అనీల్ మళ్లీ మొదలెట్టేశారు!

Publish Date:Jul 1, 2023

Advertisement

వివాదాస్పద వ్యాఖ్యలతో   వార్తల్లో  నిలిచేందుకు  మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నానా అగచాట్లూ పడుతున్నారంటూ తెలుగుదేశం విమర్శలు గుప్పిస్తున్నది. నెల్లూరు సిటీ  నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ గా మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు పి. నారాయణను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం ( జూన్ 30) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగితే.. ఆ స్థానం నుంచి తనను తానే వైసీపీ అభ్యర్థిగా ప్రకటించుకున్న అనీల్ కుమార్ యాదవ్ సినిమా ఎత్తిపోయినట్లేనని నెల్లూరు వైసీపీ శ్రేణులే బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నాయి.

ఇప్పటికే పలు వివాదాలతో నిండా మునిగి ఉన్న అనీల్ కుమార్ యాదవ్ నియోజకవర్గంలో ప్రజాదరణను కోల్పోయారనీ, సొంత పార్టీలోనే ఆయన పట్ల తీవ్రమైన అసంతృప్తి వెల్లువెత్తుతోందనీ వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. అంతే కాకుండా ఇటీవల గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ నిర్వహించిన వర్క్ షాప్ లో పెర్ఫార్మెన్స్ సరిగా లేదంటూ ప్రకటించిన 19 మంది ఎమ్మెల్యేలలో అనీల్ కుమార్ యాదవ్ కూడా ఒకరు అన్న వార్తలు వెలువడ్డాయి. అందుకు తగ్గట్టుగానే చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న అనీల్ కుమార్ యాదవ్ గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ తరువాత ఒక్కసారిగా నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

అయితే వైసీపీ క్యాడర్ మాత్రం ఆయన వెంట నడిచే పరిస్థితులు కనిపించకపోవడంతో ఫ్రస్ట్రేషన్ కు లోనయ్యారు. హైదరాబాద్ లో ఓ పార్కింగ్ ప్లేస్ వద్ద సెక్యూరిటీ గార్డుపై చేయి చేసుకుని వార్తల్లోకెక్కిన మరుసటి రోజే నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ నారాయణపై సంచలన ఆరోపణలు చేసి మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు.  నారాయణ గత కార్పొరేషన్ ఎన్నికలలో  సొంత పార్టీ అయిన తెలుగుదేశం అభ్యర్థులను ఓడించమంటూ తనకు సొమ్ములు పంపారని నిరాధార ఆరోపణలు గుప్పించారు.  అయితే తాను అందుకు అంగీకరించలేదనీ, నారాయణ పంపిన డబ్బులను వాసస్ చేశాననీ అనీల్ పేర్కొన్నారు. సందర్భం రాకపోవడంతో ఈ విషయాన్ని తాను ఎందుకు ఇంత వరకూ బయటపెట్టలేదన్నారు.

తాను ఇషామాషీగా ఈ ఆరోపణలు చేయలేదనీ, వాటికి కట్టుబడి ఉన్నాననీ, ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని అనీల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.  అంతే కాకుండా తెలుగుదేశం పార్టీలో జెండా మోసిన వారిని మోసం చేయడం అన్నది మాలూలు విషయమేనని  అనీల్ కుమార్ యాదవ్ అన్నారు.  నారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగితే... ఒక వేళ తనకు వైసీపీ టికెట్ వస్తే ఇస్తే ఓటమి తప్పదన్న భయంతోనే  అనీల్ కుమార్ యాదవ్ ఇప్పుడీ ఆరోపణలు చేస్తున్నారని  తెలుగుదేశం నాయకులు అంటున్నారు.  నారాయణపై అనీల్ కుమార్ యాదవ్ చేసిన ఆరోపణలు ఆయనలోని ఫ్రస్ట్రేషన్ కు నిలువెత్తు నిదర్శనమని అంటున్నారు.

By
en-us Political News

  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.