అబద్ధం ఓ అందమైన అలవాటు

Publish Date:Oct 31, 2016

Advertisement


కొంతమంది పదేపదే అబద్ధాలు ఎందుకు చెబుతుంటారు? ఏదో అలవోకగా అడేసిన చిన్నపాటి అబద్ధం గొలుసుకట్టు అబద్ధాలకి ఎందుకు దారి తీస్తుంది? ఇలా అబద్ధాల చెప్పే అలవాటుని శాస్త్రీయంగా రుజువుచేయవచ్చా?... ఇలాంటి సందేహాలే వచ్చాయి లండన్‌కు చెందిన ‘టాలీ షారోట్‌’ అనే మనస్తత్వ శాస్త్రవేత్తకి. తన సందేహాలు రుజువు చేసుకునేందుకు ఆయన ఓ చిత్రమైన పరిశోధనని చేపట్టారు. 

 

చిల్లర డబ్బుల పరిశోధన.

టీలీ షారోట్ తన పరిశోధన కోసం 18 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వయసు వరకు ఒక 80 మంది అభ్యర్థులను ఎన్నుకొన్నారు. వీళ్లకి చిల్లర డబ్బులు ఉన్న ఒక సీసాను చూపించి అందులో ఉన్న డబ్బుల గురించి ఇతరులకి చెప్పమన్నారు. అవతలివారికి డబ్బు గురించి లెక్కలు చెప్పేటప్పుడు అబద్ధం చెప్పే స్వేచ్ఛని కూడా ఇచ్చారు. అయితే ఇందులో మూడురకాల పరిస్థితులను కల్పించారు. కొన్ని సందర్భాలలో అబద్ధం వల్ల చెప్పినవాడికీ, విన్నవాడికీ కూడా మేలు జరుగుతుంది. మరికొన్ని సందర్భాలలో అబద్ధం చెప్పడం వల్ల ఇద్దరిలో ఎవరో ఒకరికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని సందర్భాలలో అబద్ధం చెప్పడం వల్ల ఒకరికి లాభం జరగడమే కాదు, అవతలివారికి నష్టం కూడా కలుగుతుంది.

 

మెదళ్లని పరిశీలించారు

అభ్యర్థులు ఇలా పోటీలు పడి అబద్ధాలు చెప్పే సమయంలో వారి మెదడుని అత్యాధునిక fMRI స్కానింగ్‌ ద్వారా పరీక్షించారు. మెదడులోని ‘అమిగ్డలా’ అనే కేంద్రం భావోద్వేగాలను నియంత్రిస్తుంది. అబద్ధం చెప్పిన ప్రతిసారీ ఈ అమిగ్డలాలో ఎలాంటి స్పందనలు నమోదయ్యాయో పరిశోధకులు గమనించారు. చిత్రం ఏమిటంటే తొలిసారి అబద్ధం చెప్పినప్పుడు ఈ అమిగ్డలా చాలా తీవ్రంగా స్పందించింది. అబద్ధం చెప్పేందుకు అతను ఊగిసలాడుతున్నట్లు దీనివల్ల తేలిపోయింది. కానీ అబద్ధాలు సాగుతున్నకొద్దీ దీని ప్రతిస్పందన తగ్గిపోయిందట. దీనివలన అభ్యర్థులు మరింత పెద్ద అబద్ధాన్ని కూడా అలవోకగా చెప్పడాన్ని గమనించారు. పైగా తనకి లాభం కలిగేలా అబద్ధం చెప్పినప్పుడు అమగ్డోలా స్పందన నామమాత్రమగానే మిగిలిపోతోందని తేలింది. అంటే తన వ్యక్తిగత స్వార్థం కోసం అభ్యర్ధులు చాలా తేలికగా అబద్ధాలు చెప్పగలిగారన్నమాట.

 

ప్రయోజనాలు

మనిషి అబద్ధం చెప్పినప్పుడు అతని మెదడు ఎలా స్పందిస్తుందనే విషయం మీద ఇదే తొలి పరిశోధన అని చెబుతున్నారు. ఒక వ్యక్తి చెప్పే మాటలు నిజమా కాదా అని నిర్ణయించేందుకు మున్ముందు లై డిటెక్టరు పరీక్షల బదులు ఇలాంటి పరీక్ష మరింత ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు ‘చిన్నచిన్న అబద్ధాలతో మొదలయ్యే ఒక ప్రయాణం ఒకోసారి తీవ్రమైన నేరాలకు ఎలా దారితీస్తుందో అర్థం చేసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుంది’ అంటున్నారు టాలీ షారోట్.

 

- నిర్జర.

By
en-us Political News

  
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.