Publish Date:Jan 24, 2025
అలకనంద కిడ్నీ రాకెట్ కేసును సిఐడికిఅప్పగించే యోచనలో తెలంగాణ సర్కారు ఉంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ లో పెద్ద తలకాయలు ఉన్నట్లు తెలుస్తోంది. సరూర్ నగర్ లో ఉన్న ఈ ఆస్పత్రిలో గత కొన్ని నెలలుగా కిడ్నీ రాకెట్ గుట్టు చప్పుడు కాకుండా నడుస్తోంది. . అలకనంద హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుమంత్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన డాక్టర్ అలకనంద ఆస్పత్రిలో భాగస్వామి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తం ఆరుగురు ఈ కిడ్నీ రాకెట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిని ఇప్పటికే సీజ్ చేశారు. ఒక్కో కిడ్నీ ఆపరేషన్ కోసం అలకనంద 50 నుంచి 55 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. కేవలం ఆరు నెలల క్రితం ప్రారంభమైన ఈ హాస్పిటల్ కిడ్నీ రాకెట్ నడిపించిదంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. కిడ్నీ రాకెట్ నిర్వహించడానికే ఈ ఆస్పత్రి ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. తొమ్మిది పడకలతో ఏర్పాటైన ఈ ఆస్పత్రికి ఇద్దరు తమిళనాడుకు చెందిన గ్రహీతలు, ఇద్దరు కర్నాటక వాసులు డోనర్స్ ను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరిని ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ఉస్మానియా మాజీ సూపరిండెంట్ డాక్టర్ నాగేందర్ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని నియమించింది. కేసు దర్యాప్తులో డాక్టర్ నాగేందర్ కమిటీ ఇచ్చే నివేదిక దర్యాప్తులో కీలకం కానుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/alakananda-kidney-racket-case-to-cid-39-191777.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది