Publish Date:Nov 24, 2024
వరంగల్ స్మశాన వాటిక నుంచి గుజరాత్ వెళ్లిపోతానని ప్రకటించిన వివాదాస్పద అఘోరీ మళ్లీ ఎపిలో ఆదివారం ప్రత్యక్షమైంది. తాజాగా నవంబర్ 24 కర్నూలు జిల్లాలో పెట్టుడు మీసం, గడ్డంతో కనిపించి అందరినీ ఆశ్యర్యపరిచింది. వరంగల్ స్మశాన వాటికలో చితా భస్మం పూసుకుని గుమ్మడికాయ పగలగొట్టి క్షుద్ర పూజలు చేసింది. అఘోరీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో భయానక పరిస్థితిని క్రియేట్ చేసింది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో నాగసాధుగా పరిచయమైన ట్రాన్స్ జెండర్ శ్రీనివాస్ అలియాస్ పింకి తనకు తాను అఘోరీగా ప్రకటించుకుంది. తాను కేదార్ నాథ్ వెళ్లి గురువు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పి తిరిగి తెలంగాణలో ఎంటరైంది, తన కారులో పెట్రోల్ క్యాన్ కనిపించడంతో అఘోరీ ఆత్మార్పణం చేసుకుంటుందేమోనన్న భయంతో సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకుని అఘోరీ స్వస్థలమైన మంచిర్యాలలో వదిలేశారు. అఘోరీకి కౌన్సిలింగ్ ఇచ్చి తెలంగాణ పోలీసులు మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాంకిడిలో వదిలేశారు. అక్కడ్నుంచి ఎపిలో ఎంటరైన అఘోరీ శ్రీకాళహస్తిలో పెట్రోలు పోసుకుని ఆత్మార్పణం చేసుకునే ప్రయత్నం చేసింది. శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న అఘోరీ అక్కడ్నుంచి విజయవాడ కనకదుర్గను దర్శించుకుంది. ఇక్కడితో రెండు తెలుగు రాష్ట్రాల పర్యటన పూర్తయ్యిందని అందరూ ఊహించారు. అనూహ్యంగా మంగళగిరి రోడ్డులో కనిపించి నానా రచ్చచేసింది. ఎపి పోలీసుల మీద భౌతికదాడి చేసి అరెస్టు అయ్యింది. వ్యక్తిగత బెయిల్ మీద ఎపి పోలీసులు వదిలేయడంతో అఘోరీ మళ్లీ తెలంగాణలో ఎంటరైంది. ఈ సారి వరంగల్ స్మశాన వాటికలో తాంత్రిక పూజలు చేయడంతో అందరి దృష్టినాకర్షించింది. కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో నిమ్మకాయలతో పూజలు చేయడంతో స్థానికులు అఘోరీని తరిమివేశారు. ఇన్ని రోజులు తాను అమ్మవారి అవతారం అని చెప్పి సడెన్ గా గడ్డం, మీసంతో కనిపించడంతో స్థానికుల అగ్రహానికి గురైంది. ఇప్పుడు మళ్లీ ఎక్కడ ప్రత్యక్షమౌతుందోనని తెలుగు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు అఘెరీని ఇంత వరకు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపకపోవడం చర్చనీయాంశమైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aghori-spotted-in-kurnool-with-beard-and-moustache-car-reverses-gear-as-locals-object-39-188885.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.