హత విధీ తెలుగు ఖ్యాతి అల్లూరి విగ్రహావిష్కరణ ఇలాగేనా?

Publish Date:Jul 5, 2022

Advertisement

ఆజాదీ కా అమృతోత్సవ్ లో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రాముఖ్యతను ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం పూర్తిగా రాజకీయం చేసేసింది. తెలుగు ఖ్యాతికి రాజకీయ మకిలి పట్టించిన ఘనతను సొంతం చేసుకుంది.

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తోందన్న చందంగా ఎవరి దృష్టినీ ఆకర్షించని, ఎవరూ పట్టించుకోని కార్యక్రమంలా సాగింది. ప్రధాని మోడీ వచ్చి అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం బహిరంగ సభలో ప్రసంగించినా అదేదో వైసీపీకి చెందిన సొంత వ్యవహారంగానే రాష్ట్ర ప్రజలు భావించారంటే ఆ తప్పు జగన్ సర్కార్ దేనని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలకు అతీతంగా నిర్వహాస్తున్నామంటూ ఘనంగా ప్రకటించినా ఆచరణలో మాత్రం ఈ కార్యక్రమాన్ని తన సొంత ఆధిపత్యం చాటుకోవడానికీ, తన రాజకీయ ప్రత్యర్థులను అవమానించడానికే జగన్ ఉపయోగించు కున్నారన్న విమర్శలు అన్ని వర్గాల నుంచీ వెల్లువెత్తుతున్నాయి. చివరికి వైసీపీ శ్రేణులు కూడా తెలుగు జాతి గర్వించేలా నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని జగన్ సర్కార్ అతి జోక్యం వల్ల   ఒక గల్లీ కార్యక్రమంగా మిగిలిపోయిందని బాహాటంగానే అంటున్నారు.

స్వాతంత్ర సమరయోధులలో అల్లూరిది ఒక ప్రత్యేక అధ్యాయం. తెలుగుజాతి పౌరుషాగ్ని రగిలించిన గొప్ప వ్యక్తిత్తం. కుల, మత, వర్గ, ప్రాంతీయ బేధాలకు అతీతంగా తెలుగువారంతా అల్లూరిని తమ గుండెల్లో కొలువుంచుకున్నారు. అటువంటి మహనీయుని 125వ జయంతి కార్యక్రమాన్ని జగన్ సర్కార్  రాజకీయం చేసి సాదాసీదాగా నిర్వహించేలా చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరికీ ఆజాదీ కా అమృతోత్సవం కార్యక్రమం కనిపించలేదు. మన్యం వీరుడు అల్లూరి 125వ జయంతి స్ఫూర్తి గోచరించలేదు.

  ప్రొటోకాల్ ను, కోర్టు తీర్పులనూ కూడా లెక్క చేయకుండా జగన్ ను విమర్శిస్తున్నారన్న ఏకైక కారణంతో నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజును హాజరు కాకుండా నియంత్రించడానికి జగన్ ప్రభుత్వం పడిన తాపత్రేయం మాత్రమే కనిపించింది. అదే హైలైట్ అయ్యింది. మిగిలిన అన్నీ సోదిలోకి కూడా లేకుండా పోయాయి. ఆఖరికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరై అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాన అంశం కూడా డమ్మీగా మారిపోయింది.  ఈ కార్యక్రమాన్ని రాజకీయ ప్రత్యర్థులను అవమానించేందుకే జగన్ సర్కార్ ఉపయోగించుకుంది. ఇది రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ మాత్రమే కాదు. ప్రతి తెలుగువాడి భావన కూడా. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఈ కార్యక్రమంలో బీజేపీ, వైసీపీ నేతల వినా మరెవరూ కనిపించలేదు. ఆహ్వానం పంపామని వైసీపీ చెబుతున్న తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పేరు ఆహ్వానితుల జాబితాలో లేనే లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం లేఖ వచ్చినా ఆయన పేరు లేదని కలెక్టర్ విస్పష్టంగా చెప్పేశారు. దీంతో పిలిచి అవమానించారని అచ్చెన్నాయుడు అన్నారు.

జనసేన పరిస్థితి అదే. రాష్ట్రంలో మిత్రపక్షం అయినా సరే జగన్ సర్కార్ పై జనసేనాని విమర్శలు చేయడమే ఆ పార్టీ నేతలకూ, అధినేతకూ కూడా ఆహ్వానం అందకపోవడానికి కారణమని సామాన్యులు సైతం గుర్తించేశారంటే జగన్ సర్కార్ ఎంత బాహాటంగా తన రాజకీయ వైరాన్ని ప్రదర్శించిందో అవగతమౌతుంది.  

ఇక మరో ప్రధానమైన అంశం ఏమిటంటే మోడీ పర్యటన ముగించుకుని వెళుతుండగా ఎగిరిన నల్ల బెలూన్లు. ఒక వైపు మోడీ హెలికాప్టర్ మరో వైపు నల్ల బెలూన్లు సమాంతరంగా ఎగిరాయి. ప్రధాని పర్యటన సందర్భంగా ఈ స్థాయి నిరసన వ్యక్తం అవ్వడమంటే అది  పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. రాజకీయ ప్రత్యర్థులను ఈ కార్యక్రమానికి రాకుండా చేయడంపై పెట్టిన దృష్టి మోడీ పర్యటన సందర్భంగా భద్రతపై పెట్టలేదన్నది స్పష్టమౌతోంది. ప్రధాని పర్యటన సందర్భంగా స్ధానికంగా నిరసనల అవకాశంపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి, నిరసనలు వ్యక్తం కాకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదీ, రాష్ట్ర పోలీసు, నిఘా శాఖలదే అనడంలో సందేహం లేదు.

అందుకే మోడీ హెలికాప్టర్ కు సమాంతరంగా నల్ల బెలూన్ల నిరసన రాష్ట్ర ప్రభుత్వ వైఫలమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఏపీలో మోదీ పర్యటనకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ కూడా నిరసనలకు పిలుపు నివ్వలేదు. అల్లూరి తెలుగు స్ఫూర్తి కనుక ఆ కార్యక్రమానికి ఎటువంటి అవాంతరాలూ రాకూడదనే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు భావించాయి. తెలుగుదేశం అధినేత సహా రాజకీయ పార్టీలన్నీ అల్లూరి విగ్రహావిష్కరణను స్వాగతించాయి. ఒక్క వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాత్రమే మోడీ పర్యటన సందర్బంగా నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని ప్రకటించారు.  నల్ల బెలూన్లు ఎగిరాయి. అయితే పోలీసులు మాత్రం ఇది కాంగ్రెస్ నేత పని అని  చెబుతున్నారు.  అయితే ప్రధాని పర్యటనలో ఎలాంటి భద్రతా లోపం లేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. ఎవరో నల్ల బెలూన్లు ఎగరేస్తే భద్రతా లోపం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. 

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.