Publish Date:Jun 13, 2023
ఆంధ్రప్రదేశలో ప్రధానంగా మూడు పార్టీలే క్రియాశీలంగా ఉన్నాయని చెప్పవచ్చు. పేరుకు జాతీయ పార్టీలే అయినా రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి అంతంత మాత్రమే. మీడియా సమావేశాలలోనూ, ఆ పార్టీ జాతీయ నేతలు వచ్చినప్పుడు జరిగే సభల్లోనూ తప్ప ఆ పార్టీ వాయిస్ పెద్దగా వినిపించదు. కేంద్రంలో అధికారంలో ఉంది కనుక బీజేపీ ఉనికి ఒకింత ఎక్కువగా కనిపిస్తుంటుంది అంతే.
కానీ ఎన్నికలు, ఓట్లు విషయానికి వచ్చే సరికి రాష్ట్రంలో ప్రధాన పోటీ తెలుగుదేశం, వైసీపీల మధ్యే. ఇక జనసేన అయితే తెలుగుదేశంతో కలిసి ఎన్నికలలో పోటీ చేయడం అన్నది దాదాపుగా ఖరారైంది. అంతే కాకుండా ఆ పార్టీ ప్రస్తుతానికి బీజేపీతో మిత్రపక్షంగా కూడా కొనసాగుతోంది. ఎలా చూసినా ఏపీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షం అయితే అధికారికంగా లేదనే చెప్పాలి. అటువంటి వేళ విశాఖలో జరిగిన సభలో అమిత్ షా ఏపీలో ఎన్డీయే ప్రస్తావన తెచ్చారు. రాష్ట్రం నుంచి ఎన్డీయేకే కనీసం 20 స్థానాలు దక్కాలని ఆయన సభాముఖంగా అన్నారు. ఆయన మాటలు యథాలాపంగా అన్నవి అయితే కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ రాష్ట్రంలో ఒంటరిగా బరిలోకి దిగేటట్లు ఉంటే బీజేపీకి 20 స్థానాలు రావాలని పిలుపునచ్చి ఉండేవారు.
అందుకు భిన్నంగా ఎన్డీయేకు అన్నిస్థానాలు కావాలని పిలుపునివ్వడం రాజకీయ చర్చకు తెరలేపింది. ఆయన తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలిసి సాగుతుందన్న సంకేతాలిచ్చారా? లేదా జనసేన, బీజేపీ కూటమిగా వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటాయన్న ఉద్దేశంతో అన్నారా అన్నదానిపై రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే అమిత్ షా ఒక్క విషయాన్ని మాత్రం స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ ఒంటరిగా మాత్రం పోటీ చేయడం లేదని ఆయన కుండ బద్దలు కొట్టారు. అదే సభలో జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఆయన కూడా ఏపీలో మిత్రపక్షంగా ఉన్నజనసేన చెప్పిన ప్రభుత్వ ఓటు చీలనివ్వకూడదన్న స్టాండ్ తీసుకున్నారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యమౌతున్నాయన్నది మాత్రం అమిత్ షా మాటల ద్వారా తేటతెల్లమైపోయింది. ఈ నేపథ్యంలోనే జనసేనాని గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తాను బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడతాను అన్న మాటను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amit-shah-speaks-about-nda-39-156767.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.