అన్నా లెజినోవా త‌ల నీలాల స‌మ‌ర్ప‌ణ‌

Publish Date:Apr 14, 2025

Advertisement

క్రిష్టియ‌న్ అయినా డిక్లరేషన్ తో పాటు తలనీలాల సమర్పణ

హిందువుల గుండెల్ని దొచుకున్న పవన్ సతీమణి

ఆంధ్రులు ఫిదా.. ఫిదా..

శ్రీవారి ల‌డ్డూను తిన్నా కూడా వారు ఆయ‌న భ‌క్తులు అయిపోతార‌న్న నానుడి ఉంది. అలాంటిది ఆయ‌న‌కు మొక్కు కోవ‌డం మాత్ర‌మే కాదు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించ‌డం అంటే వారు స్వామివారి ప‌ట్ల భ‌క్తి చూప‌డంలోనే అది ప‌రాకాష్ట. అలాంటి భ‌క్తి చూప‌డంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌తీమ‌ణి అన్నా లెజినోవా ప్ర‌స్తుతం వార్త‌ల‌కెక్కారు. అన్నాది ఈ మ‌తం కాదు, ఈ నేల కాదు. కానీ ఇక్క‌డి భ‌క్తి విశ్వాసాల ప‌ట్ల ఆమె అపార‌మైన న‌మ్మ‌కం పెంచుకున్న‌ట్టుగానే చెప్పాలి. 

లేకుంటే త‌న కొడుక్కి సింగ‌పూర్లో అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌ట‌మేంటి? ఆమె ఈ ప్ర‌మాదంలోంచి త‌న కుమారుడు మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ త్వ‌ర‌లోనే కోలుకోవాల‌ని.. భావించ‌డ‌మేంటి? ఇప్పుడా మొక్కు తాను క్రిష్టియ‌న్ అయి ఉండి  కూడా డిక్లెరేష్ ఇచ్చి మ‌రీ తీర్చుకోవ‌డ‌మేంటి? అన్న‌దిక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నిజానికి మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ కి అంత పెద్ద ప్ర‌మాదం ఏం జ‌ర‌గ‌లేదు కానీ, బాలుడితో పాటు ప్ర‌మాదంలో చిక్కిన ఒక బాలిక మాత్రం ప్రాణాలు కోల్పోయింది. దీంతో భ‌య‌ప‌డ్డ అన్నా  లెజినోవా త‌న బంగారు  కొండ‌కు ఏమీ కాకూడ‌దంటూ అచ్చం తెలుగువారిలా.. తెలుగువారి ఆధ్యాత్మిక అదృష్టం- వెంక‌టేశ్వ‌ర స్వామికి ముడుపు క‌ట్టి, స్వామీ నా కొడుకు ఈ ప్ర‌మాదం  నుంచి బ‌య‌ట ప‌డితే, నీకు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకుంటాన‌ని మొక్కుకోవ‌డం మాత్ర‌మే కాక‌.. డిక్ల‌రేష‌న్ సైతం ఇవ్వ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. నువ్వు నీ త‌ల‌నీలాల‌ను ఇవ్వ‌డం కాద‌మ్మా.. మా మ‌న‌సుల‌ను కూడా దోచుకున్నావంటూ ఆమెపై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపిస్తున్నారు.

ఆమె పుట్టుక‌తో క్రిష్టియ‌న్ అయినా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌తీమ‌ణిగా ఇక్క‌డి స‌నాత‌న ధ‌ర్మంపై విప‌రీత‌మైన ప్రేమాభిమానాలను పెంచుకున్నారు. ఇక్క‌డి భ‌క్తి విశ్వాసాల‌ను అవ‌గ‌తం చేసుకున్నారు. వాటిని అర్ధం చేసుకోవ‌డం మాత్ర‌మే కాకుండా.. ఇదిగో ఇలా ఫాలో అవుతున్నారు కూడా. దీంతో ఇటు అభిమానులే కాదు అటు సామాన్య భ‌క్త జ‌నులు సైతం.. అన్నా లెజినోవాను తెగ  మెచ్చుకుంటున్నారు.

కార‌ణం.. మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా జ‌న్మ‌తః క్రిష్టియ‌నే. కానీ, శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌పుడు కావాల‌నే డిక్ల‌రేస‌న్ పై సంత‌కం చేయ‌కుండా తెలుగువారిని తీవ్రంగా వేధిస్తుంటారు. పెద్ద పెద్ద ప్ర‌ముఖులే శ్రీవారి చెంత‌కు వ‌చ్చిన‌పుడు తాము హిందూయేత‌రులైన‌పుడు.. విధిగా డిక్ల‌రేష‌న్ ఇస్తారు. అలాంటిది ఒక ముఖ్య‌మంత్రి కొడుకుగా ఉండి, తాను కూడా ఒక ముఖ్య‌మంత్రిగా  ప‌ని చేసిన జ‌గ‌న్ మాత్రం .. అన్నా లెజినోవా అనే విదేశీయురాలికున్న క‌నీస  విచ‌క్ష‌ణా జ్ఞానం కూడా లేద‌న్న మాట వినిపిస్తోంది. 

