం కేంద్రం జోక్యం కూడా అనివార్యమవుతోంది. కానీ ఒక సమస్యను పరిష్కరించగానే మరొకటి తయారవుతుండటంతో కేంద్రం కూడా తలపట్టుకోవలిసివస్తోంది.

 

రెండు ప్రభుత్వాలు తమ హక్కులను కాపాడుకోవాలని ప్రయత్నించడంలో తప్పు లేదు. కానీ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించే బదులు ఘర్షణ వైఖరి అవలంభిస్తుండటంతో కేంద్రం జోక్యం చేసుకోవలసివస్తోంది. ఈ గొడవలు ఇలా ఇంకా ఎంతకాలం కొనసాగుతాయి? వీటికి ఎప్పటికయినా శాశ్విత పరిష్కారం దొరుకుతుందా? అనే ప్రజల ప్రశ్నలకు జవాబు ఇచ్చేవారు లేరు. ఈ జల, విద్యుత్ సమస్యలకు ఒక శాశ్విత పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించనంత కాలం ఇవి పునరావృతం అవుతూనే ఉంటాయి. దానివలన రెండు రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడటమే కాకుండా ప్రజలు, ప్రభుత్వాల మధ్య మరింత ఘర్షణ వాతావరణం ఏర్పడి చివరికి అది శాశ్విత శత్రుత్వంగా మారే ప్రమాదం ఉంది.

 

వీటికి కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో పరిష్కారాలు చూపడం సాధ్యం కాదా? అని ఆలోచిస్తే సాధ్యమేనని చెప్పవచ్చును. అవేమిటంటే 1. రెండు రాష్ట్రాలు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసుకోవడం. 2. ప్రజాభిప్రాయాలను కోరి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవడం. 3. నదీ జలాల పంపకాలలో డ్యాముల నిర్మాణం, ఎత్తు పెంచడం వంటివాటితో సంబంధం లేకుండా దిగువ రాష్ట్రాలకు న్యాయబద్దంగా సకాలంలో నీళ్ళు విడుదలయ్యే విధంగా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించడం. 4. నీళ్ళు, విద్యుత్ మరియు ఇతర వనరుల పంపిణీ కోసం ప్రస్తుతం ఉన్న వ్యవస్థలకు సంపూర్ణ హక్కులు కల్పించి, దేశంలో అన్ని రాష్ట్రాలు వాటికి లోబడి ఉండేలా కటిన చట్టాలు ఏర్పాటు చేయడం.

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వన్నీ తెలియవని కాదు. కానీ, రాజకీయ ప్రభావంతో ఇటువంటి వాటిని అమలు చేయలేకపోతున్నాయి. రాష్ట్ర విభజనపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు నాన్చిన కారణంగా రాష్ట్రం అల్లకల్లోలం అయింది. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలలో శాంతి ఏర్పడకపోగా ఈ సమస్యల వలన క్రమంగా మళ్ళీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడు అధికారం చేప్పట్టిన ఎన్డీయే ప్రభుత్వం ఈ సమస్యలకు తాత్కాలిక ఉపాయాలు కాకుండా వీలయినంత త్వరగా శాశ్విత పరిష్కారాలు కనుగొనాలి. ఈ సమస్యలను ఇలాగే నానుస్తూపోతే ఏదో ఇది కూడా తీవ్ర సమస్యగా మారే ప్రమాదం ఉందనే సంగతి గ్రహించి అవసరమయితే ఆంధ్ర-తెలంగాణాల కోసం నిపుణులతో కూడిన ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయాలి.

By
en-us Political News

  
ఇప్పటికే గంటల తరబడి విజయ్ ను విచారించిన సీబీఐ మరో మారు ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు పంపింది. అయితే ఈ వేధింపుల వెనుక ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయేనని పరిశీలకులు అంటున్నారు.
తన కృషికి తగిన గుర్తింపు రాలేదన్న కినుకతో ఏబీవీ ఉన్నట్లు కనిపిస్తున్నారు.ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని చేపట్టలేదు. జగన్ హయాంలో జరిగిన అవకతవకలపై విమర్శలతో పాటుగా, ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలనూ ప్రశ్నించడం ఆరంభించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రానున్న మునిసిపోల్స్ లో జనసేనతో తమ పార్టీకి ఎటువంటి పొత్తూ లేదంటూ ప్రకటించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీ తెలంగాణ మునిసిపోల్స్ లో స్వతంత్రంగా పోటీ చేస్తుందని, జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవనీ కుండబద్దలు కొట్టేశారు.
రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి.
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు.
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.