బిజేపీని ఓడించాలంటే ప్రతి పక్షాలు ఐక్యమవ్వాలి: ఓవైసీ

Publish Date:Apr 15, 2023

Advertisement

ప్రతి పక్ష పార్టీలు బిజేపీ సిద్దాంతాలతో రాజీ పడటం వల్లే ముస్లింల మీద దాడులు పెరిగిపోతున్నాయని మజ్లిస్ పార్టీ ప్రెసిడెంట్ ఆరోపించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అజీజా మదర్సాకు వెళ్లకపోవడం విచారకరమన్నారు. 4,500 మనుస్క్రిప్ట్ లు ఇదే మదర్సాలో తగలపడ్డాయన్నారు. ఇందులో ఖురాన్ కూడా ఉందని ఆయన మండిపడ్డారు. ముస్లింపిల్లలు దేశంలో నిరక్షరాస్యతకు గురవుతున్నారని, ముస్లిం జనాభా వున్న ప్రాంతాల్లో స్కూల్ జోన్స్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లింలు వున్న ప్రాంతాల్లో స్కూల్స్ తెరవడం లేదని, ఫలితంగా ముస్లిం పిల్లలు మదర్సాలలో విద్య నభ్యసిస్తున్నారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం బడుగు, బలహీన వర్గాలకు పాజిటివ్ సంకేతం ఇవ్వడమేనన్నారు. రాజ్యాంగంలో ఈ వర్గాలకు పెద్ద పీటవేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ ముదావహమన్నారు.

బీజేపీ సిద్దాంతాలను అపోజిషన్ పార్టీలు ముక్త కంఠంతో నినదించాలని, అప్పుడే 2024 ఎన్నికల్లో ఆ పార్టీని అధికారంలో రాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీ ప్రభుత్వం అందరికీ విద్యాహక్కు చట్టం అమలు చేయడంలో విస్మరించిందన్నారు. యుపీఏ ప్రభుత్వం హాయంలో ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ వచ్చేదని మోడీ అధికారంలో వున్న 8 ఏళ్లలో ఈ స్కాలర్ షిప్ విస్మరించిందన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓవైసీ బిజేపీ ప్రభుత్వ పనితీరును తూర్పారబట్టారు. మజ్లిస్ పార్టీ దేశవ్యాప్తంగా బిజేపీయేతర పార్టీలతో జతకడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్న ఓవైసీ కాంగ్రేస్ లేదా బీజేపీయేతర పార్టీలను అధికారంలో తీసుకురావడానికి ఇప్పటికే దేశ వ్యాప్త ప్రచారాన్ని మొదలెట్టారు. బీజేపీని ఓడించడమే పరిష్కారమన్నారు. బీజేపీ సిద్దాంతాలతో అపోజిషన్ పార్టీలు రాజీ పడుతున్నాయన్నారు.

By
en-us Political News

  
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.