ఇటీవ‌ల ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి  అన్న‌ట్టు ఇటు శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలపుడు కానీ, అటు ఒంటిమిట్ట కోదండ రామ స్వామి క‌ళ్యాణోత్స‌వం లో కానీ, దుర్గ‌మ్మ స‌న్నిధికి వ‌చ్చిన‌పుడు కానీ.. త‌న స‌తీమ‌ణితో స‌హా హాజ‌రు కాని జ‌గ‌న్ రెడ్డి,, చేసిన సంప్ర‌దాయ విరుద్ధ‌మైన చ‌ర్య‌లు లెక్క‌లేన‌న్ని. 

ఈ మాట వ‌చ్చింద‌ని చెప్పి.. 2024 ఎన్నిక‌ల‌కు ముందు సంక్రాంతి సంద‌ర్భంగా.. ఇంటి ముందు శ్రీవారి సెట్టు వేయించుకుని.. ఆయ‌న్ను అవ‌మానించ‌డం మాత్ర‌మే కాకుండా.. తాము త‌యారు చేయించిన ప్ర‌సాదాన్ని కూడా తీసుకోకుండా దాన్ని నాప్ కిన్ కి తుడిచేసుకుని  జగన్ చేసిన దైవాప‌రాధం అంద‌రికి తెలిసిందే.

అలాంటిది అన్నా లెజినోవా.. మ‌న సంస్కృతీ సంప్ర‌దాయాల‌ను ఇంత చ‌క్క‌గా పాటిస్తుంటే అంద‌రికీ ముచ్చటేస్తోంది. జ‌గ‌న్ లా ఆమె సైతం ఒక క్రిష్టియ‌నే అయినా.. భార‌తీయ‌త‌ను మ‌రీ ముఖ్యంగా మ‌న తెలుగు వారి సంప్ర‌దాయాల‌ను.. ప‌ద‌హారాణాల తెలుగింటి ఆడ‌ప‌డుచులాగా పాటించ‌డంతో.. ఆమెపై అంద‌రూ ప్ర‌శంస‌ల వ‌ర్షం  కురిపిస్తున్నారు.

అలాగ‌ని అన్నా లెజినోవా కేవ‌లం పైపై సంప్ర‌దాయాల పాటింపు మాత్ర‌మే కాదు.. జాత‌కాల‌ను చూపించుకోవ‌డం వంటి ఎన్నో సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన‌ ప‌నులు చేయిస్తార‌నీ అంటారు. మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ అంటూ త‌న కొడుక్కి హిందూ శ‌బ్ధంతో కూడిన‌ నామ‌క‌ర‌ణం చేయించ‌డం మాత్ర‌మే కాదు.. అత‌డు తండ్రికి మించిన త‌న‌యుడు అవుతాడ‌ని కూడా జాత‌కం కూడా చెప్పించుకున్న‌ట్టు చెబుతున్నారు. ఈ దిశ‌గా ప‌వ‌నోవిచ్ కి సంబంధించిన జాత‌క ఫ‌లితం ఒకటి  నెట్టింట‌ చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఏది ఏమైనా అన్నా లెజినోవా కొట్టించుకున్న ఈ గుండు ద్వారా ఇటు తెలుగు వారి గుండెల్ని దోచుకోవ‌డం మాత్ర‌మే కాకుండా.. అటు మాజీ సీఎం జ‌గ‌న్ కి చెంప‌పెట్టులా ఆమె డిక్లెరేష‌న్ మీద సంత‌కం పెట్టి మ‌రీ త‌ల‌నీనాలు స‌మ‌ర్పించుకోవ‌డంతో శ్రీవారి భ‌క్తులు త‌బ్బి ఉబ్బిబ్బి అయిపోతున్నారట‌.  ఎందుకంటే శ్రీవారికి త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ అంటే ఎంతో ఇష్టం. అలాంటి ఇష్టమైన కార్య‌క్ర‌మాన్ని తాను క్రిష్టియ‌న్ అయినా కూడా.. తెలుగు వారి న‌మ్మ‌కాల‌ను విశ్వాసాల‌ను పాటించ‌డంతో ఇక్క‌డి వారిని మ‌రింత‌గా ఆక‌ట్టుకున్నారామె.

