Publish Date:Jan 21, 2025
మాజీ మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో వైఎస్ జగన్ పార్టీ విజయానికి ఈ హత్య ద్వారా వెల్లువెత్తిన సానుభూతి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆ ఎన్నికలకు ముందు వివేకా హత్య వెనుక ఉన్నది తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ అంటూ వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.
సొంత మీడియాలో నారాసుర రక్త చరిత్ర అంటూ కథనాలు వండి వార్చింది. సరే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి అంటే 2019 ఎన్నికల సమయానికి గతంలో వైసీపీ చేసిన ప్రచారం ఇప్పుడు బూమరాంగ్ అయ్యింది. దర్యాప్తులో ఈ హత్య వెనుక ఉన్నది వైసీపీయే అన్నది దాదాపుగా తేలిపోయింది. కోర్టులు నిర్ధారించి తీర్పు వెలువరించలేదు కానీ.. దర్యాప్తు సాగిన తీరు, దానిని అడ్డుకోవడానికి వైసీపీ ప్రయత్నించిన విధానాన్ని గమనించిన జనాలకు ఈ హత్య వేనుక ఉన్నది ఎవరు? వారిని కాపాడుతున్నది ఎవరు అన్న విషయంలో సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయి. సరే 2019 ఎన్నికలలో వైసీపీకి సానుభూతికి ప్రోది చేసిన వైఎస్ వివేకా హత్య.. 2024 ఎన్నికల సమయానికి వైసీపీకి, జగన్ కు పెద్ద ప్రతికూల అంశంగా మారిపోయింది.
ఈ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి జగన్ కొమ్ము కాయడం, వివేకా హత్య కేసు విషయంలో జగన్ కు వ్యతిరేకంగా డాక్టర్ సునీత నిలబడటం, ఆమెకు జగన్ స్వంత సోదరి షర్మిల మద్దతు ఇవ్వడంతో విషయాలన్నీ సందేహాలకు అతీతంగా జనానికి అర్ధమైపోయాయి.
ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలకు ముందు ‘వివేకం’ అనే పేరుతో వైఎస్ వివేకా హత్యపై ఓ సినిమా రూపొందింది. వివేకం సినిమా థియోటర్లలో విడుదల కాలేదు. కానీ యూట్యూబ్ ద్వారా లక్షల మంది ప్రజలకు చేరువైంది. అప్పట్లో ఈ సినిమాను షర్మిల కూడా మెచ్చుకున్నారు. వివేకం సినిమాలో వాస్తవాలే చూపారని ఆమె అప్పట్లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సరిగ్గా ఎన్నికలకు ముందు విడుదలైన ఈ సినిమా కూడా వైసీపీ ఘోర పరాజయంలో తన వంతు పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు.
ఇప్పుడు వివేక హత్య కేసుపై మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా పేరు ‘హత్య’ ఈ నెల 24న ఈ సినిమా థియోటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా సెన్సార్ బోర్డు, రివిజన్ కమిటీల మధ్య దాదాపు తొమ్మిదిన్నర నెలల పాటు ఇరుక్కుపోయింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 24న విడుదల అవుతున్నా.. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు దాదాపు వంద కట్స్ వేసిందని సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/another-moovie-on-viveka-murder-39-191634.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.