Publish Date:May 18, 2023
ఆంధ్రప్రదేశ్ లో అన్ని సేవలు ఒక ఎత్తైతే ఆరోగ్య శ్రీ ఒక్కటే ఒక ఎత్తు. వైసీపీ ప్రభుత్వం ఫ్లాగ్ షిప్ గా చెప్పుకునే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించలేదంటూ ఆరోగ్య శ్రీ ఆస్పత్రులు రోడ్డెక్కాయి. మే 19వ తేదీ నుంచి అన్ని సేవలూ నిలిపివేస్తున్నట్లు ఆరోగ్య శ్రీ ఆస్పత్రల నెట్ వర్క్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల నెట్ వర్క్ అసోసియేషన్ లెక్కల ప్రకారం ప్రభుత్వ బకాయిలు 2000 కోట్లకు పైమాటే. ఇలాంటి సందర్భంలో ఆరోగ్య సేవలు అందించడం తమ వల్ల కాదని అసోసియేషన్ తేల్చి చెప్పింది. మొత్త 30 విభాగాలలో 2059 వ్యాధులు ఆరోగ్య శ్రీ పరిధిలోకి రావడంతో దాదాపు అందరూ ఈ సేవలను వినియోగించుకుంటున్నారు.
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ఏడాదికి 5లక్షల రూపాయలు మించకుండా ఆరోగ్యశ్రీ సేవలను ప్రభుత్వం అందిస్తోంది. అన్ని ఆస్పత్రులలో ఆరోగ్య శ్రీ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరగడంతో బిల్లులు కూడా గణనీయంగా పెరిగిపోయాయి.
గతంలో సమ్మె నోటీసు ఇచ్చిన నెట్ వర్క్ హాస్పటల్స్ అసోసియేషన్ ప్రభుత్వ హామీతో వెనక్కు తగ్గింది. కానీ కేవలం 20 కోట్ల రూపాయలే ప్రభుత్వం విడుదల చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సేవలు బంద్ చేస్తున్నామని నెట వర్క్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకు నోటీసులు అందజేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aarogya-sree-services-bundh-39-155535.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!