By
en-us Political News

  
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ జిమ్ వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో ఆయన కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ఎక్స్ వేదికగా అభిమానులకు, బీఆర్‌ఎస్ శ్రేయోభిలాషులకు తెలియజేశారు. అంతేగాక త్వరలోనే తన పాదాలపై తాను నడుచుకుంటూ వస్తానని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ లో.. జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా వెన్నుపూసలో సమస్య తలెత్తిందని తెలిపారు
నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.‘‘గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న ప్రముఖ సినీనటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు నా అభినందనలు. కళా, సేవా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలయ్య మరిన్ని నూతన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారయ్యారు. భీమవరం బీజెపి క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ పాక వెంకట సత్యనారాయణ పేరును కమలం పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. పాక గతంలో భీమవరం కౌన్సిలర్ గా పని చేశారు. ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఉన్నారు. ఈ స్థానం నుంచి అన్నామలై, స్మృతి ఇరానీ, మందకృష్ణ మాదిగ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అనూహ్యంగా పాక పేరును ప్రకటించారు.
టాలీవుడ్ ప్రముఖ హీరో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ సంప్రదాయ తెలుగు వస్త్రధారణ అయిన పంచెకట్టులో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి బాలయ్య పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. భారతీయ సినిమా రంగానికి, సమాజానికి బాలకృష్ణ అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ పద్మ భూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.
ఏపీలోని 10 జిల్లాల సహకార బ్యాంకు సంఘాల చైర్మన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘాల (డీసీఎంఎస్‌) ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్‌గా శివ్వల సూర్యనారాయణ (టీడీపీ), విశాఖ డీసీసీబీ ఛైర్మన్‌గా కోన తాతారావు (జనసేన) నియమితులయ్యారు. విజయనగరం డీసీసీబీ చైర్మన్‌గా టీడీపీ నేత కమిడి నాగార్జునను నియమించారు. గుంటూరు డీసీసీబీ చైర్మన్‌గా మాకినేని మల్లికార్జునరావు(టీడీపీ), కృష్ణా డీసీసీబీ చైర్మన్‌గా టీడీపీ నేత నెట్టెం రఘురామ్, నెల్లూరు డీసీసీబీ చైర్మన్‌గా ధనుంజయరెడ్డి (టీడీపీ), చిత్తూరు డీసీసీబీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ నేత అమాస రాజశేఖర్ రెడ్డిని నియమించారు.
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూత‌ల‌ప‌ట్టు-నాయుడుపేట జాతీయ ర‌హ‌దారిపై పాకాల మండ‌లం తోట‌ప‌ల్లి వ‌ద్ద కంటైన‌ర్ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.
దేశంలో పేదరికం ఏ స్థాయిలో వుందో, ఆకలి స్థాయి ఏమిటో, కటిక దారిద్ర్యంలో మగ్గుతున్న పేదలకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. కానీ ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక మాత్రం భారత దేశంలో పేదరికం రోజురోజుకూ తగ్గిపోతోందని అంటోంది. ఆర్థిక పేదరికం మాత్రమే కాకుండా, విద్య, ఆరోగ్యం జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న వివిధ కోణాల పేదరికంలో కుడా కూడా భారత దేశం మంచి మెరుగుదల సాధించిందని నివేదిక పేర్కొంది.
తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై ఇటీవల హైకోర్టు సింగిల్ ఇచ్చిన మధ్యంతరం ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అప్పీల్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు సీజే ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది. గ్రూపు-1 పరీక్షలో అక్రమాలు జరిగాయని హైకోర్టుపలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. మెయిన్స్ ఎగ్జామ్ మూల్యాంకనం సరిగ్గా జరుగలేదని, పరీక్షల కేంద్రాల కేటాయింపుల్లోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, ఆమెకు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్‌ (డీజీ)గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది.
పహల్గాం ఉగ్ర దాడి నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి ఒక్కటయ్యాయి. ఐక్యతను ప్రదర్శించాయి. ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. మాలో మాకు సవాలక్ష విబేధాలు ఉండవచ్చును కానీ.. మా దేశం పై మరో దేశం ఏ రూపంలో దాడి చేసినా, రాజకీయాలను పక్కన పెట్టి ఒక్కటై నిలుస్తామని శతృ మూకకు స్పష్టమైన హెచ్చరిక చేశాయి. దేశం గర్వించేలా అధికార, ప్రతిపక్ష నాయకులు, చేతులు కలిపి సయోధ్య ప్రదర్శించారు.
హైదరాబాద్‌లో కేవలం 14 నెలల్లోనే హైటెక్ సిటీని నిర్మించానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో నేడు జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ ప్రతిభతో ఉన్నత స్థానాల్లో ఉంటున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా విట్ ఏపీ క్యాంపస్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం, నూతన స్టార్టప్ ఆలోచనలకు ఊతమిచ్చేందుకు ఏర్పాటు చేసిన విలాంచ్‌ ప్యాడ్ 2025 ఇంక్యుబేషన్ సెంటర్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు.
కాళేశ్వరం మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ భూక్యా హరిరాంని అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసింది ఏసీబీ. హరిరాంతో సంబంధమున్న 14 ప్రదేశాలతో దాడులు చేసింది అవినీతి నిరోధకశాఖ. ఈ దాడుల్లో భూక్యా హరిరాంకి సంబంధించిన భారీ ఎత్తున అక్రమాస్తులున్నట్టు గుర్తించిన ఏసీబీ హరిరాంను గజ్వేల్ లో శనివారం అరెస్టు చేసింది.
Hanmakonda, Elkaturthi, BRS Party, Silver Jubilee Celebration, Rahul Gandhi, Janareddy, KK, Vem Narender Reddy, Operation Kagar,KCR, KTR, Maoists
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.