యాంకర్, నటి అసనూయపై కేసు.. ఎందుకంటే?
Publish Date:Aug 17, 2026
Advertisement
ప్రముఖ యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ మరో సారి వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవల ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. జై శ్రీరాం వంటి నినాదాలపై ఆమె చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు నమోదైంది. విషయమేంటంటే.. ఇటీవల ఒక సందర్భంలో అనసూయ.. సనాతన ధర్మంతో పాటు జై శ్రీరామ్ నినాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు, దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడిన అనసూయపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. బీజేపీ నేతలు బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు అనసూయపై కేసు నమోదు చేశరు. కాగా తనపై కేసు నమోదు కావడం, తన వ్యాక్యలపై విమర్శలు వెల్లువెత్తడంపై నటి అనసూయ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం స్పష్టం చేసిన ఆమె కేవలం నినాదాలు చేయడం మాత్రమే ధర్మం అనిపించుకోదనీ, ప్రవర్తన, నైతిక విలువలు ఎంతో కీలకమని చెప్పడమే తన ఉద్దేశమన్నారు. తాను సనాతన ధర్మాన్ని, హైందవ సంప్రదాయాలను గౌరవిస్తాననీ.. శ్రీరాముడిని, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తానని పేర్కొన్న అనసూయ, తన వ్యాఖ్యల వల్ల సమాజంలో ఉన్న అసలైన దొంగలు, ముసుగు వేసుకున్న వ్యక్తులు బయటకు వస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. Anasuya Bharadwaj, Borabanda Police Station, Sanatana Dharma Controversy, BJP Leaders Complaint, Jai Shri Ram Remarks
http://www.teluguone.com/news/content/anasuya-bharadwaj-36-229067.html





