ఏబీవీ పొలిటికల్ ఎంట్రీ.. జగన్ అక్రమాలను బయటకు తీస్తానని వెల్లడి

Publish Date:Apr 13, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు   ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు  ప్రకటించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవులు, అధికారం కోసం కాకుండా ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాలలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జగన్ హయాంలో  జరిగిన అక్రమాలు, అన్యాయాలు ప్రజల ముందుంచుతానన్నారు.   మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు.  జగన్‌తో తనకు వ్యక్తిగత కక్షలు లేవని ఆయన స్పష్టం చేశారు. తన విషయంలో  జగన్ చేయాలనుకున్నది చేస్తే.. తాను చేయాల్సిన పోరాటం చేశానని చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఇక ఆ అధ్యాయం ముగిసిందనీ, ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలైందన్నారు.  జగన్ అరాచకాలు  బయటకు తెస్తానన్నారు.

సండూర్ పవర్‌తో ఆరంభమైన జగన్ అక్రమ సంపాదన ఇప్పుడు లక్షల కోట్లకు చేరిందన్నారు.  అదంతా ప్రజల డబ్బే. దోచుకున్న సొమ్మును చట్టపరంగా బయటకు కక్కిస్తానని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.  కోడికత్తి శ్రీను లాంటి బాధితులు జగన్ హయాంలో వేలల్లో ఉన్నారన్నారు. జగన్ బాధితులందరికీ తన వంతు సహకారం అందించి అండగా ఉంటానని చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ బాధితులు  తనకు సమాచారం అందించాలని కోరారు. తన రాజకీయ ప్రయాణానికి ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు.  అంతకు ముందు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో కోడి కత్తి శ్రీనుతోపాటు అతడి కుటుంబ సభ్యులను  పరామర్శించారు. 

By
en-us Political News

  
కాళేశ్వరం మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ భూక్యా హరిరాంని అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసింది ఏసీబీ. హరిరాంతో సంబంధమున్న 14 ప్రదేశాలతో దాడులు చేసింది అవినీతి నిరోధకశాఖ. ఈ దాడుల్లో భూక్యా హరిరాంకి సంబంధించిన భారీ ఎత్తున అక్రమాస్తులున్నట్టు గుర్తించిన ఏసీబీ హరిరాంను గజ్వేల్ లో శనివారం అరెస్టు చేసింది.
Hanmakonda, Elkaturthi, BRS Party, Silver Jubilee Celebration, Rahul Gandhi, Janareddy, KK, Vem Narender Reddy, Operation Kagar,KCR, KTR, Maoists
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం. గత ఆ నియోజకవర్గ కేంద్రం అయిన కుప్పం మునిసిపాలిటీ మాత్రం గత ఐదేళ్లుగా వైసీపీ చేతిలో ఉంది. కుప్పం మునిసిపల్ చైర్మన్ గా వైసీపీ నేత డాక్టర్ సుధీర్ రెడ్డి ఉండేవారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత సుధీర్ రెడ్డి తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు.
విశాఖ మహానగర పాలక మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవం ఎన్నికయ్యారు. మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ ప్రతిపాదించగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. మేయర్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. దీంతో మేయర్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కోరం సరిపోవడంతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. జీవీఎంసీ పాలకవర్గ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. జిల్లా సంయుక్త కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి.. కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ టీం మొత్తం ఇప్పుడు విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కపెడుతోందా? అంటే అందరూ కాకపోయినా చాలా మంది పరిస్థితి అలాగే ఉందని సమాధానం వస్తుంది.
అమరావతి పనుల పున: ప్రారంభానికి మే2న ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు షెడ్యూల్ కూడా ఖరారైంది. మోడీ పర్యటనను విజయవంతం చేయడానికి ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ4 గా నమోదు అయిన రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇటీవల సీఐడీ అధికారులు విచారించారు. తర్వలో మరోసారి విచారణకు హాజరు అవ్వాలని నోటీసులు ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికలలో పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ చరిత్రలో అత్యంత కీలకమైన రాజకీయ సభ ఏదైనా ఉందంటే... అది ఆదివారం వరంగల్ వేదికగా జరిగిన రజతోత్సవ సభ మాత్రమే.
వేసవి సెలవులు కావడం, ఇంటర్ టెన్త్ పరీక్షా ఫలితాల విడుదల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. మరీ ముఖ్యంగా వారాంతాలలో అయితే తిరుమల కొండపై ఇసుక వేస్తే రాలనంతగా భక్త జనసందోహం ఉంటోంది.
తినేమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం (ఏప్రిల్ 28) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ లోనే అనుమతిస్తున్నారు.
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటక సెక్రటరీ స్మితా సభర్వాల్‌ను ఫైనాన్స్ క‌మిష‌న్ మెంబ‌ర్ సెక్ర‌ట‌రీగా స్మితా స‌బ‌ర్వాల్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అవసరమైతే డైరీల్లో రాసుకోండి అని సూచించారు. పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. అత్యుత్సాహం ప్రదర్శించొద్దని సూచించారు. ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని.. నేను కూడా రేపటినుంచి బయల్దేరుతా ఒక్కొక్కరి సంగతి చూస్తా అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.