Publish Date:Jan 25, 2025
12 ఏళ్లకు ఒక సారి వచ్చే గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ఏపీ సర్కార్ రెడీ అవుతోంది. ఈ సారి 2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకూ గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు షురూ చేసింది. ప్రాథమిక అంచనా మేరకు ఈ సారి గోదావరి పుష్కరాలకు ఎనిమిది కోట్ల మంది భక్తులు వస్తారు. ఘాట్ల నిర్వహణ, తొక్కిసలాటలు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై పూర్తిగా దృష్టి పెట్టింది.
ఫలానా ఘాట్ లోనే స్నానం చేయాలన్న నియమం ఏదీ లేదనీ, ఏ ఘాట్ లోనైనా స్థానం చేయవచ్చునన్న ప్రచారానికి పెద్ద పీట వేయాలని నిర్ణయించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఘాట్ల అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇప్పటికే ఘట్ల అభివృద్ధికి 904 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రెడీ చేసింది. గోదావరి పుష్కరాల కోసం కేంద్రం ఇప్పటికే వంద కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ విస్తరణ, ఆధునీకరణ కోసం 271.43 కోట్ల రూపాయలు కేటాయించింది.
దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు నిర్ణయించింది. వాటి వివరాలను ముందుగానే వెల్లడించేందుకు అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా కార్యాచరణను కూడా సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్, టూరిజం, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా పుష్కర ఏర్పాట్ల పైన సమీక్ష నిర్వహించాలని ఆదేశించింది .యాత్రికుల బస ఏర్పాట్లతోపాటు రాజమహేంద్రవరంలో ప్రస్తుతం ఉన్న ఘాట్లకు అదనంగా మరో నాలుగు కొత్త ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
కార్పొరేషన్ పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్అండ్బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు రెడీ చేశారు. ని త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గోదావరి పుష్కరాల పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కార్యాచరణ ఖరారు చేయడానికి అధికారులు సమాయత్తమౌతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/action-plan-ready-for-godawary-pushkaralu-39-191855.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!